అన్వేషించండి

Telangana: సీఎం రేవంత్‌కు చేతనైతే కొడంగల్‌కు మెడికల్ కాలేజ్ తేవాలి: నిరంజన్ రెడ్డి

Niranjan Reddy at Telangana Bhavan: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, కాంగ్రెస్ నేతల్ని గిల్లితే బీజేపీ నేతలకు నొప్పి లేస్తున్నదంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Congress Govt failed to deliver on promises: హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తున్నదంటూ తెలంగాణ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఎద్దేవా చేశారు. మొన్నటివరకూ బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆర్ మీద బురదజల్లిన బీజేపీ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని నిరంజన్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మీడియాతో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ కార్పోరేషన్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఆలేరు మెడికల్ కాలేజీని కొడంగల్ కు తరలించడం కాదని, సీఎం రేవంత్ రెడ్డికి చేతనైతే కొత్త మెడికల్ కళాశాల కొడంగల్ లో ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. ఉచిత బస్సు తప్ప 72 రోజులలో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు, హామీలకు పరిష్కారం దొరకలేదని, కనీసం ప్రత్యామ్నాయం కూడా దొరకని పరిస్థితి ఉందన్నారు.

కాంగ్రెస్ ఏం చేయనుందో ఒక్క ముక్కా చెప్పలేదు..
అసెంబ్లీలో ఎంతసేపూ గత ప్రభుత్వం (బీఆర్ఎస్ ప్రభుత్వం) ఏం చేసింది ? అని ప్రశ్నించారు. కానీ అంతకన్నా ఏం మెరుగ్గా చేస్తాం అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకపోవడం విచారకరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలకు సంబంధించి బడ్జెట్ లో సరిపడా కేటాయింపులు లేవని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 72 రోజులలోనే గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చిచెప్పిందన్నారు. మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

అందుకే హరీష్ రావుకు అడ్డంకులు
అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు అడిగే ప్రశ్నలకు హరీష్ రావు జవాబులు చెప్పడాన్ని.. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోయారని.. అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఇరిగేషన్ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. 15 నెలల కిందట హిమాచల్, 8 నెలల కిందట కర్ణాటకలో, 72 రోజుల కిందట 10, 5, 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలమయిందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. 

మళ్లీ మొదలైన కరెంట్ కోతలు
‘తెలంగాణ ప్రాంతంలో తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి కరంటు కోతలు మొదలయ్యాయి. మూడెకరాలకు మించి రైతుబంధు ఇంత వరకూ ఇవ్వలేదు. రైతుభరోసా అమలు చేస్తారా ? చేయరా ? ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15 వేలు ఎప్పటినుంచి ఇస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి. కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని హామీల అమలును తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నది. ప్రభుత్వం మీ చేతిలోనే ఉన్నది. కాళేశ్వరంపై అత్యన్నతస్థాయిలో విచారణ జరిపించండి. ఏ చర్యకైనా, విచారణకైనా బీఆర్ఎస్ సిద్ధమని’ నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

రైతులకు అన్యాయం చేయవద్దు
బీఆర్ఎస్ మీద కక్ష్యతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయవద్దు అని కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్లు, టన్నెళ్లను వాడుకునేందుకు అవకాశం ఉందని, ప్రభుత్వం ఈ విషయాలు పరిశీలించాలన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ల సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. వాటి పేర్లు మారుస్తారా, లేక ఏం చేస్తారో అర్థం కావడం లేదన్నారు.  

ఆలేరు మెడికల్ కళాశాల కొడంగల్ కు తరలించడం పద్దతికాదని, చేతనైతే కొత్త మెడికల్ కళాశాల కొడంగల్ లో పెట్టాలని సవాల్ విసిరారు. వెనకబడ్డ కొడంగల్ అభివృద్దిని మేము ఖచ్చితంగా స్వాగతిస్తామన్నారు. వనపర్తి రాజులు కట్టిన సరళాసాగర్ ప్రాజెక్టు నిజాం రాజులు కట్టారని నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు. శబరి నదికి తెలంగాణకు, కాళేశ్వరానికి అస్సలు సంబంధం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న దుగ్దతో మంత్రులు, కాంగ్రెస్ సభ్యులు ఏం మాట్లాడుతున్నారోనంటూ మండిపడ్డారు. 

కాంగ్రెస్ నేతల భౌగోళిక పరిజ్ఞానానికి దండాలు
‘తెలంగాణ ప్రతి ఇంచు మీద కేసీఆర్ గారికి అవగాహన ఉన్నది. అందుకే గత పదేళ్లలో తెలంగాణను అభివృద్ది చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు మీద ప్రజలకు ప్రభుత్వం జవాబు చెప్పాలి. రైతుబంధు, రైతుభీమా, నీళ్లు, కరంటు, వరి ధాన్యం, పంటల కొనుగోళ్లు, వరి ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ పై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. వరి ధాన్యానికి రూ.500 బోనస్ విషయంలో మాటతప్పితే విడిచిపెట్టేది లేదని’ బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget