అన్వేషించండి

Governor At Home: అరగంట ఎదురుచూశాం, సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదు: తమిళిసై

At Home: రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంకు లేఖ రాసినా ఎందుకు రాలేదో తెలియదని గవర్నర్ అన్నారు. రాకపోవడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని వివరించారు.

At Home: రాష్ట్ర, దేశ వ్యాప్తంగా జెండా పండుగ వైభవంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గోల్కొండ కోట మీద జాతీయ జెండాను ఎగుర  వేశారు. తర్వాత ప్రభుత్వం చేసిన, త్వరలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. అంతకుముందు ప్రగతి భవన్ లో జెండా వందనం చేశారు. సాయంత్రం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. దానికి మాత్రం సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. సాయంత్రం 6.55 గంటలకు సీఎం వస్తారని ఆయన కార్యాలయం నుండి సమాచారం వచ్చినా, ఆయన మాత్రం రాలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. 

సమాచారం లేదు... 
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమానికి రావాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యక్తిగతంగా లేఖ రాశారు. దానికి స్పందనగా... సాయంత్రం 6.55 గంలటకు వస్తారని సీఎం కార్యాలయం నుండి సమాచారం వచ్చింది. కానీ ఎట్ హోం కార్యక్రమానికి సీఎం ఎందుకు రాలేదో తనకు తెలియదని గవర్నర్ తమిళిసై అన్నారు. తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. తాను, హైకోర్టు సీజే అరగంట పాటు ఎదురు చూశామని, అతిథులంతా వెయిట్ చేస్తుండటంతో ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించామని గవర్నర్ విలేకరులకు తెలిపారు. 

ఎట్ హోంకు వచ్చిన సీఎస్.. 
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పుదుచ్చేరి నుండి సాయంత్రం ఆరు గంటలకు రాజ్ భవన్ కు చేరుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ దంపతులు అప్పటికే రాజ్ భవన్ కు వచ్చారు. వారంతా ముఖ్యమంత్రి కోసం 7.20 గంటల వరకు ఎదురు చూశారు. ఆయన రాకపోవడంతో గవర్నర్ తేనేటి విందును ప్రారంభించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఎట్ హోంకు హాజరు అయ్యారు. తెరాస ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీజేపీ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పలువురు బీజేపీ మాజీ ప్రజా ప్రతినిధులు వచ్చారు. ఎట్ హోం కార్యక్రమానికి కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య కూడా హాజరయ్యారు. హైదరాబాద్, రాచకొండ సీపీలు, పలువులు స్వాతంత్ర్య సమరయోధులు ఎట్ హోం కార్యక్రమానికి వచ్చారు. అయితే టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ రాలేదు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలూ కనిపించలేదు. 

వస్తారని సమాచారం, కానీ రాలేదు..

స్వాతంత్ర్య దినోత్సవం నాడు సాయంత్రం 6.55 గంటలకు ముఖ్య మంత్రి రాజ్ భవన్ కు వస్తారని సీఎంవో సమాచారం ఇచ్చింది. సీఎం వస్తున్నారని పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాజ్ భవన్ లో తేనీటి విందులను గవర్నర్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తేనేటి విందులనే ఎట్ హోంగా వ్యవహరిస్తుంటారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget