By: ABP Desam | Updated at : 10 Aug 2023 11:56 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో ప్రభుత్వం నుంచి వచ్చే మూడు లక్ష సాయం కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. సొంత స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. వాళ్లు ఇళ్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయలు సాయం అందిస్తోంది. దీనికి గృహలక్ష్మీ అని పేరు పెట్టారు.
గృహలక్ష్మీ ద్వారా మూడు లక్షలు వస్తే గూడు నిర్మించుకోవచ్చని చూస్తున్న లక్షల మంది పేద వాళ్లు పథకం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున తొలి దశలో ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు ఈ పథకం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి గడువు లేకపోయినా ఆగస్టు 10వ తేదీతో ఆఖరు తేదీ అంటూ ప్రచారం జరుగుతోంది. అంటే ఇవాళే లాస్ట్ డేట్ అనుకొని ప్రజలంతా ఆఫీస్ల వద్ద క్యూ కట్టారు. అయితే దీనికి ఎలాంటి గడువు లేదని... ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల లబ్ధిదారులను పరిశీలిన స్టార్ట్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
వీళ్లు అనర్హులు
ఆర్సీసీ రూఫ్ ఉన్న వాళ్లు
జీవో నెంబర్ 59 కింద లబ్ధిపొందిన వాళ్లు
ఆహార భద్రత కార్డు ఉన్న వాళ్లు అర్హులు
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను 20వ తేదీలోపు పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం 25 నుంచి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నిధులు కూడా మంజూరు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ నిధులను మూడు విడతలుగా ఇవ్వబోతున్నారు.
Telangana News: 9999 నెంబర్ కు యమా క్రేజ్ - ఆర్టీఏకు అనేక లాభాలు తెచ్చిపెడుతున్న ఫ్యాన్సీ నెంబర్లు
Telangana Congress: పూర్తయిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్, 60 శాతానికిపైగా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఖరారు!
TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!
TREIRB: గురుకుల అభ్యర్థులకు 'ఆప్షన్ల' నమోదు తప్పనిసరి, నియామక బోర్డు కీలక సూచన
Rice sales Tenders: యాసంగి ధాన్యం విక్రయ టెండర్లు రద్దు చేసే ఛాన్స్- రూ.1000 కోట్ల నష్టం వస్తుండటంతో యోచన
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్ఇండియా టార్గెట్ 279
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
/body>