అన్వేషించండి

MLA Mahipal Reddy: రూ.300 కోట్ల స్కామ్ లో ఇరుక్కున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఈడీ సంచలన ప్రకటన

BRS MLA మహిపాల్ రెడ్డి అతడి సోదరుడి ఇళ్లు, ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు జరిపారు. పటాన్ చెరు ఎమ్మెల్యే దాదాపు రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Patancheru MLA Mahipal Reddy and brother in ED Case | హైదరాబాద్: పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ఇళ్లు, ఆస్తులపై సోదాలు చేసిన ఈడీ సంచలన ప్రకటన చేసింది. మైనింగ్ పేరుతో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, ఆయన సోదరుడు మహిపాల్ రెడ్డి రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు శుక్రవారం నిర్ధారణకు వచ్చారు. మైనింగ్ వ్యవహారంలో వీరి ద్వారా రూ.39 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం చేకూరినట్లు అధికారులు గుర్తించారు. 

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడి ఇల్లు, ఆఫీసులపై ఈడీ గత రెండు రోజులుగా సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్, హవాలా అనుమానాలతో ఈడీ ఆకస్మిక సోదాలు చేసింది. రియల్ ఎస్టేట్ లో ఈ డబ్బు పెట్టారని గుర్తించిన ఈడీ సోదాలు పూర్తయ్యాక దీనిపై ఓ ప్రకటన చేసింది. 

ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూర్చారని ఈడీ ప్రకటన 
మహిపాల్ రెడ్డి మైనింగ్ పేరుతో భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని, దాని విలువ దాదాపు రూ. 300 కోట్ల మేర ఉంటుందని ఈడీ భావిస్తోంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరులు చేసిన చర్యల కారణంగా ప్రభుత్వానికి రూ. 39 కోట్లు నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది. అక్రమంగా సంపాదించిన డబ్బును ఆపై రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేశారని.. కొంత డబ్బు  బ్యాంక్ అకౌంట్లలో ట్రాన్స్ క్షన్ చేసినట్లు గుర్తించామని ఓ ప్రకటనలో ఈడీ అధికారులు ప్రకటించారు. తాము చేపట్టిన సోదాలతో రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బినామీల పేర్ల మీద ట్రాన్సాక్షన్స్ జరిపారని, కొన్ని బ్యాంక్ లాకర్స్‌ని తెరిచి పూర్తి స్థాయిలో లెక్క కట్టాల్సి ఉందన్నారు. 

మహిపాల్ రెడ్డిని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు 
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లి వారిని పరామర్శించారు. ఈడీ తనిఖీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో హరీష్ రావు వెంటన బీఆర్ఎస్ నేతలు సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. 
అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ దాడులతో వేదిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని, కానీ తమ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. 

‘బిహార్, గుజరాత్ లలో నీట్ ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నారు. అక్కడ ఈడీ అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదు
రాష్ట్రంలో లక్షల విద్యార్థులు నీట్ పరీక్ష వ్రాశారు, వారిభవిష్యత్తు అయోమంలో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురి చేస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరింపు ధోరణినికి పాల్పడుతున్నారు. మా ఎమ్మెల్యే  మహిపాల్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన ఏ తప్పు చేయలేదు.. ఈడీకి ఏలాంటి అక్రమ ఆస్తులు దొరకలేదు. కానీ ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తున్నా కర్కశంగా ఈడీ దాడులు చేయటం దారుణం. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు’ హరీష్ రావు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Regional Ring Rail Project: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! రీజనల్ రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్, ఇక పట్టాలెక్కేనా?
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్టు... రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Telangana Governor Speech Highlights: హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget