అన్వేషించండి

Kishan Reddy letter : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం పచ్చజెండా - సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక లేఖ

Metro project: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రెండో ధశను పట్టాలెక్కించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఏం చేయాలో చెబుతూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

Kishan Reddy letter to CM Revanth Reddy:  భాగ్యనగర వాసుల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులను వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక అధికారిక లేఖ రాశారు. ఇటీవల తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యానని, మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

అధికారుల కమిటీ ఏర్పాటు - రాష్ట్రానికి కేంద్రం పిలుపు
 
మెట్రో రెండో దశ పనుల పర్యవేక్షణ,  సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులతో కూడిన నలుగురు సభ్యుల బృందం ఉంటుంది. ఈ కమిటీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదించే ఇద్దరు అధికారుల పేర్లను వెంటనే పంపాలని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. ఈ కమిటీ ప్రాజెక్టు రూపకల్పన, నిధుల కేటాయింపు మరియు అమలు తీరుపై తుది నిర్ణయాలు తీసుకోనుంది.

మెట్రో నెట్‌వర్క్ స్వాధీనం - కీలక నిబంధన 

మెట్రో మొదటి దశకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ,ప్పందాలు పూర్తయిన తర్వాతే రెండో దశ నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ  సంస్థ ఆధ్వర్యంలో ఉన్న మెట్రో నెట్‌వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది.  ఆ ప్రక్రియ ముగిసిన తర్వాతే రెండో దశకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను  కేంద్రానికి పంపాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ అడ్డంకులు తొలగితేనే కేంద్రం నుండి నిధుల విడుదల,  సాంకేతిక సహకారం సులభతరమవుతుందని ఆయన వివరించారు.   

వేగంగా నిర్ణయం తీసుకోవాలి! 

పెరుగుతున్న నగర జనాభా ,  ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెట్రో రెండో దశను వీలైనంత త్వరగా పూర్తి చేయడం అత్యవసరమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విమానాశ్రయం , నగరంలోని ఇతర శివార్లకు మెట్రో కనెక్టివిటీ కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కేంద్రం పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేయాలని ఆయన తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget