అన్వేషించండి

KTR: రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాసులు.. మూటలు మోస్తూ తెలంగాణ పరువు తీస్తున్న సీఎం: కేటీఆర్

KTR Press Meet at Telangana Bhavan | రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాసులు ఉన్నారని, వారికి మూటలు మోసేందుకు 44సార్లు ఢిల్లీకి వెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

KTR Comments at Telangana Bhavan : యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండటం రాష్ట్రానికి అవమానకరం అన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటములు, ఛీత్కారాలు ఎదుర్కొని సీఎం అయ్యాక మారారనుకుంటే ప్రజల పొరపాటే. ఆయన ఏమాత్రం మారలేదు. యంగ్ ఇండియా వెనుక కథేంటో ఈడీ ఛార్జిసీటు తేల్చి చెప్పింది. గతంలో ఓటుకు నోట్లు కేసులో రేవంత్ పాత్రను ఎవరూ మరిచిపోరు. ఇది సీటుకు మూటల కుంభకోణం. రేవంత్ రెడ్డి గురించి గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రూ.50 కోట్లు పెట్టి పీసీసీ చీఫ్ పదవిని తెచ్చుకున్నారని చెప్పడం నిజం కాదా?

పీసీసీ చీఫ్ పదవి కోసం ఆనాడు రేవంత్ డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు తన సీఎం పదవిని కాపాడుకునేందుకు తెలంగాణ నుంచి మూటలు ఢిల్లీకి పంపుతున్నారు. యావత్ తెలంగాణ పరువుతీసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కర్ణాటక సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప పేరు హౌసింగ్ స్కామ్ లో ఆయన పేరు రాగా రాజీనామా చేసి, విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీ, నైతికత ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. లేక కాంగ్రెస్ పెద్దలు ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలి. మూటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీకి మూటలతోనే సీఎం పదవిని కాపాడుకున్నారని ఈడీ సైతం చెబుతోంది. 

16 నెలల్లో 44సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి కథ ఏంటో తేలిపోయింది. తనను కేసుల నుంచి తప్పించేందుకు రేవంత్ రెడ్డి చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నారు. ఆయనకు ఇద్దరు బాస్‌లు. ఓ బాస్ రాహుల్ గాంధీ అయితే.. మరో బాస్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా. ఏడాదిన్నరలో రేవంత్ రెడ్డి చేసింది బీఆర్ఎస్ నేతలపై నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు. అన్ని విషయాలు మాట్లాడే రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీటులో రేవంత్ రెడ్డి పేరు వస్తే ఎందుకు నోరు విప్పడం లేదని’ కేటీఆర్ ప్రశ్నించారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు ఉంటాయని రేవంత్ రెడ్డికి తెలుసు. అ కేసులో రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఈడీ ఛార్జిషీటుతో అందరికీ తెలిసింది. ఛార్జిషీటులో రేవంత్ రెడ్డి పేరు ఉంటదన్న సమాచారంతోనే ఆయన మౌనంగా ఉన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకుని తిరుగుతాడు. కానీ తెలంగాణ సీఎంపై వచ్చిన ఆరోపణలపై స్పందించి రేవంత్ రెడ్డిని రాజీనామా చేపించాలి. ఆ పార్టీకి నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలి. కర్ణాటకలో అయితే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను తప్పించాలని అక్కడి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్. రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు, ఈడీ ఛార్జిషీటులో పేరున్నా సీఎంపై బీజేపీ నేతలు ఒక్క మాట మాట్లాడటం లేదు. మీరు, మీరు కుమ్మక్కై పరస్పరం అవినీతి ప్రోత్సహించుకుంటూ కాపాడుకుంటున్నారు. పొంగులేటి ఇంట్లో ఈడీ దాడుల సమయంలో నోట్ల కట్టలు లెక్కించేందుకు మెషీన్లు వెళ్లాయని ప్రచారం కావడం నిజం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jupally Krishna Rao: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Constable Revathi: కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Embed widget