అన్వేషించండి

Krishna Board Meeting: ఈనెల 10న కృష్ణా బోర్డు సమావేశం, చర్చ దేని గురించంటే?

Krishna Board Meeting: కృష్ణా నదీ జలాల్లో వాటాలా పంపకాలపై ఈనెల 10వ తేదీన కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించనుంది. 50 శాతం నీటి పంపిణీ చేయాలన్న అంశాన్ని అజెండాలో చేర్చినట్లు తెలుస్తోంది.

Krishna Board Meeting: కృష్ణా నదీ జలాల్లో వాటాల పంపకాలపై ఈనెల 10వ తేదీన సమావేశం జరగనుంది. తెలంగాణ గతేడాది నుంచి పట్టుబడుతున్న కృష్ణా జలాల్లో చెరి 50 శాతం చొప్పున నీటి పంపిణీ చేయాలన్న అంశాన్ని ఎజెండాలో చేర్చారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ లేవనెత్తుతున్న అభ్యంతరాలు కూడా చర్చకు రాబోతున్నాయి. 2022-23 వాటర్ ఇయర్ లో నీటి పంపకాలు చేయకుండానే పూర్తి కానిచ్చిన నదీ యాజమాన్య బోర్డు ఈసారి రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులకు సమావేశ ఎజెండాను పంపించింది. ఇప్పటి వరకు ఉన్న 66:34 నీటి పంపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గతేడాది మే 6వ తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణ అధికారులు మొదట చెరిసగం నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసినా, చివరలో బోర్డు ఛైర్మన్ విచక్షణకే వదిలేశారు. దీంతో తెలంగాణ అధికారులపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా సమావేశంలో గట్టిగా పట్టుబట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం తాగునీటికి కేవలం 20 శాతం మాత్రమే కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీతోపాటు పలు ప్రాంతాల్లో సెన్సార్ ఆధారిత రియల్ టైమ్ డేటా ఆక్విజేషన్ సిస్టమ్ కూడా ఈసారి బోర్డు ఎజెండాలో చేర్చారు. ఆర్డీఎస్ ఆధునీకరణ, కుడి కాలువ పనుల నిలిపివేత కోసం తెలంగాణ చేసిన విజ్ఞప్తిని సమావేశంలో చర్చకు పెట్టారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలనే అంశం కూడా ఈసారి సమావేశంలో ముఖ్యాంశం కానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో అవసరం లేకున్నా తెలంగాణ జల విద్యుత్ ఉత్పాదన చేస్తుందన్న ఏపీ అభ్యంతరాలు, రిజర్వాయర్ మేనేజ్ మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సిఫార్సుల అమలుపై కూడా చర్చించనున్నారు. జల విద్యుత్ ఉత్పాదన, రూల్ కర్వ్ మిగులు జలాల నిర్ధారమ వంటి అంశాలపై కూడా చర్చించబోతున్నారు. అంతే కాకుండా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ సమర్పించిన డీపీఆర్ తో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగామ రూ.1450 కోట్లతో నిర్మిస్తున్న సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి.  

ఫిబ్రవరిలో శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన కృష్ణా రివర్ బోర్డు కమిటీ సభ్యులు 

నూతనంగా నియమితులైన కృష్ణా రివర్ బోర్డు కమిటీ సభ్యుడు, అధికారులు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు. కృష్ణా బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తాతో పాటు కేఆర్ఎంబీ ఎస్సీ అశోక్ కుమార్ ఈఈ శంకరయ్యలు డ్యామ్ ను పరిశీలించి... జలాశయానికి సంబంధించిన ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను డ్యామ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయానికి సంబంధించిన గేట్స్, గ్యాలరీ, రోప్స్ ను పరిశీలించి వాటి పనితీరు తదితర వివరాలను గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. డ్యామ్ ను పరిశీలించిన అనంతరం ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి జెన్ కో అధికారులతో కాసేపు ముచ్చటించారు. అన్ని వివరాలు అడుగుతూ చాలా సేపు చర్చించారు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం డ్యాం నీటి నిల్వలు ఆంధ్ర, తెలంగాణ నీటి వాటలాపై అధికారులతో చర్చించమని సూచించారు. జలాశయంలోని అడుగు భాగంలో ఉన్న గ్యాలరీ డ్యాం గేట్లుకు ఉన్న రోప్ లను.. స్పిల్ వే వాటి పటిష్ఠతపై డ్యాం అధికారులను అడిగి తెలుసుకున్నామన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Advertisement

వీడియోలు

ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Mahanati Savitri : మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
మహానటి 'సావిత్రి' జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు... 'మహానటి' మూవీ టీంకు సత్కారం
Kiara Advani Sidharth Malhotra : కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?
కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?
5 seater Cheapest car: 5 సీటర్ కార్లలో అత్యంత చవకైన మోడల్ ఏది? 30 వేల జీతం ఉన్నా కొనొచ్చు
5 సీటర్ కార్లలో అత్యంత చవకైన మోడల్ ఏది? 30 వేల జీతం ఉన్నా కొనొచ్చు
Embed widget