అన్వేషించండి

Cantonment Elections: దేశ వ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ ఎన్నికలు వాయిదా, నోటిఫికేషన్ రద్దు

Secunderabad Cantonment Elections Postpone: దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణపై గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం.

Cantonment Board Elections: దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణపై గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ (SCB) సహా దేశ వ్యాప్తంగా 57 కంటోన్మెంట్ బోర్డులకు ఏప్రిల్ 30 న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఎన్నికలు వాయిదా వేశారు.

ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించడానికి గతంలో నోటిఫికేషన్ వచ్చింది. కానీ తాజాగా ఎన్నికలు వాయిదా వేస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ ను కేంద్రం రద్దు చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మొత్తం ఎనిమిది వార్డులు ఉన్నాయి. 2019 రిజర్వేషన్‌ ప్రకారం అందులో 2, 5, 6 వార్డులు మహిళలకు రిజర్వ్ చేశారు. అయితే వార్డులు- 1, 3, 4, 7 జనరల్ కేటగిరీకి ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాలకు 8వ వార్డ్ రిజర్వ్ చేశారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు ఫ్రీ సింబల్స్ ఆధారంగా జరుగుతాయని, వార్డుల రిజర్వేషన్ గతంలో మాదిరిగా ఉంటుందని కంటోన్మెంట్ బోర్డు అధికారులు ధృవీకరించారు.

2015 నుంచి 2020 వరకు పదవీకాలం పూర్తయ్యాక కంటోన్మెంట్ బోర్డు పదవీకాలం మరో మూడేళ్లపాటు పొడిగించడం తెలిసిందే. అనంతరం ఇటీవల విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ పై SCB అధికారుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది అధికారులు నోటిఫికేషన్‌ను అంగీకరించారు. మరికొందరు కంటోన్మెంట్ బోర్డును (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) GHMC లో విలీనం చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతుందని ప్రచారంలో ఉంది.

ఇటీవల కంటోన్మెంట్ బోర్డు ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఇతర కంటోన్మెంట్ బోర్డులతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర రక్షణ శాఖ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని కొన్ని ప్రాంతాలను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలని, నగర కార్పొరేషన్ లో కలపాలన్న ప్రతిపాదన ఇప్పటికే ఆలస్యం అయిందని ఓపెన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ శంకరన్ అన్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఓటర్ల నమోదుకు మార్చి 4తో తుది గడువు ముగిసింది. మార్చి 23న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం మార్చి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 6న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. ఏప్రిల్ 10న అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నట్లు SCB సీఈవో మధుకర్ నాయక్ ఇటీవల వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget