అన్వేషించండి

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులిచ్చాం, అయినా.. సైబరాబాద్ కమిషనర్ వెల్లడి

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించి వార్షిక నేర నివేదికను కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విడుదల చేశారు. 

కొద్ది నెలల క్రితం సినీ హీరో సాయిధరమ్‌ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదం వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఆయన కోలుకున్న తర్వాత ప్రమాదానికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చామని అన్నారు. 91 సీఆర్పీసీ కింద సాయిధరమ్‌ తేజ్‌కు నోటీసులు జారీం చేశామని.. లైసెన్స్, బైక్ ఆర్‌సీ, వాహన ఇన్సూరెన్స్, పొల్యూషన్ తదితర పత్రాలన్నీ సమర్పించాల్సిందిగా నోటీసులు పంపినట్లు చెప్పారు. అయితే, ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదని చెప్పారు. ఈ కేసులో త్వరలోనే చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించి వార్షిక నేర నివేదికను స్టీఫెన్ రవీంద్ర విడుదల చేశారు. 

ఆస్తులకు సంబంధించి 4.3 శాతం నేరాలు పెరిగాయని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య తగ్గిందని, ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 759 మంది మృతి చెందారని తెలిపారు. వీటిల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 82 శాతం మంది చనిపోయారని చెప్పారు. మొత్తం 712 రోడ్డు ప్రమాదాల్లో మద్యం మత్తు కారణంగా 212 ప్రమాదాలు జరిగాయని వివరించారు. ఫూటుగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్ల నుంచి రూ.4.5 కోట్లు జరిమానాల రూపంలో వసూలైనట్టుగా తెలిపారు. 9,981 మంది వాహనదారుల లైసెన్స్‌ రద్దు చేశామని వివరించారు. 

200 మంది నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశామని అన్నారు. 3 వేలకు పైగా సైబర్ క్రైమ్ కేసులు ఈ ఏడాది నమోదైనట్టు వివరించారు. గతేడాదితో పోల్చితే రెండింతలు సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని అన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. మొత్తం 36 వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. 1.6 లక్షల సీసీటీవీ కెమెరాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్నాయని చెప్పారు. 2021లో ఓవరాల్ క్రైమ్ రేట్ 13.24 శాతం పెరిగిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.

Also Read: Telangana Omicron: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు... 182 కరోనా కేసులు, ఒకరు మృతి

Also Read: షిర్డీ వెళ్తున్నారా? ఆగండి.. ఆగండి.. దర్శన వేళల్లో మార్పులు చేశారు తెలుసా? 

Also Read: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు... కేరళ, ఉత్తరాఖండ్ లో నైట్ కర్ఫ్యూ... కోవిడ్ నియంత్రణ చర్యలు పొడిగింపు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Google Pixel 8a Colour: గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Google Pixel 8a Colour: గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
DC vs GT Match Highlights: 'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
Actor Raghubabu Car Incident: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
Embed widget