అన్వేషించండి

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి!

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. వెంటనే అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తరుచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలతో కాసేపు మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. దట్టంగా అలముకున్న పొగతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ కు వివరించారు. వెంటనే ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత బస్తీవాసుల యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. బీజేపీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

అంతేకాకుండా సికింద్రాబాద్‌ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. సికింద్రాబాద్ లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు యువకులు అదృశ్యం కావడం తీవ్ర ఆందోళన కల్గిస్తోందని తెలిపారు. ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్ ను పటిష్టంగా అమలు చేసేలా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు. గాయపడిన వారిని రక్షించేందుకు పరిగెత్తుతున్న వైద్యుడి ఫొటో.. నిజంగా పౌరసమాజానికి కనువిప్పు కల్గిస్తోందని ఆయన వివరించారు. 

నిన్న అసలేం జరిగిందంటే..?

సికింద్రాబాద్(Secunderabad) మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మంటల ధాటికి ఆరు అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ భవనంలో 12 గంటలకుపైగా అగ్ని కీలాలు ఉండడంతో లోపలికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు భవనంలో బిహార్ కు చెందిన ముగ్గురు కూలీలు... జునైద్, వసీం, అక్తర్ చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగిన భవనంలోనే ఆచూకీ లభ్యం కాని కూలీల సెల్ ఫోన్ లొకేషన్ చూపిస్తుండడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. కూలీలు ముగ్గురు అదే భవనంలో చిక్కుకొని ఉంటే మాత్రం వారు సజీవ దహనం అయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. కూలీల ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ క్రేన్ సాయంతో బయట నుంచి భవనంపై అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

భవనం పూర్తిగా దెబ్బతిన్నందున గాలింపు పూర్తయ్యాక కూల్చివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సహాయ చర్యల్లో పాల్గొని అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడీఏఫ్ఓ ధనంజయ్ రెడ్డితో పాటు ఫైర్ ఇంజిన్ డ్రైవర్ నర్సింగరావు గురువారం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను వెంటిలేటర్ పై ఉంది చికిత్స అందిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget