అన్వేషించండి

Cantonment Elections: దేశ వ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ ఎన్నికలు వాయిదా, నోటిఫికేషన్ రద్దు

Secunderabad Cantonment Elections Postpone: దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణపై గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం.

Cantonment Board Elections: దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణపై గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ (SCB) సహా దేశ వ్యాప్తంగా 57 కంటోన్మెంట్ బోర్డులకు ఏప్రిల్ 30 న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఎన్నికలు వాయిదా వేశారు.

ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించడానికి గతంలో నోటిఫికేషన్ వచ్చింది. కానీ తాజాగా ఎన్నికలు వాయిదా వేస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ ను కేంద్రం రద్దు చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మొత్తం ఎనిమిది వార్డులు ఉన్నాయి. 2019 రిజర్వేషన్‌ ప్రకారం అందులో 2, 5, 6 వార్డులు మహిళలకు రిజర్వ్ చేశారు. అయితే వార్డులు- 1, 3, 4, 7 జనరల్ కేటగిరీకి ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాలకు 8వ వార్డ్ రిజర్వ్ చేశారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు ఫ్రీ సింబల్స్ ఆధారంగా జరుగుతాయని, వార్డుల రిజర్వేషన్ గతంలో మాదిరిగా ఉంటుందని కంటోన్మెంట్ బోర్డు అధికారులు ధృవీకరించారు.

2015 నుంచి 2020 వరకు పదవీకాలం పూర్తయ్యాక కంటోన్మెంట్ బోర్డు పదవీకాలం మరో మూడేళ్లపాటు పొడిగించడం తెలిసిందే. అనంతరం ఇటీవల విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ పై SCB అధికారుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది అధికారులు నోటిఫికేషన్‌ను అంగీకరించారు. మరికొందరు కంటోన్మెంట్ బోర్డును (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) GHMC లో విలీనం చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతుందని ప్రచారంలో ఉంది.

ఇటీవల కంటోన్మెంట్ బోర్డు ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఇతర కంటోన్మెంట్ బోర్డులతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర రక్షణ శాఖ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని కొన్ని ప్రాంతాలను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలని, నగర కార్పొరేషన్ లో కలపాలన్న ప్రతిపాదన ఇప్పటికే ఆలస్యం అయిందని ఓపెన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ శంకరన్ అన్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఓటర్ల నమోదుకు మార్చి 4తో తుది గడువు ముగిసింది. మార్చి 23న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం మార్చి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 6న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. ఏప్రిల్ 10న అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నట్లు SCB సీఈవో మధుకర్ నాయక్ ఇటీవల వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget