అన్వేషించండి

Tirumala Alert: అక్టోబరు, నవంబరులో ఈ రోజుల్లో తిరుమల శ్రీవారి దర్శనం రద్దు

Tirumala Alert: అక్టోబరు 25, నవంబరు 8 తేదీల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఆగండి.. మీ కోసమే ఈ ముఖ్యమైన గమనిక..

 కోట్లాది భక్తుల ఆరాధ్యదైవం  అయిన శ్రీ వేంకటేశ్వరుడి క్షణకాలం పాటు జరిగే దర్శనం కోసం భక్తులు తపించిపోతారు. ఎన్నో వ్యయ ప్రయాసలు ఓర్చి స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. అయితే ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో రెండు రోజుల పాటూ కొన్ని గంటలపాటూ శ్రీవారి దర్శనాలు నిలుపదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అక్టోబర్ 25, నవంబర్ 8వ తేదీన తిరుమలకు వచ్చే భక్తులు తప్పని సరిగా తెలుసుకోవాలి..

అక్టోబరు 25, నవంబరు 8న ఎందుకంటే ఆ రెండు రోజులు గ్రహణం ఉంది. సాధారణంగా గ్రహణ కాలం అంటేనే సకల దేవతామూర్తుల శక్తులు తగ్గుతాయని విశ్వసిస్తారు. అందుకే ఆ సమయంలో తినే ఆహారం కూడా రాక్షసభోజనంగా పరిగణిస్తారు. కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉంటారు. ఎంత ముఖ్యమైన పనులున్నా ఆ సమయంలో ఇంటినుంచి బయటకు అడుగుపెట్టనివారూ ఉన్నారు. గ్రహణం సమయం ముగిసిన తర్వాత తలకు స్నానం చేసి ఇల్లంతా కడిగేసే సంప్రదాయాన్ని కూడా ఇప్పటికీ పాటిస్తున్నారు కూడా.  గ్రహణం ఉన్న ఘడియల్ని అంత పవర్ ఫుల్ గా భావిస్తారు. అందుకే ఆ సమయంలో ఆలయాలు కూడా కొన్ని గంటల పాటూ మూసివేస్తారు. తిరిగి ప్రక్షాళన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 

Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!

గ్రహణాలు ఎప్పుడంటే
అక్టోబర్ 25న ఆదివారం సూర్య గ్రహణం
సాయంత్రం 5.11 నుంచి  6:27 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఆ రోజు ఉదయం 8 గంటల నుంచీ రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోప‌ల పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హిస్తారు. అనంత‌రం మొద‌టి అర్చ‌న‌, మొద‌టి గంట‌, బ‌లి శాత్తుమొర‌, రెండో అర్చ‌న, రెండో గంట త‌దిత‌రాల‌ను ఏకాంతంగా చేప‌డ‌తారు. శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

నవంబరు 8 చంద్ర గ్రహణం
నవంబరు 8న చంద్రగ్రహణం మధ్యాహ్న సమయంలో ఉంది. ఈ కారణంగా ఆ రోజు కూడా స్వామివారి ఆలయాన్ని  ఉదయం 8:40 నుంచి రాత్రి 7:20 గంటల వరకు మూసివేస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల  మధ్య సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోప‌ల పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హిస్తారు. అనంత‌రం అర్చ‌న‌, గంట‌, బ‌లి శాత్తుమొర‌, రెండో అర్చ‌న, గంట త‌దిత‌రాల‌ను ఏకాంతంగా చేప‌డ‌తారు.రాత్రి 9 గంటల అనంతరం శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 

Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం

గ్రహణం కాలంలో టీటీడీ రద్దు చేసిన సేవలివే
అక్టోబర్ 25, నవంబర్ 8 వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఉంజల్ సేవ,ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీప అలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ.
వయో వృద్దులు వికలాంగులు, చిన్న పిల్లల తల్లి తండ్రులు, ఎన్ఆర్ఐ, ఆర్మీ,డిఫెన్స్ ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది. 
ఈ రెండు రోజుల్లో కేవలం సర్వదర్శనంకు వచ్చిన భక్తులకు మాత్రమే అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు
గ్ర‌హ‌ణం స‌మ‌యంలో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ సైతం నిలుపుదల చేసింది టీటీడీ

ఇవన్నీ గమనించి భక్తులు తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని సూచించారు టీటీడీ అధికారులు...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP DesamKarun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Pawan Wife: పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా  ఫ్యాన్స్ అయిపోయారుగా !
పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా ఫ్యాన్స్ అయిపోయారుగా !
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ABV VS YSRCP:  రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ వయా కోడికత్తి కేసు - రాజకీయం  మారుతోందిగా !
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ వయా కోడికత్తి కేసు - రాజకీయం మారుతోందిగా !
Embed widget