అన్వేషించండి

KTR on NEET: నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు, హై లెవల్ కమిటీతో విచారణకు కేటీఆర్ డిమాండ్

#NEET2024result: నీట్ ఎగ్జామ్ ఫలితాలపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. నీట్ లో గ్రేస్ మార్కులు కలపడంపై, 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడంపై కేటీఆర్ ప్రశ్నించారు.

KTR demands inquiry on NEET 2024exam with high level committee: హైదరాబాద్: ప్రతిష్టాత్మక నీట్ (NEET) ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. నీట్ లో అవకతవకలపై హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొత్తగా ఏర్పాటు అవుతున్న ఎన్డీయే ప్రభుత్వ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. 

అంతమందికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది?

ఎన్డీయే ప్రభుత్వం ఎదుర్కునే సవాళ్లలో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ ఎగ్జామ్ రిజల్ట్ 2024 (#NEET2024result ) చాలా సున్నితమైన అంశమన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్‌లో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులు 720 కి 720 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ ఫలితాలు గమనిస్తే ఏదో మతలబు జరిగిందని, వైద్య విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

నీట్ ఫలితాలలో 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రాగా, చాలా మంది విద్యార్థులకు 718, 719 మార్కులు సైతం రావడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ లో (+4, -1) మార్కింగ్ విధానం ఉన్నందున, అసలు 718, 719 మార్కులు రావడం అనేది అసాధ్యమన్నారు. ఎవరైనా దీనిపై ప్రశ్నిస్తే 'గ్రేస్ మార్కులు' ఇచ్చామని సాకులు చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చి ఉంటారని ఆరోపించారు. అయితే ఆ గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం పాటించారనేది మాత్రం చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

నీట్ రిజల్ట్స్‌ను ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా ఎందుకు విడుదల చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీయే సర్కార్ (NDA Governmnent) భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. నీట్ ఫలితాలతో పాటు మరికొన్ని అంశాలపై ప్రశ్నలు, డిమాండ్లను కేటీఆర్ కేంద్రం ముందు ఉంచారు.    

కేంద్రానికి కేటీఆర్ ప్రశ్నలు, డిమాండ్లు.
1) ఏ ఒక్క తెలంగాణ విద్యార్థి కూడా నీట్ (NEET) లో టాప్ 5 ర్యాంక్‌లో లేకపోవడం గత 5 ఏళ్లలో ఇది తొలిసారి. నీట్ ఎగ్జామ్ లో జరుగుతున్న అవకతవకలే అందుకు కారణమని భావిస్తున్నాం.

2) నీట్ ఎగ్జామ్‌ ఫలితాలలో గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సరైన పద్ధతిలో ప్రతి విద్యార్థికి మేలు జరిగేలా నీట్ ఉండాలని బీఆర్ఎస్ కోరుతోంది. కేవలం 1500 మంది విద్యార్థులకు మాత్రమే మేలు చేసేందుకు గ్రేస్ మార్కులు కలిపారు. అది సరి కాదు.
 
3) నీట్ ఎగ్జామ్ వ్యవహారంపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్. తాజా విధానంతో అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు ఈ అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Embed widget