అన్వేషించండి

ముగిసిన ఈడీ విచారణ, 16న మళ్లీ రావాలని కవితకు నోటీసులు 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో ఈడీ విచారించనుంది. దీనికి సంబంధించిన లైవ్‌అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.

Key Events
Kavitha for ED investigation in Delhi liquor scam case today Live Updates ముగిసిన ఈడీ విచారణ, 16న మళ్లీ రావాలని కవితకు నోటీసులు 
ఈడీ విచారణలో ఉన్న కవిత

Background

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెతోపాటు మంత్రులు కేటీఆర్,  హరీష్‌రావుతోపాటు కీలకమైన బీఆర్‌ఎస్‌ లీడర్లు, పార్టీ లీగల్‌ సెల్‌కు చెందిన న్యాయనిపుణులు ఢిల్లీ వెళ్లారు. 

కవితను అరెస్టు చేయొచ్చు... చేసుకుంటే చేససుకోనీ... భయపడేది లేదంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల ఇప్పుడు హై టెన్షన్ పెట్టిస్తున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ కవిత పోరాటం చేసిన తర్వాత రోజే ఈడీ విచారణకు హాజరుకానున్న వేళ ఎలాంటి పరిణామాలు జరగనున్నాయనే ఆసక్తి ఉంది. ఈడీ అధికారులు అనుమతి ఇస్తే ఆమెతోపాటు న్యాయనిపుణులు ఒకరిద్దరు విచారణ సమయంలో అక్కడే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే కవితని సీబీఐ ఒకసారి విచారించింది. స్టేట్‌మెంట్‌తోపాటు కీలకమైన పత్రాలు, బ్యాంకు వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇవాళ ఈడీ విచారించనుంది. తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి మాత్రం తెలంగాణ రాజకీయాలు గమనిస్తున్న వారిలో కనిపిస్తోంది. 

ఫిళ్లై స్టేట్‌మెంట్‌తో కలకలం 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న (మార్చి 7) అరెస్టు అయిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు కీలక ఆరోపణలు చేశారు. ఆయన ఏకంగా కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీ అని సీబీఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్‌ పార్టనర్‌గా ఉన్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం మొత్తంలో అక్రమంగా సంపాదించిన సొత్తు దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దీంట్లో కొంత సొమ్ముతో అరుణ్‌ రామచంద్ర పిళ్లై కొన్ని ఆస్తులు కొన్నారని అభియోగించింది. 

ఇది జరిగిన రెండు రోజుల్లోనే పిళ్లైన యూ టర్న్ తీసుకున్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై సౌత్ లాబీలో తెలంగాణ ఎమ్మెల్సీ తరపున వ్యాపారం చేస్తున్నానంటూ ఆమె ప్రతినిధినని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని తాను వెనక్కి తీసుకుంటానని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. రామచంద్ర పిళ్లై ఇచ్చిన ట్విస్ట్‌తో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. 

రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఆప్‌నేత సిసోడియాను కస్టడీకి అడిగిన సమయంలో కూడా ఈ ఆరోపణలు రిపీట్ చేసింది ఈడీ. కవిత, సిసోడియా ఈ కేసులో కీలకమని కామెంట్ చేసింది. 

20:29 PM (IST)  •  11 Mar 2023

ముగిసిన ఈడీ విచారణ, ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని కవితకు నోటీసులు 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ... ఆమె సెల్ ఫోన్ ను సీజ్ చేసింది. ఈనెల 16న మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించింది. 

17:31 PM (IST)  •  11 Mar 2023

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, 6 గంటలుగా ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ 

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు 6 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికి వరకు సేకరించిన ఆధారాలు, ఇతర నిందితుల వాంగ్మూలాలతో కవితను విచారిస్తున్నారు. అయితే ఈడీ విచారణపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దిల్లీలోని ఈడీ కార్యాలయం 144 సెక్షన్ విధించి, భారీగా పోలీసులను మోహిరించారు. విచారణ సందర్భంగా కవిత ఫోన్ ఈడీ స్వాధీనం చేసుకుంది. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Embed widget