అన్వేషించండి

ముగిసిన ఈడీ విచారణ, 16న మళ్లీ రావాలని కవితకు నోటీసులు 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో ఈడీ విచారించనుంది. దీనికి సంబంధించిన లైవ్‌అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.

Key Events
Kavitha for ED investigation in Delhi liquor scam case today Live Updates ముగిసిన ఈడీ విచారణ, 16న మళ్లీ రావాలని కవితకు నోటీసులు 
ఈడీ విచారణలో ఉన్న కవిత

Background

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెతోపాటు మంత్రులు కేటీఆర్,  హరీష్‌రావుతోపాటు కీలకమైన బీఆర్‌ఎస్‌ లీడర్లు, పార్టీ లీగల్‌ సెల్‌కు చెందిన న్యాయనిపుణులు ఢిల్లీ వెళ్లారు. 

కవితను అరెస్టు చేయొచ్చు... చేసుకుంటే చేససుకోనీ... భయపడేది లేదంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల ఇప్పుడు హై టెన్షన్ పెట్టిస్తున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ కవిత పోరాటం చేసిన తర్వాత రోజే ఈడీ విచారణకు హాజరుకానున్న వేళ ఎలాంటి పరిణామాలు జరగనున్నాయనే ఆసక్తి ఉంది. ఈడీ అధికారులు అనుమతి ఇస్తే ఆమెతోపాటు న్యాయనిపుణులు ఒకరిద్దరు విచారణ సమయంలో అక్కడే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే కవితని సీబీఐ ఒకసారి విచారించింది. స్టేట్‌మెంట్‌తోపాటు కీలకమైన పత్రాలు, బ్యాంకు వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇవాళ ఈడీ విచారించనుంది. తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి మాత్రం తెలంగాణ రాజకీయాలు గమనిస్తున్న వారిలో కనిపిస్తోంది. 

ఫిళ్లై స్టేట్‌మెంట్‌తో కలకలం 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న (మార్చి 7) అరెస్టు అయిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు కీలక ఆరోపణలు చేశారు. ఆయన ఏకంగా కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీ అని సీబీఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్‌ పార్టనర్‌గా ఉన్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం మొత్తంలో అక్రమంగా సంపాదించిన సొత్తు దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దీంట్లో కొంత సొమ్ముతో అరుణ్‌ రామచంద్ర పిళ్లై కొన్ని ఆస్తులు కొన్నారని అభియోగించింది. 

ఇది జరిగిన రెండు రోజుల్లోనే పిళ్లైన యూ టర్న్ తీసుకున్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై సౌత్ లాబీలో తెలంగాణ ఎమ్మెల్సీ తరపున వ్యాపారం చేస్తున్నానంటూ ఆమె ప్రతినిధినని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని తాను వెనక్కి తీసుకుంటానని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. రామచంద్ర పిళ్లై ఇచ్చిన ట్విస్ట్‌తో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. 

రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఆప్‌నేత సిసోడియాను కస్టడీకి అడిగిన సమయంలో కూడా ఈ ఆరోపణలు రిపీట్ చేసింది ఈడీ. కవిత, సిసోడియా ఈ కేసులో కీలకమని కామెంట్ చేసింది. 

20:29 PM (IST)  •  11 Mar 2023

ముగిసిన ఈడీ విచారణ, ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని కవితకు నోటీసులు 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ... ఆమె సెల్ ఫోన్ ను సీజ్ చేసింది. ఈనెల 16న మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించింది. 

17:31 PM (IST)  •  11 Mar 2023

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, 6 గంటలుగా ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ 

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు 6 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికి వరకు సేకరించిన ఆధారాలు, ఇతర నిందితుల వాంగ్మూలాలతో కవితను విచారిస్తున్నారు. అయితే ఈడీ విచారణపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దిల్లీలోని ఈడీ కార్యాలయం 144 సెక్షన్ విధించి, భారీగా పోలీసులను మోహిరించారు. విచారణ సందర్భంగా కవిత ఫోన్ ఈడీ స్వాధీనం చేసుకుంది. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget