అన్వేషించండి

NTR Coin: ఎన్టీఆర్ రూ.100 నాణెం ఆవిష్కరణకు నన్నూ పిలవండి - రాష్ట్రపతికి లక్ష్మీ పార్వతి లేఖ

NTR Coin: ఎన్టీఆర్ రూ.100 నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి తనను కూడా పిలవాలని విజ్ఞప్తి చేస్తూ లక్ష్మీ పార్వతి రాష్ట్రపతికి లేఖ రాశారు.

NTR Coin: మాజీ ముఖ్యమంత్రి, వెండితెర మేరునగధీరుడు ఎన్టీ రామారావు శతజయంతి వేళ ఆయన చిత్రంతో రూ.100 నాణెం తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నాణెం ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు 28వ తేదీన రాష్ట్రపతి భవన్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు 100 మందిని ఆహ్వానించారు. అయితే ఎన్టీ రామారావు భార్య అయిన లక్ష్మీ పార్వతికి మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. దీంతో ఆమె రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. తనకు కూడా ఎన్టీఆర్ రూ.100 నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం ఇవ్వాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. 

'నేను 11.09.1993 తేదీన స్వర్గీయ ఎన్టీ రామారావుతో వివాహం చేసుకున్నాను. మేమిద్దరం కలిసి ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడిపాము. 1994లో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నాం. మా నాయకత్వంలో టీడీపీ పార్టీ 294 లో 226 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుుంది. ఎన్టీ రామారావు పెద్ద అల్లుడి(చంద్రబాబు నాయుడు) కుట్రతో, ఇతర కుటుంబసభ్యులతో కలిసి కుమ్మక్కై అధికారాన్ని సంపాదించుకున్నారు. ఇది ఎన్టీఆర్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆయన తన పిల్లల కుటుంబాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన 18.01.1996న ప్రాణాలు కోల్పోయారు. హాస్యాస్పదంగా ఆయన మరణానికి కారణమైన కుటుంబ సభ్యులనే ఇప్పుడు ఆయన జ్ఞాపకార్థం తీసుకువస్తున్న రూ.100 నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆయన చట్టబద్ధమైన వారసురాలినైన భార్యను (నందమూరి లక్ష్మీ పార్వతి) పట్టించుకోలేదు. దీనికి బాధ్యులైన అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో 28.08.23 రోజున జరగబోయే రూ.100 నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథుల జాబితాలో నా పేరును కూడా చేర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను' అంటూ లక్ష్మీ పార్వతీ రాష్ట్రపతికి లేఖ రాశారు. 

ఎన్టీఆర్ శత జయంతి  ఉత్సవాల సందర్భంగా నాణెం                                  

నందమూరి తారక రామారావు పేరుతో రూ.100 నాణేన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ.100 నాణేన్ని ముద్రించింది. అయితే ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం నుంచి ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు 10 రోజుల క్రితం సమాచారం అందించింది.

Also Read: Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండింగ్: ఆ రోజు పుట్టిన శిశువుకు చంద్రయాన్‌గా నామకరణం

ప్రత్యేక లోహాలతో నాణెం తయారీ                              

ఈ వంద రూపాయల ఈ కాయిన్ 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది.అలాగే ఐదు శాతం నికెల్ ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ,భాషలలో 1923-2023 అని ముద్రించినట్లుగా  ఆర్బీఐ తెలిపింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget