అన్వేషించండి

Hyderabadలో అసదుద్దీన్ ఒవైసీని ఓడించి బీజేపీ జెండా ఎగరవేస్తాం: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి

Kishan Reddy In Hyderabad: వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ లో అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Secunderabad Parliamentry Constituency: హైదరాబాద్: తెలంగాణలో 17 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్​రెడ్డి అన్నారు. మరోసారి ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్​ రెడ్డి కోరారు. సికింద్రాబాద్​పార్లమెంట్ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈసారి బీజేపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించబోతోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్​లో మజ్లిస్​పార్టీని, అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)ని ఓడించి బీజేపీ జెండా ఎగురవేస్తాం. పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ యంత్రాంగం సిద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికలు ధర్మ యుద్ధం లాంటివి. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. దేశం కోసం, ధర్మకోసం, ప్రజల సంక్షేమం కోసం గత 10 ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. వచ్చే 5 సంవత్సరాలు మరింత అంకితభావం, సేవాభావంతో పని చేస్తాం. దేశ ప్రజలు కూడా మోదీని మరోసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఎన్డీఏ టార్గెట్ 400 సీట్లు..
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నాం. దేశంలోని అన్ని సామాజికవర్గాల ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మోదీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ పార్టీ కూడా సమర్థత కలిగిన వ్యక్తిని ప్రజల ముందు చూపించే పరిస్థితి లేదు. మోదీ నాయకత్వంలో ప్రజలకు మరో 5 సంవత్సరాలు సంక్షేమం అందించడంతో పాటు అభివృద్ధి కొనసాగిస్తాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత 4 సెక్టార్ల ద్వారా దేశంలో పని చేయబోతున్నాం. మహిళలు, యువకులు, రైతులు, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం. బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని’ ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం..
కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి శుక్రవారం సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సనత్ నగర్ డివిజన్, మైసమ్మ టెంపుల్ లో పవర్ బోర్ ప్రారంభించారు. అమీర్​ పేట్ డివిజన్, బాపూ నగర్ లో ఆర్వోర్​ ప్లాంట్ ను షురూ చేశారు. ఎస్​ఆర్​ నగర్ వాటర్ ట్యాంక్ పార్క్ లో, దివ్య శక్తి అపార్ట్​ మెంట్ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. బేగంపేట్ డివిజన్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఓపెన్ జిమ్ ను ఓపెన్​ చేశారు. 

మొండా మార్కెట్​ డివిజన్, గ్యాస్ మండి స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో ఓపెన్ జిమ్, బన్సీలాల్ పేట డివిజన్, న్యూ బోయిగూడ, జీహెచ్​ఎఎంసీ గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అడ్డగుట్ట డివిజన్, సాయి నగర్ లో పవర్ బోర్, కొండారెడ్డి కాలనీ పార్క్ లో ఓపెన్ జిమ్, తార్నాక డివిజన్, లాలాపేట్, వినోభా నగర్ లలో కమ్యూనిటీ హాల్, పవర్​ బోర్​ ను ప్రారంభించారు. తార్నాక డివిజన్, నాన్ టీచింగ్ హోమ్ ఓయూ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం వెంకటేశ్వర డివిజన్, జూబ్లీహిల్స్ డివిజన్ లలో ఓపెన్ జిమ్ లను ప్రారంభించారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget