News
News
X

Sri Chaitanya Incident: సాత్విక్ సూసైడ్‌పై ప్రభుత్వానికి కమిటీ రిపోర్టు, తప్పుల తడక? శ్రీచైతన్యకు ఝలక్!

శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫిబ్రవరి 28వ తేదీన అతను తరగతి గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

FOLLOW US: 
Share:

నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విచారణ కమిటీ రిపోర్టును ఇచ్చింది. ఆ కాలేజీలో సాత్విక్‌ అడ్మిషన్‌ లేదని ప్రాథమిక నివేదికలో కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్‌, మరో కాలేజీలో క్లాసులు జరుపుతున్నారని అని రిపోర్టులో స్పష్టం చేసింది. వేరే కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ ఉన్నా కూడా నార్సింగి కాలేజీలో సాత్విక్ చదువుతున్న విషయాన్ని నివేదికలో కమిటీ ప్రస్తావించింది. అన్ని కార్పొరేట్‌ కాలేజీల్లోనూ ఇదే వ్యవహారం నడుస్తోందని విచారణ కమిటీ వెల్లడించింది. క్లాసులు శ్రీచైతన్య కాలేజీలో పెడుతూ చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నారని గుర్తించింది. ఈ క్రమంలోనే అడ్మిషన్ల విషయంపై అన్ని కాలేజీల్లో చెక్‌ చేయాలని కమిటీ సూచించింది. ర్యాగింగ్‌ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ తెలిపింది. విద్యార్ధుల అడ్మిషన్లపై చెక్ చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది.

శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫిబ్రవరి 28వ తేదీన అతను తరగతి గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో సిబ్బంది అయిన కృష్ణారెడ్డి, రవి, ఆచార్య, నవీన్ వంటి వారు బాగా ఒత్తిడికి గురి చేసినట్లుగా సాత్విక్ సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. ఈ లేఖ ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నలుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. సాత్విక్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై విచారణ కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిత్తల్ నేతృత్వంలో కమిటీ ఐదు రోజుల పాటు విచారణ చేసింది. ఈ కమిటీ ప్రాథమిక నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.

నివేదిక తప్పుల తడక!

అయితే, ఈ విచారణలో ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్యపై వివరాలను నివేదిక రూపంలో తప్పుల తడకగా అందించారు. ఉస్మానియా మార్చురీలో మృతదేహం ఉంటే.. గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్టు రిపోర్టులో​ రాశారు. ఈ నేపథ్యంలో రిపోర్టు తయారు చేసిన, రాసిన అధికారులపై సాత్విక్‌ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రిపోర్టులో సాత్విక్‌కు కాలేజీలో అడ్మిషన్‌ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్‌.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. 

ఈ విషయంపై కూడా సాత్విక్‌ తల్లిదండ్రులు స్పందించారు. తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. సాత్విక్‌ను శ్రీ చైతన్య కాలేజ్‌ పేరు మీదనే అడ్మిషన్‌ తీసుకున్నామని తెలిపారు. శ్రీ చైతన్య కాలేజీ నార్సింగి క్యాంపస్‌లోనే సాత్విక్‌ను ఉంచుతామని, అదే కాలేజీలో క్లాసులు చెప్తామని కాలేజీ వారు చెప్పినట్లుగా తండ్రి చెప్పారు. వేరే కాలేజీలో అడ్మిషన్‌ ఉన్నట్టు తమకు తెలియదని వివరించారు. కాలేజీ యాజమాన్యమే తమ కొడుకును చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Published at : 05 Mar 2023 12:01 PM (IST) Tags: Telangana Govt Enquiry committee Sathwik suicide incident Sri chaitanya Junior college

సంబంధిత కథనాలు

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

గ్రీన్ హైదరాబాద్ దిశగా కీలక అడుగులు - GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన అంశాలివే!

గ్రీన్ హైదరాబాద్ దిశగా కీలక అడుగులు -  GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన అంశాలివే!

TSPSC Issue: టీఎస్పీఎస్సీ దగ్గర వాల్‌పోస్టర్ల కలకలం! జిరాక్స్ సెంటర్ అంటూ ఎద్దేవా, కీలక డిమాండ్లు

TSPSC Issue: టీఎస్పీఎస్సీ దగ్గర వాల్‌పోస్టర్ల కలకలం! జిరాక్స్ సెంటర్ అంటూ ఎద్దేవా, కీలక డిమాండ్లు

Hyderabad News: తోటి విద్యార్థితో కూతురి ప్రేమ పెళ్లి - తట్టుకోలేక తల్లి ఘోరమైన పని!

Hyderabad News: తోటి విద్యార్థితో కూతురి ప్రేమ పెళ్లి - తట్టుకోలేక తల్లి ఘోరమైన పని!

టాప్ స్టోరీస్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!

CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ

CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ