అన్వేషించండి

Governor At Home: అరగంట ఎదురుచూశాం, సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదు: తమిళిసై

At Home: రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంకు లేఖ రాసినా ఎందుకు రాలేదో తెలియదని గవర్నర్ అన్నారు. రాకపోవడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని వివరించారు.

At Home: రాష్ట్ర, దేశ వ్యాప్తంగా జెండా పండుగ వైభవంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గోల్కొండ కోట మీద జాతీయ జెండాను ఎగుర  వేశారు. తర్వాత ప్రభుత్వం చేసిన, త్వరలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. అంతకుముందు ప్రగతి భవన్ లో జెండా వందనం చేశారు. సాయంత్రం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. దానికి మాత్రం సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. సాయంత్రం 6.55 గంటలకు సీఎం వస్తారని ఆయన కార్యాలయం నుండి సమాచారం వచ్చినా, ఆయన మాత్రం రాలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. 

సమాచారం లేదు... 
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమానికి రావాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యక్తిగతంగా లేఖ రాశారు. దానికి స్పందనగా... సాయంత్రం 6.55 గంలటకు వస్తారని సీఎం కార్యాలయం నుండి సమాచారం వచ్చింది. కానీ ఎట్ హోం కార్యక్రమానికి సీఎం ఎందుకు రాలేదో తనకు తెలియదని గవర్నర్ తమిళిసై అన్నారు. తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. తాను, హైకోర్టు సీజే అరగంట పాటు ఎదురు చూశామని, అతిథులంతా వెయిట్ చేస్తుండటంతో ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించామని గవర్నర్ విలేకరులకు తెలిపారు. 

ఎట్ హోంకు వచ్చిన సీఎస్.. 
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పుదుచ్చేరి నుండి సాయంత్రం ఆరు గంటలకు రాజ్ భవన్ కు చేరుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ దంపతులు అప్పటికే రాజ్ భవన్ కు వచ్చారు. వారంతా ముఖ్యమంత్రి కోసం 7.20 గంటల వరకు ఎదురు చూశారు. ఆయన రాకపోవడంతో గవర్నర్ తేనేటి విందును ప్రారంభించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఎట్ హోంకు హాజరు అయ్యారు. తెరాస ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీజేపీ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పలువురు బీజేపీ మాజీ ప్రజా ప్రతినిధులు వచ్చారు. ఎట్ హోం కార్యక్రమానికి కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య కూడా హాజరయ్యారు. హైదరాబాద్, రాచకొండ సీపీలు, పలువులు స్వాతంత్ర్య సమరయోధులు ఎట్ హోం కార్యక్రమానికి వచ్చారు. అయితే టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ రాలేదు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలూ కనిపించలేదు. 

వస్తారని సమాచారం, కానీ రాలేదు..

స్వాతంత్ర్య దినోత్సవం నాడు సాయంత్రం 6.55 గంటలకు ముఖ్య మంత్రి రాజ్ భవన్ కు వస్తారని సీఎంవో సమాచారం ఇచ్చింది. సీఎం వస్తున్నారని పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాజ్ భవన్ లో తేనీటి విందులను గవర్నర్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తేనేటి విందులనే ఎట్ హోంగా వ్యవహరిస్తుంటారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Embed widget