అన్వేషించండి

Jagga Reddy: కాంగ్రెస్‌కు రాజు రాహుల్, నేను పీసీసీ కచ్చితంగా అడుగుతా - జగ్గారెడ్డి వ్యాఖ్యలు

Telangana Congress News: మంగళవారం (ఏప్రిల్ 9) గాంధీభవన్ లో ఉగాది వేడుకల అనంతరం జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 

Jagga Reddy on Rahul Gandhi: రాహుల్ గాంధీ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. వారు అధికారం కోసం అడ్డదారులు తొక్కబోరని అన్నారు. తాను ఒక కాంగ్రెస్ అభిమానిగా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు అని.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినా గెలిచినా ఆయన రాజే అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం (ఏప్రిల్ 9) గాంధీభవన్ లో ఉగాది వేడుకల అనంతరం జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 

రాహుల్ గాంధీ అధికారం కోసం అడ్డదారులు తొక్కరని జగ్గారెడ్డి అన్నారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలనేది మోదీ, అమిత్ షా విధానమని అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఓ సారి బీజేపీ అంటారని, ఇంకోసారి కాంగ్రెస్ అంటుంటారని అన్నారు. ఆయన బతుకుదెరువు కోసం సర్వే సంస్థను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని పీకే చెప్పారని కానీ కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ అని అన్నారు. పార్టీకి రాజ పూజ్యం 16 ఉంటే.. అవమానం 2 ఉందని చెప్పారు.

పీసీసీ చీఫ్ పదవిపైనా కీలక వ్యాఖ్యలు
పీసీసీ చీఫ్‌ పదవి పైన కూడా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ పోస్టును తాను అడగడం ఇదేం కొత్త కాదని అన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి తాను పీసీసీ పదవిని అడుగుతూనే ఉంటానని అన్నారు. తాను ఆ పదవిని కోరుకోవడం కొత్త కాదని.. అడగడం తప్పు కాదని వ్యాఖ్యానించారు. ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణ పీసీసీ మార్పునకు ఇంకా సమయం ఉందని అన్నారు. ఇప్పుడు దానికే తొందర లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత అధిష్ఠానం దాని గురించి ఆలోచిస్తుందని చెప్పారు. పీసీసీ, సీఎం ఒక్కరే అయి ఉంటే బాగుంటుందని అదే విధానం కొనసాగుతుందని జగ్గారెడ్డి చెప్పారు.

మందక్రిష్ణ మాదిగపైనా..
మందకృష్ణ మాదిగ బీజేపీ కోటరీలో ఉండి మాట్లాడుతున్నాడని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు అని.. మాదిగలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దామోదర రాజనర్సింహకు, మీరా కుమార్‌కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. బీజేపీకి లాభం చేకూర్చేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీని తెలంగాణలో మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయమని ఎందుకు అడగలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రిని అయినా చేయాలని డిమాండ్ చేయొచ్చు కదా అని నిలదీశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget