అన్వేషించండి

Ganesh Nimajjanam 2022 Live Updates: కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, కాసేపట్లో నిమజ్జనం

Ganesh Nimajjanam 2022 Live Updates: గణేష్‌ నిమజ్జనానికి సంబంధించిన అన్ని అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.

LIVE

Key Events
Ganesh Nimajjanam 2022 Live Updates: కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, కాసేపట్లో నిమజ్జనం

Background

Ganesh Nimajjanam 2022: ఒక్కో తత్వానికి ఒక్కొక్కరు ప్రతీకలు... జల తత్వానికి ప్రతీక వినాయకుడు. అందుకే ‘గంగాసుతాయ నమః’ అని వినాయకుణ్ని పూజిస్తాం.

ఆకాశస్యధిపో విష్ణుః అగ్నిశ్చైవ మహేశ్వరః
వాయో సూర్యః క్షితిరీశః జలరూపో వినాయకః

మహాగణపతి ఆరాధనతో పకృతి పులకిస్తుంది. ప్రకృతి ధర్మాన్ని మానవాళి మరచిపోకుండా ఉండేందుకే ఏడాదికొకసారి మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు.  గణపతి పండుగలోని అంతరార్థం...ఆయనకు ఉండ్రాళ్లు పెట్టడం, భారీ విగ్రహాలను ప్రతిష్టించడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం కాదు..ఏ మట్టిని సస్యశ్యామలం చేయడంలో ప్రేరణశక్తిగా ఉన్నాడో ఆ గణపయ్యని శ్రద్ధతో పూజించడమే ముఖ్య ఉద్దేశం. మహాగణపతి అంటే పెద్ద పెద్ద రంగు రంగుల విగ్రహాలు కాదు.. మట్టితో తయారు చేసిన స్వచ్ఛమైన రూపం. 

Also Read: అక్టోబరు, నవంబరులో ఈ రోజుల్లో తిరుమల శ్రీవారి దర్శనం రద్దు

మట్టి అంటే భూమాతకు చిహ్నం. ఏ పదార్థమైనా ఆమె స్వరూపమే. భూదేవికి మనసారా నమస్కరించి, ప్రేమపూర్వకంగా కాస్తంత మట్టిని తీసుకుని గణపతి ప్రతిమచేయాలి. వానాకాలం మొదలవడానికి ముందే చెరువులు, కుంటల్లో క్రమపద్దతిలో మట్టి తీయడంతో కాలవలు, కుంటలు, చెరువుల్లో నీటినిలువ సామర్థ్యం పెరిగేది. అంటే వినాయకుని ప్రతిమల తయారీ వెనుకున్న ఓ అంతరార్థం చెరువులు, కాల్వల పూడికతీయడం. అంటే వినాయకుడు ఇంట్లో అడుగుపెట్టక ముందే జలసిరులతో చెరువులు,కుంటలు కళకళలాడాలి. మరోవైపు మట్టి పూడికతీత పనుల వల్ల భూగర్భజల మట్టం పెరిగేది.  

మొక్కలకు ఎరువుగా…
ఇంట్లో మట్టి ప్రతిమలు పూజాదికాలు పూర్తయ్యాక...పత్రి, నవధాన్యాలతో కలిపి ఇంటి పెరట్లో చెట్టుకింద ఉంచేవారు. తద్వారా ఎంత బలహీనంగా ఉండే చెట్టు అయినా ఏపుగా పెరిగేది. ఎందుకంటే పూజాద్రవ్యాల్లోని పోషకవిలవలు, పత్రిలోని విశిష్టగుణాలు ఉండటమే ఇందుకు కారణం. 

నిమజ్జనం వెనుక
నవరాత్రుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలో చెరువులోనో,  కుంటలోనూ నిమజ్జనం చేస్తారు. కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక...  ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ను జలంలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమ రహస్యం.

Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!

గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ! స్వస్థాన పరమేశ్వర
యత్ర బ్రహ్మాదయో దేవ! తత్ర గచ్ఛ గణాధిపా॥

‘పరమేశ్వర స్వరూపుడవైన ఓ గణనాయకా ! మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి, మా పూజలు అందుకొని మమ్మల్ని అనుగ్రహించిన ఓ దైవమా! ఏ దేవలోకం నుంచి అయితే వచ్చావో, బ్రహ్మాది దేవతలు ఉండే నీ స్వస్థలమైన ఆ దేవలోకానికి వెళ్లిరమ్మ’ని ప్రార్థిస్తూ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. 

మట్టిలో కలవాల్సిందే
భగవంతుడు తయారుచేసిన ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఎంత వైభోగం అనుభవించినా చివరకు పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే తప్ప శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలియజేస్తాడు గణనాథుడు. గణపతి జలరూపానికి ప్రతినిధి కనుక నీళ్లలో లయం చేయడం ద్వారా వచ్చిన చోటుకే చేరుకుంటాడన్నది తాత్వికార్థం. 

17:46 PM (IST)  •  09 Sep 2022

గణపతి భక్తులకు మంచినీరు, ప్రసాదం అందిస్తున్న ముస్లిం సోదరులు 

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంలో మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో గణపతి  భక్తులకు ప్రసాద పంపిణీతో పాటు మంచినీటి ని అందిస్తున్నారు. ఎస్ఆర్ నగర్ పోలిస్ స్టేషన్  పరిధిలోని మైత్రీవనం వద్ద గణపతి భక్తులకు మంచినీరు, ప్రసాదం అందిస్తున్నారు. ఇన్స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం సోదరులతో సమావేశం నిర్వహించి నిమజ్జనానికి సహకారం అందిచాలని కోరగా వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. హిందూ, ముస్లిం మతాల మధ్య సోదరభావం పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ప్రారంభించినట్లు సైదులు పేర్కొన్నారు.

15:32 PM (IST)  •  09 Sep 2022

టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణపయ్య 

తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తుల కోలాహలం మధ్య గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. బడా గణేశ్ టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్నాడు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సందడి నెలకొంది. 

14:28 PM (IST)  •  09 Sep 2022

Hussain Sagar: బోట్ లో పర్యటించి నిమజ్జనం పరిశీలన

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అవుతున్న తీరును మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ గద్వాల విజయలక్ష్మి బోట్ ద్వారా పరిశీలించారు.

14:23 PM (IST)  •  09 Sep 2022

Khairatabad Ganesh: కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న మహా గణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. వెల్డింగ్ పనులు పూర్తి కాగానే గణపతికి ఉత్సవ సమితి నిర్వహకులు హారతి ఇచ్చి శోభాయాత్రను మొదలుపెట్టారు.

12:54 PM (IST)  •  09 Sep 2022

Talasani Srinivas: ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకున్న మంత్రి తలసాని

ఖైరతాబాద్ గణేష్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. నగరంలో వైభవంగా నిమజ్జనం జరుగుతుందని అన్నారు. అసౌకర్యాలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా చూస్తున్నారని అన్నారు.

12:47 PM (IST)  •  09 Sep 2022

Nalgonda: నల్గొండ గణేష్ శోభాయాత్ర ప్రారంభించిన మంత్రి జగదీశ్ రెడ్డి

నల్గొండ పట్టణంలోని హనుమాన్‌ నగర్‌లో గల ఒకటో నంబర్ వినాయకుడి వద్ద మంత్రి జగదీష్ రెడ్డి పూజలు చేయించారు. అనంతరం శోభా యాత్రను ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 15 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. 10-20 అడుగుల పెద్ద విగ్రహాలు దండంపల్లి కాలువ వద్ద, 10 అడుగుల విగ్రహాలు వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే సూర్యాపేటలో మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

10:31 AM (IST)  •  09 Sep 2022

Balapur Ganesh Laddu Price: 24 లక్షల 60 వేలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ

బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ముగిసింది. లడ్డూను ఏకంగా 24 లక్షల 60 వేలు చెల్లించి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు.

10:29 AM (IST)  •  09 Sep 2022

Balapur Ganesh Laddu: వేలం ప్రారంభమైన కాసేపటికే 20 లక్షలు దాటిపోయిన లడ్డూ ధర

5 లక్షల నుంచి ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ ధరను వేలం పోటీలో పాల్గొన్న వారు అమాంతం పెంచుకుంటూ పోతున్నారు. కొద్ది నిమిషాలకే వేలంలో లడ్డూ ధర 20 లక్షలు దాటేసింది.

10:27 AM (IST)  •  09 Sep 2022

Balapur Laddu Auction Starts: బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభం, రసవత్తరంగా ప్రక్రియ

29వ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రారంభం అయింది. ఇందులో 9 మంది పాల్గొన్నారు. లడ్డూను దక్కించుకునేందుకు ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీ పడుతున్నారు. వీరిలో జక్కిడి శివచరణ్ రెడ్డి, దాసరి దయానంద్ రెడ్డి, ఎర్ర జయిం, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొణతం ప్రకాశ్ రెడ్డి, నవారి శ్రీనివాస్ రెడ్డి, వొంగేటి లక్ష్మారెడ్డి, కొలను శంకర్ రెడ్డి తదితరులు వేలం పాటలో పాల్గొన్నారు. 

10:04 AM (IST)  •  09 Sep 2022

ఉదయం ఐదు గంటలకు ఆఖరి పూజ

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ గణేష్ ఉదయం 5 గంటలకే ఆఖరి పూజలు అందుకున్నాడు. అనంతరం బాలాపూర్ గ్రామంలో గణేష్ శోభయత్ర కనులపండువగా జరుగుతోంది. బాలాపూర్ వీధుల్లో గణేష్ శోభయత్ర ఘనంగా సాగుతుంది....

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Hyderabad News: ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
TTD News: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Gaami OTT Records: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Vijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!Dinesh Karthik Hitting vs SRH IPL 2024: ప్రపంచకప్ రేసులోకి ఉసేన్ బోల్ట్ లా వచ్చిన దినేష్ కార్తీక్RCB vs SRH IPL 2024: మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Hyderabad News: ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
TTD News: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Gaami OTT Records: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
Rs 150 Flight Ticket: నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
Paris Olympics: నేటి నుంచే విశ్వ క్రీడల కౌంట్‌డౌన్‌ , ఒలింపియాలో కీలక ఘట్టం
నేటి నుంచే విశ్వ క్రీడల కౌంట్‌డౌన్‌ , ఒలింపియాలో కీలక ఘట్టం
Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
RCB vs SRH Highlights : మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్
మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్
Embed widget