అన్వేషించండి

Hyderabd Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు కొత్త విధానం! కార్ పూలింగ్ పెట్టాలని యోచన

Hyderabd Traffic: హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు అధికారులు కొత్త ప్లాన్ వేశారు. కార్ పూలింగ్ విధానం తీసుకురావాలని యోచిస్తున్నారు.

Hyderabd Traffic: హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ గురించి భయపడిపోతుంటారు చాలా మంది. సొంత వాహనాల్లో వెళ్లే వారైనా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాడే వారైనా ట్రాఫిక్ కు జంకుతుంటారు. ఈ సమస్య రోజురోజుకూ పెరిగిపోతుందే తప్పా తగ్గడం లేదు. చాలా మంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాడే వారి కంటే బైకులు, సొంత కార్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తుండటంతో.. రోడ్లన్నీ జామ్ అయిపోతున్నాయి. వర్షాలు పడినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ గంటలకొద్దీ జామ్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో స్థోమత పెరిగిపోవడంతో చాలా మంది కార్లు తీసుకుంటున్నారు. ఆఫీసుకు వెళ్లాలన్నా, ఏదైనా పనిపై బయటకు వెళ్లినా కార్లను రోడ్లెక్కిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. బైకులు వాడే వారు కూడా కార్లు ఉంటే వాటిలోనే ఆఫీసులకు వెళ్తున్నారు. దీంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు అండర్ పాస్ లు, ఫ్లైఓవర్లు నిర్మించినా.. చాలా ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ సమస్య కొనసాగుతూనే ఉంది. ఈ సమస్య ఐటీ కారిడార్ పరిధిలో మరీ ఎక్కువగా ఉంది. ఐటీ ఉద్యోగులు వరుసగా ఆఫీసులకు వస్తుండటంతో ట్రాఫిక్ పెరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఐటీ ఉద్యోగులు చాలా వరకు కార్లనే వాడుతుండటం.. ఎక్కువ శాతం మంది కారులో ఒకరు మాత్రమే ప్రయాణిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ అయ్యారు. 

ఐటీ కంపెనీలకు పోలీసుల సూచనలు

ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు కార్ పూలింగ్ విధానం అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, జేపీ మోర్గాన్, విప్రో, ఐసీఐసీఐ, హెచ్ఎస్బీసీతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ స్టీఫెన్ భేటీ అయ్యారు. ఐటీ కారిడార్ లో కార్ పూలింగ్ విధానంపై ఐటీ కంపెనీల ప్రతినిధులు చర్చించారు. ఐటీ కారిడార్ ప్రాంతంలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు సొంత రవాణా సదుపాయాన్ని కల్పించాలని పోలీసులు ప్రతిపాదించారు. ఐటీ ఉద్యోగులు అంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా పని వేళల్లో మార్పులు చేయాలని సూచించారు. అలాగే ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను పరిశీలించాలని కూడా పోలీసులు కోరారు. 

Also Read: Apple India Revenue: భారత్‌లో జూన్ త్రైమాసికంలో ఆపిల్ అమ్మకాల రికార్డు, రెండంకెల వృద్ధి నమోదు

కార్ పూలింగ్ అంటే ఏంటి?

ఒక్కరి కోసం కారు వాడటం వల్ల రోడ్లన్నీ జామ్ అవుతాయి. అలాగే కాలుష్యం కూడా పెరుగుతుంది. వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లలో దాదాపు 75 శాతం వరకు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు.. కొత్త ఆలోచన చేశారు. కార్ పూలింగ్ విధానం ప్రవేశ పెడితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. ఈ విధానం ఎక్కువగా విదేశాల్లో అమలు అవుతోంది. హైటెక్ సిటీలో కార్ పూలింగ్ విధానం అమలు చేయడం వల్ల సగం వరకు సమస్య తగ్గుతుందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Telangana Highcourt :  విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Kalki Actress: కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Telangana Highcourt :  విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Kalki Actress: కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Delhi AIrport: ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
NEET Issue: పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
RBI Warning: ప్రజలారా జాగ్రత్త - ఆర్బీఐ సంచలన నివేదిక.. ప్రమాదంలో దేశ ఆర్థిక స్థిరత్వం
ప్రజలారా జాగ్రత్త - ఆర్బీఐ సంచలన నివేదిక.. ప్రమాదంలో దేశ ఆర్థిక స్థిరత్వం
PV Narasimha Rao: 'ఆర్థిక భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి' - మాజీ ప్రధాని పీవీకి తెలుగు రాష్ట్రాల సీఎంల ఘన నివాళి
'ఆర్థిక భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి' - మాజీ ప్రధాని పీవీకి తెలుగు రాష్ట్రాల సీఎంల ఘన నివాళి
Embed widget