అన్వేషించండి

KTR Fires on Revanth Reddy: నోట్ల కట్టలతో దొరికిన చరిత్ర రేవంత్ రెడ్డిది.. సీఎం అయ్యాక కూడా బుద్ధి మారలేదు: కేటీఆర్

KTR press meet at Telangana Bhavan : తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉందని, ఆ బురదనే అందరికీ అంటించాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు గౌరవం ఇచ్చి బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీష్ రావు విచారణకు హాజరయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అధికారం దక్కినా రేవంత్ రెడ్డి బుద్ధి మాత్రం మారలేదని, అడ్డగోలు సిట్ విచారణలతో ఎన్ని తమాషాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఇప్పటివరకు ఏ అధికారి అధికారికంగా మాట్లాడలేదని, కేవలం లీకులతోనే కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. గతంలో హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసినా, కుట్రపూరితంగా ప్రజల సొమ్ముతో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో వాదిస్తోందని ఆరోపించారు.

సింగరేణి బొగ్గు కుంభకోణం, సృజన్ రెడ్డి ప్రమేయం

 బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందువల్లనే కక్షతో హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కేంద్రంగా సింగరేణిలో టెండర్ల రిగ్గింగ్ జరుగుతోందని, సుమారు తొమ్మిది టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబమే నియంత్రిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 'సైట్ విజిట్ సర్టిఫికెట్' అనే నిబంధన తెచ్చి, కంపెనీలను బెదిరిస్తున్నారని, సృజన్ రెడ్డి స్వయంగా ఈ దందా నడిపిస్తున్నారని ఆరోపించారు. భట్టి విక్రమార్క రద్దు చేశామంటున్న నైనీ కోల్ బ్లాక్స్ వెనుక కూడా ఇదే అక్రమ దందా ఉందని, ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ దోపిడీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని, ఇందులో బీజేపీకి కూడా వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఫల్యాలు, డైవర్షన్ పాలిటిక్స్

అమృత్ టెండర్లు, రేషన్ బియ్యం స్కాం, లగచర్ల, మూసీ వంటి అంశాలపై తాము సాక్ష్యాధారాలు చూపినప్పుడల్లా ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు (Attention Diversion) ఇటువంటి నోటీసులు ఇస్తోందని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ఎనిమిది మంది మంత్రులను ధైర్యంగా ఎదుర్కొన్న హరీష్ రావుకు నలుగురు పోలీసుల విచారణ పెద్ద లెక్క కాదన్నారు. చట్టం, రాజ్యాంగంపై ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని, ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. పొంగులేటి కొడుకు భూకబ్జా యత్నంపై, సీఎం అనుచరుల తుపాకీ బెదిరింపులపై ఎందుకు సిట్ వేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ జర్నలిస్టులపై వేధింపులు ఆపాలని, కేవలం లీకులతో వార్తలు రాపించుకుంటే నిజాలు దాగవని హితవు పలికారు.

BRS భవిష్యత్తు కార్యాచరణ

రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో పోలీసులు బలి కావద్దని, అక్రమ కేసులు పెడుతున్న అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామన్నారు. రేవంత్ రెడ్డి హార్వర్డ్ పర్యటనపై స్పందిస్తూ, అక్కడ కూడా తన అసభ్యకర భాషను వాడుతారా అని ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్ రాదని చెప్పే రేవంత్ రెడ్డి అక్కడ ఏం నేర్చుకుంటారో చూడాలన్నారు. తమ పార్టీ జెండా గద్దెలను ముట్టుకుంటే కాంగ్రెస్ గద్దెలు పోవడం ఖాయమని, తమ కార్యకర్తలు దాడులను సహించరని హెచ్చరించారు. గత పదేళ్లలో తాము ఎప్పుడూ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయలేదని, రేవంత్ రెడ్డి కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget