అన్వేషించండి

Governor Tamilisai: కు.ని. ఆపరేషన్ మరణాలు అందుకే జరిగాయి: గవర్నర్, అధికారులకు తమిళిసై వార్నింగ్

గవర్నర్ తమిళిసై ఆదివారం ఉదయం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ బాధితులను పరామర్శించి, ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.

Governor Tamilisai: హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో బాధితులను గవర్నర్ తమిళిసై పరామర్శించారు. అందుకోసం ఆమె ఆదివారం ఉదయం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ బాధితులను పరామర్శించి, ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. బాధితులకు వైద్యం పరంగా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.

ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ.. నిమ్స్‌లో ట్రీట్‌మెంట్‌పై బాధితులు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. కుటుంబ నియత్రణ ఆపరేషన్లు విఫలం అయి నలుగురు మృతి చెందడం మామూలు విషయం కాదని గవర్నర్ తమిళిసై అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక అసలు కారణాలు తెలుస్తాయని తెలిపారు. 

ఆపరేషన్ల టార్గెట్, ఇన్ఫెక్షన్ వల్లే మరణాలు - గవర్నర్

ఇలాంటి ఘటనలు మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని హెచ్చరించారు. త్వరగా ఎక్కువ ఆపరేషన్లు చేయాలనే లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకోకూడదని అన్నారు. ఇన్ఫెక్షన్ల వల్ల మృతి చెందారని భావిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు.

అంతకుముందు, గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా 50 సార్ల కంటే ఎక్కువ సార్లు రక్త దానం చేసిన వారికి ‘చిరు భద్రత’ పేరుతో గవర్నర్ చేతుల మీదుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. బ్లడ్ బ్యాంకు ద్వారా సేవ చేస్తున్న చిరంజీవికి అభినందనలు తెలిపారు. రక్తదానం చేయడం చిన్నవిషయం కాదని అన్నారు. తాను హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్న సమయంలో రక్తం ఇచ్చేందుకు సొంత కుటుంబ సభ్యులు కూడా వెనకడుగు వేసేవారని గుర్తు చేసుకున్నారు. 

రక్తదానం చేసిన వారిలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తుందని అన్నారు. తెలంగాణ రాజ్‌భవన్‌ తరఫున కూడా వివిధ సందర్భాల్లో రక్తదాన శిబిరాలు చేపడుతున్నామని అన్నారు. అవసరమైన వారికి సమయానికి రక్తం అందించేందుకు ఓ యాప్‌ను రూపొందించామని కూడా తెలిపారు. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ కూడా అందులో భాగం కావాలని తమిళిసై సౌందరరాజన్ చిరంజీవిని కోరారు. 

ప్రస్తుతం చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా 70 శాతం రక్తం పేదలకు ఉచితంగా అందించామని, మిగతా రక్తాన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అందించామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య తక్కువగా ఉందని అన్నారు. ఇప్పటిదాకా తాము 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించామని తెలిపారు. రక్తదానం చేస్తున్నవారికి ఈ సందర్భంగా చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

గతంలో కరోనా సమయంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ప్రారంభించినప్పుడు, సినీ కార్మికులకు, అవసరార్థులకు ఫ్రీగా నిత్యావసరాలు అందించినప్పుడు గవర్నర్ తనను ఎంతో ప్రోత్సహించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. కరోనా సమయంలో తాను ఆక్సీజన్ బ్యాంకు స్థాపించి వివిధ ప్రాంతాలకు ఆక్సీజన్ సరఫరా చేయడంలోనూ స్పందించిన తొలి వ్యక్తి గవర్నర్ అని చిరంజీవి కొనియాడారు. ఆ సమయంలో గవర్నర్ ఎన్నో సార్లు ట్వీట్ చేసి, తన మద్దతును చాటుకున్నారని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
Embed widget