అన్వేషించండి

Hyderabad Liberation Day: విమోచన దినంపై కేంద్రం నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలి: సీపీఎం డిమాండ్

Hyderabad News: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర హోంశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.

Central Govt gazette notification to organize Hyderabad Liberation Day: హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంపై జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని సీపీఐ(ఎం) కోరుతోంది. సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవం జరపాలంటూ కేంద్ర హౌంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయటాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇలా చేస్తే, ఇది చరిత్రను వక్రీకరించడమే అవుతుందని తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ నోటిఫికేషన్ జారీ చేయటం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని, నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసిన కమ్యూనిస్ట్ నేతలు  
పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి కమ్యూనిస్ట్ నేతలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిపించారు. అయితే ఈ పోరాటంతో ఏ సంబంధం లేని వాళ్లు ఇది విమోచన దినం అంటున్నారంటూ మండిపడ్డారు. భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో భూమి కోసం, భుక్తి కోసం, జమీందారీ వ్యవస్థ నుంచి విముక్తి కోసం పోరాటం జరిగిందన్నారు. ఈ పోరాటం కాలంలో, స్వాతంత్య్ర సమయంలో బ్రిటిష్‌ పాలకులతో జరిగిన ఒప్పందం మేరకు జవహర్‌లాల్ నెహ్రూ- సర్దార్ వల్లభాయ్ పటేల్‌ ప్రభుత్వం, నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో యధాతథ ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా గుర్తించారు. సాయుధ రైతాంగ పోరాటాన్ని అణిచివేయలేని సమయంలో  నిజాం రాజు చేతులెత్తేస్తుంటే కేంద్ర ప్రభుత్వ సైన్యాలు ప్రవేశించాయి. దాంతో నిజాం రాజు ఎలాంటి ప్రతిఘటన లేకుండా లొంగిపోయాడని ఓ ప్రకటనలో సీపీఎం పేర్కొంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేస్తూ సెప్టెంబర్‌ 17న సంతకం చేశారు కనుక, అది విలీనమైన రోజు అని విమోచన దినోత్సవం కాదన్నారు. 

 ‘మరోవైపు కేంద్ర సైన్యం రజాకార్‌ నాయకుడు కాశిం రజ్వీని అరెస్టు చేసి మరణశిక్ష విధిస్తారని రైతాంగం ఆశించింది. కానీ రజ్వీని పాకిస్తాన్‌కు పంపించారు. 7వ నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ను కూడా అరెస్టు చేయలేదు. పైగా ఆనాటి హోం మంత్రి సర్దార్‌ పటేల్‌ పోరాడుతున్న తెలంగాణ నెత్తిన 7వ నిజాం రాజునే పేరు మార్చి రాజప్రముఖ్‌గా నియమించారు. రాజుతో చేతులు కలిపిన భారత సైన్యం రైతాంగం మీద హత్యాకాండ జరిపింది. భయంకరమైన అణచివేత సాగించారు. ఈ వాస్తవాల నుంచి కొత్తతరం ప్రజలకు తెలియకుండా వారిని పక్కదోవ పట్టిస్తూ, ఆనాటి పోరాటానికి మతం రంగు పులిమే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సీపీఐ(ఎం) కోరుతున్నది’ అని CPI(M) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటన విడుదల చేశారు.

సెప్టెంబర్‌ 17 అధికారిక కార్యక్రమాలు నిర్వహించేలా గెజిట్ 
కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన మరోవైపు లోక్‌సభ ఎన్నికలు ఇలాంటి టైంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో వివాదానికి కారణమవుతున్న సెప్టెంబర్‌ 17ను అధికారికం చేసింది. ఆ రోజును "హైదరాబాద్‌ లిబరేషన్ డే"గా నిర్వహించాలని గెజిట్‌ జారీ చేసింది.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget