అన్వేషించండి

Kishan Reddy: ఆ వ్యక్తి హరీశ్‌తోనూ ఫోటో దిగారు, చిల్లర డ్రామాలు ఆపండి - కిషన్ రెడ్డి

హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనే వివాదంలో చిక్కుకోవడంతో బీజేపీ నేతలు వరుసగా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, టీఆర్ఎస్ పార్టీ నేతలు అంతా డ్రామా ఆడిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

పట్టుబడ్డ ముగ్గురిలో ఒకరైన నందకుమార్ అనే వ్యక్తి తనతోనే కాదని.. మంత్రి హరీష్ రావుతోను ఫోటో దిగారని అన్నారు. టీఆర్ఎస్‌ నుంచి ఎవరినైనా చేర్చుకోవాలంటే నేరుగా తామే మాట్లాడుకుంటామని, మధ్యవర్తులను పంపే అవసరం లేదని అన్నారు. పార్టీలో చేర్చుకునేందుకు తమకు ఓ కమిటీ ఉందని అన్నారు. నంద కుమార్ ను పంపించాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.

టీఆర్ఎస్ నేతలతో నంద కుమార్ దిగిన ఫోటోలను మీడియా ముందు చూపిన కిషన్ రెడ్డి చూపించారు. కేటీఆర్ బీజేపీ నాయకుడితో మాట్లాడిన ఆడియోను కూడా కిషన్ రెడ్డి మీడియాకు చూపించారు. పార్టీ చేరికలపై ఈటల రాజేందర్ ఆయా పార్టీల నాయకులతో నేరుగా మాట్లాడతారని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారు. ఫాం హౌజ్‌లో దొరికిన సొమ్ము ఎంత? ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలను వారు బయటపెట్టడం లేదు. దొరికిన డబ్బు ఎమ్మెల్యేల నుంచి వచ్చిందా? లేక కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి వచ్చిందా? అనేది తేలాల్సి ఉంది. ముందు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినది సీఎం కేసీఆరే. అలా వచ్చిన ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు, పార్టీలో మంచి స్థానాలు ఇచ్చారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ లెక్కన టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారో చెప్పాలి. మునుగోడులో ఓడిపోతామని ముందే కనిపించినట్లు ఉంది. సానుభూతి పొందేందుకు సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారు. వందలాది ఆర్టీసీ బస్సుల్లో మద్యం సరఫరా చేస్తున్నారు. ఒక ఉప ఎన్నికలలో గెలవడం కోసం ఇంతటి చిల్లర పనులు అవసరమా?’’ అని కిషన్ రెడ్డి అన్నారు.

‘‘గతంలో దుబ్బాక విషయంలోనూ ఇలాంటి చిల్లర పనులు చేశారు. ఇప్పుడు మునుగోడులోనూ ఇలాంటి నాటకాలే ఆడుతున్నారు. అందుకోసం పోలీసులు దిగజారిపోయి వారికి సహకరిస్తున్నారు. ఎన్నికలకు ముందు వేలాదిమంది బీజేపీ కార్యకర్తలకు తాయిలా ఆశ చూపించి టీఆర్ఎస్ లో చేర్పించుకోలేదా? ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలి. త్వరలోనే ఆయన ఆడిన నాటకం అట్టర్ ఫ్లాప్ అవుతుంది’’ అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

మంత్రి హత్యాయత్నం వ్యవహారంలో కూడా బీజేపీ పైనే ఆరోపణలు చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మునుగోడు నాయకులకు కేటీఆర్ ఫోన్‌ చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరమని ప్రలోభపెట్టలేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం వల్ల బీజేపీకి ఒరిగేదేమీ ఉండబోదని అన్నారు. ఈ వ్యవహారంలో సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా జనాల్లో సానుభూతి పొందేందుకు కేసీఆర్‌ నాటకాలు ఆడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. పోలీసులు రాకముందే టీఆర్ఎస్ సోషల్ మీడియా గ్రాఫిక్స్‌ తయారు చేసి పెట్టుకుందని ఆరోపించారు. మధ్యవర్తుల అవసరం లేకుండానే నేతలు బీజేపీలోకి రావొచ్చని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget