అన్వేషించండి

Jubilee Hills By-Polls: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నోటిఫికేషన్‌ విడుదల, డిజిటల్‌ నామినేషన్‌‌కు ఛాన్స్

Jubilee Hills By Election Date | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి అభ్యర్థులు షేక్ పేట్ ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Jubilee Hills By Election Notification | హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నగారా మోగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది.  నేటి నుండి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలుకానుండగా.. అక్టోబర్ 21 వరకు షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు  24 వరకు ఉంది. నవంబర్‌ 11న ఎన్నికలు నిర్వహించనుండగా, 14 కౌంటింగ్‌ చేసి, విజేతను ప్రకటిస్తారు. 

అభ్యర్థులకు మార్గదర్శకాలు..
సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు ఆఫ్ లైన్ తో పాటు ఆన్‌లైన్ విధానంలోనూ దాఖలు చేయడానికి అభ్యర్థులకు అవకాశం కల్పించారు.  కార్యాలయంలో నేరుగా లేదా.. డిజిటల్‌ విధానంలో దాఖలు చేసే అవకాశం కల్పించారు. 25 ఏళ్లు నిండిన పౌరులు ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేయవచ్చు. రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీగా గుర్తింపు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన ఒక పౌరుడు ప్రతిపాదన చేస్తే సరిపోతుంది. స్వతంత్రులు, ఇతర అభ్యర్థులు అయితే పది మంది వారిని ప్రతిపాదించాలని ఈసీ పేర్కొంది.


Jubilee Hills By-Polls: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నోటిఫికేషన్‌ విడుదల, డిజిటల్‌ నామినేషన్‌‌కు ఛాన్స్

నామినేషన్ ఫారం 2బీతో పాటు ఎన్నికల అఫిడవిట్ ఫారం 26ను అభ్యర్థులు సమర్పించాలి. అభ్యర్థులు నేరుగా గానీ, లేక వారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన వారిలో ఎవరైనా ఒకరు షేక్‌పేట్ ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లి నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. ఎవరైనా ఆన్‌లైన్ లో నామినేషన్ వేయాలంటే డిజిటల్‌ నామినేషన్‌ను అధికారి వెబ్  సైట్ https://encore.eci.gov.in ద్వారా దాఖలు చేయాలి. క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న ప్రింటెడ్‌ హార్డు కాపీని సంబంధిత ఎన్నికల అధికారులకు అందజేయాలి. నామినేషన్ వేసే అభ్యర్థులు మరికొన్ని సెట్ల పత్రాలు సైతం ముందు జాగ్రత్తగా సమర్పిస్తుంటారు.

అదే నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండాలా..?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 173(బీ) ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థులకు 25 ఏళ్లు నిండాలి. రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో ఓటరుగా ఓటు హక్కు ఉండాలి. రాష్ట్రంలోని వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు తనకు ఓటు హక్కు ఉన్నట్లు సర్టిఫికెట్ సమర్పించాలి. ఒకవేళ అది రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయితే అభ్యర్థి సంబంధిత సామాజికవర్గానికి చెందిన వారని కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ నియోజకవర్గాల్లోనూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు పోటీ చేయొచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 4, 5 ప్రకారం అలా పోటీ చేయడానికి అర్హులు అవుతారు.

అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు

కాంగ్రెస్ పార్టీ ఇదివరకే అభ్యర్థిని ప్రకటించింది. గతంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉన్న నవీన్ యాదవ్‌కు అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. ఉప ఎన్నికల్లో తమదే విజయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తున్నారు. ఇటీవల కన్నుమూసిన మాగంటి గోపీనాథ్ కుటుంబానికే బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. మరోవైపు బీజేపీ మాత్రం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget