అన్వేషించండి

Malkajgiri News: నాలాలో కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన - 3 గంటలుగా అందులోనే

Telangana News: జీహెచ్ఎంసీ అధికారులు పనులలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ నాలాలో కూర్చొని మూడు గంటలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన తెలిపారు.

BRS News: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నాలాలో కూర్చొని నిరసన తెలిపారు. మల్కాజిగిరి గౌతమ్ నగర్ డివిజన్‌లో ఆయన ఈ నిరసన ప్రదర్శన చేశారు. గత ఆరు నెలలుగా రోడ్డును తవ్వి కాలనీ వాసులను జీహెచ్ఎంసీ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారులు పనులలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాలాలో కూర్చొని మూడు గంటలుగా ఎమ్మెల్యే నిరసన తెలిపారు.

ప్రజా సమస్యల కోసం ఎక్కడ సమస్య ఉన్నా తాను నిరంతరం నిరసన తెలుపుతూనే ఉంటానని మర్రి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజా పాలన అందిస్తున్నా అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై స్పందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వర్షాకాలం వస్తున్నప్పటికీ ఇంకా ఏ చర్యలు తీసుకోలేదని.. కాలనీలు నీటిలో మునిగే పరిస్థితి ఉన్నా అధికారుల ఇంకా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారని మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వెంటనే రహదారి పగలగొట్టిన చోట దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ పనుల పర్యవేక్షణకు వచ్చినా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

‘‘మల్కాజ్ గిరి నియోజకవర్గం 141 వ డివిజన్ పరిధిలోని పాత మిర్జల్ గుడా పరిసర ప్రాంతాలలో నిన్నటి అకాల వర్షం కారణంగా పలు కాలనీలో తీవ్రంగా దెబ్బతిన్న బాక్స్ డ్రెయిన్ లను స్థానిక కార్పొరేటర్ సునీత రాము యాదవ్ తో కలిసి పరిశీలించాను. జీహెచ్ఎంసీ అధికారులకి ముందస్తుగా నా పర్యటన వివరాలను తెలియచేసినప్పటికీ సెలవులపై వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గతంలో పలు మార్లు మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ప్రతి సమస్యల పరిష్కారం కోసం నా తరుపున Deputy Commissioner Malkajgiri, GHMC నుండి కింది స్థాయి అధికారులు వరకు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం శూన్యంగా ఉంది.
 
నా ఆధ్వర్యంలో గతంలో ఎన్ని వినతులు ఇచ్చినా అధికార్ల నిర్లిప్తత అలసత్వం తీవ్ర ఆవేదనకి గురి చేస్తుంది. ప్రజలను ఇబ్బందులు పెట్టడమే ప్రజాపరిపాలనా? అని సీఎంవోను ప్రశ్నిస్తున్నాను. ఉదయం నుంచి జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు నాకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. దీనిపై ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను. దీనిపై అధికార్లు చర్యలపై ఉపక్రమించకపోతే ఈ నిరసనను ఉధృతం చేస్తామని తెలియచేస్తున్నాను’’ అని మర్రి రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Embed widget