అన్వేషించండి

Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !

MLA Vasantha: టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన పదిహేడు ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. అయితే వాటిపై వివాదం లేదని కృష్ణప్రసాద్ అంటున్నారు.

Hydra seizes TDP MLA Vasantha Krishna Prasad Lands :  ప్రతి వారాంతంలో విరుచుకుపడుతున్న హైడ్రా ఈ సారి  టీడీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసింది.  హఫీజ్ పేటలో ఉన్న  17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. అందులో ఉన్న మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ  పదిహేడు ఎకరాల విలువ రెండు వేల కోట్లకుపైగా ఉటుందని అంచనా. ఈ భూమిలో షెడ్లను నిర్మించి ఉన్నారు. సినిమా షూటింగ్‌లకు సంబంధించిన పరికరాలను నిల్వ చేశారు. షెడ్లను హైడ్రా అధికారులు కూలగొట్టారు.

వసంత కృష్ణ ప్రసాద్‌కు 39 ఎకరాల స్థలం            

హాఫిజ్ పేట సర్వే నెంబర్ 79లో వసంత కృష్ణప్రసాద్ కు 39ఎకరాల భూమి ఉంది. వాటిలో ఐదుఎకరాలను రైల్వే లైన్ విస్తరణ కోసం ఇచ్చారు. మిగిలిన పదిహేడు ఎకరాల్లో విల్లాలు కట్టి అమ్మారు. మిగిలిన భూమిని కూడా డెలవప్‌మెంట్ కు ఇచ్చారు. అయితే ఆ భూములు ప్రభుత్వానివన్న సమాచారం రావడంతో  హైడ్రా అధికారులు ఉదయమే బుల్ డోజర్లతో వచ్చి కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని స్పష్టం చేశారు.  ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా తెలిపారు.          

భూమిపై ఫిర్యాదులు రావడంతో గతంలోనే పత్రాలు సమర్పించిన వసంత           

తమ భూమిపై ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలియడంతో గతంలోనే వసంత కృష్ణప్రసాద్ హైడ్రా  కమిషనర్ ను కలిశారు.  భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించారు.  కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీసు మొత్తాన్ని కూల్చేశారని వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద ఆనాటి ప్రభుత్వం నోటీసులు ఇస్తే తాను జరిమానా కట్టి క్రమబద్దీకరించుకున్నానని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇరవై ఏళ్లు అవుతోందని .. ఆ భూమిపై ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు. ఆ భూములు పైగా వంశస్థులవని.. ప్రభుత్వానికి కావన్నారు. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందన్నారు. కూల్చివేసిన ఆఫీసుల్లో కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి దేశంలో లేనప్పుడు ఇలా చేయడం ఏమిటని..ఆయన ఉండి ఉంటే కలిసి ఉండేవాడినన్నారు.         

తమ విచారణలో ప్రభుత్వ భూమిగా తేలిందన్న హైడ్రా                  

అయితే రంగనాథ్ మాత్రం హాఫీజ్ పేట సర్వేనెంబర్ 79/1  పూర్తి అక్రమం అని చెబుతున్నారు. ఆ భూమి మొత్తం ప్రభుత్వానిదేనని కాపాడాల్సిన బాధ్యత  ప్రభుత్వంపై ఉందన్నారు. హైడ్రా ఎంక్వైరీలో అది ప్రభుత్వ భూమి అనితేలిందన్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు.   

టీడీపీ ఎమ్మెల్యేలకు చెందిన  అత్యంత ఖరీదైన భూముల్లో హైడ్రా కూల్చివేతలు చెపట్టడం.. రాజకీయవర్గాల్లోనూ సంచలనంగామారింది.    

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Quantum Valley: 2026 జనవరికి అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ -  జూన్ 30 తేదీన ప్రత్యేక వర్క్ షాప్
2026 జనవరికి అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ - జూన్ 30 తేదీన ప్రత్యేక వర్క్ షాప్
Telugu Space Journey: వినువీధిలో విజయ గీతిక.. అంతరిక్షంలో తెలుగు పతాక… !
వినువీధిలో విజయ గీతిక.. అంతరిక్షంలో తెలుగు పతాక… !
YS Jagan: బటన్లు నొక్కి చంద్రబాబు మోసాల గురించి ప్రజలకు చెప్పండి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
బటన్లు నొక్కి చంద్రబాబు మోసాల గురించి ప్రజలకు చెప్పండి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Mother Murder Case:  తల్లి హత్యకేసులో ట్విస్టులు - ఇంట్లోనే సహజీవనం- మైండ్ బ్లాంక్ చేసే డీటైల్స్ !
తల్లి హత్యకేసులో ట్విస్టులు - ఇంట్లోనే సహజీవనం- మైండ్ బ్లాంక్ చేసే డీటైల్స్ !
Advertisement

వీడియోలు

Shubanshu Shukla Taking Indian Food Travel to Space | శుభాన్షు రోదసిలోకి తీసుకువెళ్తున్నవి ఇవే | ABP Desam
Shubhanshu Shukla Wife kamna Emotional | శుభాన్షు భార్య కామ్నా ఎమోషనల్ | ABP Desam
Shubhanshu Shukla Emotional Moments With Family | అంతరిక్ష ప్రయాణానికి ముందు కుటుంబంతో శుభాన్షు | ABP Desam
Gautam Gambhir Failures as a Coach | టీమిండియా ఓడిపోతుంటే గంభీర్ ను తిడతారేంటీ.? | ABP Desam
Rohit Sharma on Eng vs India First test Loss | రోహిత్ చెప్పినట్లే పంత్ ఇరగదీశాడు..కానీ డకెట్ చేతిలో ఓటమి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Quantum Valley: 2026 జనవరికి అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ -  జూన్ 30 తేదీన ప్రత్యేక వర్క్ షాప్
2026 జనవరికి అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ - జూన్ 30 తేదీన ప్రత్యేక వర్క్ షాప్
Telugu Space Journey: వినువీధిలో విజయ గీతిక.. అంతరిక్షంలో తెలుగు పతాక… !
వినువీధిలో విజయ గీతిక.. అంతరిక్షంలో తెలుగు పతాక… !
YS Jagan: బటన్లు నొక్కి చంద్రబాబు మోసాల గురించి ప్రజలకు చెప్పండి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
బటన్లు నొక్కి చంద్రబాబు మోసాల గురించి ప్రజలకు చెప్పండి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Mother Murder Case:  తల్లి హత్యకేసులో ట్విస్టులు - ఇంట్లోనే సహజీవనం- మైండ్ బ్లాంక్ చేసే డీటైల్స్ !
తల్లి హత్యకేసులో ట్విస్టులు - ఇంట్లోనే సహజీవనం- మైండ్ బ్లాంక్ చేసే డీటైల్స్ !
Visakhapatnam Cognizant: విశాఖలో కాగ్నిజెంట్ - 8000 ఉద్యోగాలు - అధికారికంగా ప్రకటించిన కంపెనీ
విశాఖలో కాగ్నిజెంట్ - 8000 ఉద్యోగాలు - అధికారికంగా ప్రకటించిన కంపెనీ
Tirumala Express: తిరుమల ఎక్స్ ప్రెస్ ఇప్పుడు గుంతకల్ వరకూ వెళుతుందని తెలుసా! కానీ  ట్విస్ట్ ఏంటంటే...!
తిరుమల ఎక్స్ ప్రెస్ ఇప్పుడు గుంతకల్ వరకూ వెళుతుందని తెలుసా! కానీ ట్విస్ట్ ఏంటంటే...!
Shashi Tharoor: ఎగిరిపోతే ఎంత బాగుంటుందని పాడుకుంటున్న శశిథరూర్ -ఇక బీజేపీలో చేరడమే మిగిలిందా?
ఎగిరిపోతే ఎంత బాగుంటుందని పాడుకుంటున్న శశిథరూర్ -ఇక బీజేపీలో చేరడమే మిగిలిందా?
Andhra Talliki Vandanam: పిల్లలకు తల్లికి వందనం డబ్బులిస్తారా? 26 ఎకరాలిస్తారా? - ఏపీ సర్కార్‌కు మహిళ సూటి ప్రశ్న
పిల్లలకు తల్లికి వందనం డబ్బులిస్తారా? 26 ఎకరాలిస్తారా? - ఏపీ సర్కార్‌కు మహిళ సూటి ప్రశ్న
Embed widget