అన్వేషించండి

Krishna Board Meeting: ఈనెల 10న కృష్ణా బోర్డు సమావేశం, చర్చ దేని గురించంటే?

Krishna Board Meeting: కృష్ణా నదీ జలాల్లో వాటాలా పంపకాలపై ఈనెల 10వ తేదీన కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించనుంది. 50 శాతం నీటి పంపిణీ చేయాలన్న అంశాన్ని అజెండాలో చేర్చినట్లు తెలుస్తోంది.

Krishna Board Meeting: కృష్ణా నదీ జలాల్లో వాటాల పంపకాలపై ఈనెల 10వ తేదీన సమావేశం జరగనుంది. తెలంగాణ గతేడాది నుంచి పట్టుబడుతున్న కృష్ణా జలాల్లో చెరి 50 శాతం చొప్పున నీటి పంపిణీ చేయాలన్న అంశాన్ని ఎజెండాలో చేర్చారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ లేవనెత్తుతున్న అభ్యంతరాలు కూడా చర్చకు రాబోతున్నాయి. 2022-23 వాటర్ ఇయర్ లో నీటి పంపకాలు చేయకుండానే పూర్తి కానిచ్చిన నదీ యాజమాన్య బోర్డు ఈసారి రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులకు సమావేశ ఎజెండాను పంపించింది. ఇప్పటి వరకు ఉన్న 66:34 నీటి పంపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గతేడాది మే 6వ తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణ అధికారులు మొదట చెరిసగం నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసినా, చివరలో బోర్డు ఛైర్మన్ విచక్షణకే వదిలేశారు. దీంతో తెలంగాణ అధికారులపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా సమావేశంలో గట్టిగా పట్టుబట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం తాగునీటికి కేవలం 20 శాతం మాత్రమే కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీతోపాటు పలు ప్రాంతాల్లో సెన్సార్ ఆధారిత రియల్ టైమ్ డేటా ఆక్విజేషన్ సిస్టమ్ కూడా ఈసారి బోర్డు ఎజెండాలో చేర్చారు. ఆర్డీఎస్ ఆధునీకరణ, కుడి కాలువ పనుల నిలిపివేత కోసం తెలంగాణ చేసిన విజ్ఞప్తిని సమావేశంలో చర్చకు పెట్టారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలనే అంశం కూడా ఈసారి సమావేశంలో ముఖ్యాంశం కానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో అవసరం లేకున్నా తెలంగాణ జల విద్యుత్ ఉత్పాదన చేస్తుందన్న ఏపీ అభ్యంతరాలు, రిజర్వాయర్ మేనేజ్ మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సిఫార్సుల అమలుపై కూడా చర్చించనున్నారు. జల విద్యుత్ ఉత్పాదన, రూల్ కర్వ్ మిగులు జలాల నిర్ధారమ వంటి అంశాలపై కూడా చర్చించబోతున్నారు. అంతే కాకుండా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ సమర్పించిన డీపీఆర్ తో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగామ రూ.1450 కోట్లతో నిర్మిస్తున్న సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి.  

ఫిబ్రవరిలో శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన కృష్ణా రివర్ బోర్డు కమిటీ సభ్యులు 

నూతనంగా నియమితులైన కృష్ణా రివర్ బోర్డు కమిటీ సభ్యుడు, అధికారులు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు. కృష్ణా బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తాతో పాటు కేఆర్ఎంబీ ఎస్సీ అశోక్ కుమార్ ఈఈ శంకరయ్యలు డ్యామ్ ను పరిశీలించి... జలాశయానికి సంబంధించిన ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను డ్యామ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయానికి సంబంధించిన గేట్స్, గ్యాలరీ, రోప్స్ ను పరిశీలించి వాటి పనితీరు తదితర వివరాలను గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. డ్యామ్ ను పరిశీలించిన అనంతరం ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి జెన్ కో అధికారులతో కాసేపు ముచ్చటించారు. అన్ని వివరాలు అడుగుతూ చాలా సేపు చర్చించారు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం డ్యాం నీటి నిల్వలు ఆంధ్ర, తెలంగాణ నీటి వాటలాపై అధికారులతో చర్చించమని సూచించారు. జలాశయంలోని అడుగు భాగంలో ఉన్న గ్యాలరీ డ్యాం గేట్లుకు ఉన్న రోప్ లను.. స్పిల్ వే వాటి పటిష్ఠతపై డ్యాం అధికారులను అడిగి తెలుసుకున్నామన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget