అన్వేషించండి

BRS Chief KCR: భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ ఫోకస్, బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమాలోచనలు

Kcr Focus On Party : సార్వత్రిక ఎన్నికల్లో, తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పట్ల కెసిఆర్ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.

Kcr Focus On Party Strengthen BRS again: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన భారత రాష్ట్ర సమితి (BRS) భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించింది. పార్టీ ఏర్పాటైన తర్వాత తొలిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో పార్టీని పటిష్టపరిచి మరింతగా బలోపేతం చేయడంపై అధినేత కెసిఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగానే పార్టీ నాయకులతో కెసిఆర్ సమావేశమయ్యారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. కెసిఆర్ పాల్గొన్న రోడ్ షోలు, బహిరంగ సభలకు భారీగా జనం తరలివచ్చారు. కానీ, ఆ స్థాయిలో ఓట్లు రాకపోవడానికి బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు లోక్ సభ ఎన్నికల్లో వచ్చి ఉంటే కనీసం ఐదు నుంచి ఆరు పార్లమెంటు స్థానాలు బీఆర్ఎస్ కు దక్కేవని, కానీ ఆ స్థాయిలో ఓట్లు రాకపోవడం పట్ల గులాబీ బాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలపైన పార్టీ విశ్లేషిస్తోంది. 

కష్ట కాలంలో ద్రోహం చేసిన వారిపై గుర్రు..

పార్టీ అధికారంలో ఉండగా పదవులు అనుభవించి, ఆర్థికంగా లబ్ధి పొందిన ఎంతో మంది నాయకులు అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీకి దూరంగా వెళ్లిపోయారు. కొందరు పార్టీలో ఉన్నప్పటికీ ద్రోహం చేశారని, కొందరు పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఇతర పార్టీల్లో చేరిపోయారని, వీరు పట్ల కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలోనే ఉంటూ కొందరు నష్టం చేశారని, వారి వల్లే పార్లమెంటు ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని పలువురు కెసిఆర్ కు తెలియజేశారు. అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కెసిఆర్ కు పలువురు పార్టీ కీలక నాయకులు సూచించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో భవిష్యత్తు కార్యాచరణపైన పార్టీ ముఖ్య నాయకులతో కెసిఆర్ లోతైన సమాలోచనలు జరుపుతున్నట్లు విశ్వసినీ వర్గాల సమాచారం.

పార్టీ ఫిరాయింపుల చట్టానికి విరుద్ధంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి ఇప్పటికే పలు వేదికల మీద పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేసే విషయంలోనూ బీఆర్ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేయడంలో అలసత్వం చేయకూడదని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని పలువురు పార్టీ ముఖ్య నాయకులు కేసిఆర్ కు సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా మాజీ మంత్రులు, ముఖ్య నేతలు భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

పార్లమెంటు ఫలితాలు నేపథ్యంలో రాజకీయంగా అనుసరించాల్సిన వైఖరిపైన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ దృష్టి సారించారు. పార్టీ ఆవిర్భావం నుంచి గెలుపోటములు అనేకం చూసామని, వీటిని బేరీజు వేసుకుని ముందుకు సాగడమే తప్ప కుంగిపోకూడదని కేసీఆర్ ముఖ్య నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget