అన్వేషించండి

Governor At Home: అరగంట ఎదురుచూశాం, సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదు: తమిళిసై

At Home: రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంకు లేఖ రాసినా ఎందుకు రాలేదో తెలియదని గవర్నర్ అన్నారు. రాకపోవడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని వివరించారు.

At Home: రాష్ట్ర, దేశ వ్యాప్తంగా జెండా పండుగ వైభవంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గోల్కొండ కోట మీద జాతీయ జెండాను ఎగుర  వేశారు. తర్వాత ప్రభుత్వం చేసిన, త్వరలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. అంతకుముందు ప్రగతి భవన్ లో జెండా వందనం చేశారు. సాయంత్రం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. దానికి మాత్రం సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. సాయంత్రం 6.55 గంటలకు సీఎం వస్తారని ఆయన కార్యాలయం నుండి సమాచారం వచ్చినా, ఆయన మాత్రం రాలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. 

సమాచారం లేదు... 
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమానికి రావాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యక్తిగతంగా లేఖ రాశారు. దానికి స్పందనగా... సాయంత్రం 6.55 గంలటకు వస్తారని సీఎం కార్యాలయం నుండి సమాచారం వచ్చింది. కానీ ఎట్ హోం కార్యక్రమానికి సీఎం ఎందుకు రాలేదో తనకు తెలియదని గవర్నర్ తమిళిసై అన్నారు. తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. తాను, హైకోర్టు సీజే అరగంట పాటు ఎదురు చూశామని, అతిథులంతా వెయిట్ చేస్తుండటంతో ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించామని గవర్నర్ విలేకరులకు తెలిపారు. 

ఎట్ హోంకు వచ్చిన సీఎస్.. 
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పుదుచ్చేరి నుండి సాయంత్రం ఆరు గంటలకు రాజ్ భవన్ కు చేరుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ దంపతులు అప్పటికే రాజ్ భవన్ కు వచ్చారు. వారంతా ముఖ్యమంత్రి కోసం 7.20 గంటల వరకు ఎదురు చూశారు. ఆయన రాకపోవడంతో గవర్నర్ తేనేటి విందును ప్రారంభించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఎట్ హోంకు హాజరు అయ్యారు. తెరాస ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీజేపీ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పలువురు బీజేపీ మాజీ ప్రజా ప్రతినిధులు వచ్చారు. ఎట్ హోం కార్యక్రమానికి కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య కూడా హాజరయ్యారు. హైదరాబాద్, రాచకొండ సీపీలు, పలువులు స్వాతంత్ర్య సమరయోధులు ఎట్ హోం కార్యక్రమానికి వచ్చారు. అయితే టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ రాలేదు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలూ కనిపించలేదు. 

వస్తారని సమాచారం, కానీ రాలేదు..

స్వాతంత్ర్య దినోత్సవం నాడు సాయంత్రం 6.55 గంటలకు ముఖ్య మంత్రి రాజ్ భవన్ కు వస్తారని సీఎంవో సమాచారం ఇచ్చింది. సీఎం వస్తున్నారని పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాజ్ భవన్ లో తేనీటి విందులను గవర్నర్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తేనేటి విందులనే ఎట్ హోంగా వ్యవహరిస్తుంటారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget