అన్వేషించండి

Cantonment Elections: దేశ వ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ ఎన్నికలు వాయిదా, నోటిఫికేషన్ రద్దు

Secunderabad Cantonment Elections Postpone: దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణపై గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం.

Cantonment Board Elections: దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణపై గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ (SCB) సహా దేశ వ్యాప్తంగా 57 కంటోన్మెంట్ బోర్డులకు ఏప్రిల్ 30 న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఎన్నికలు వాయిదా వేశారు.

ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించడానికి గతంలో నోటిఫికేషన్ వచ్చింది. కానీ తాజాగా ఎన్నికలు వాయిదా వేస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ ను కేంద్రం రద్దు చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మొత్తం ఎనిమిది వార్డులు ఉన్నాయి. 2019 రిజర్వేషన్‌ ప్రకారం అందులో 2, 5, 6 వార్డులు మహిళలకు రిజర్వ్ చేశారు. అయితే వార్డులు- 1, 3, 4, 7 జనరల్ కేటగిరీకి ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాలకు 8వ వార్డ్ రిజర్వ్ చేశారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు ఫ్రీ సింబల్స్ ఆధారంగా జరుగుతాయని, వార్డుల రిజర్వేషన్ గతంలో మాదిరిగా ఉంటుందని కంటోన్మెంట్ బోర్డు అధికారులు ధృవీకరించారు.

2015 నుంచి 2020 వరకు పదవీకాలం పూర్తయ్యాక కంటోన్మెంట్ బోర్డు పదవీకాలం మరో మూడేళ్లపాటు పొడిగించడం తెలిసిందే. అనంతరం ఇటీవల విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ పై SCB అధికారుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది అధికారులు నోటిఫికేషన్‌ను అంగీకరించారు. మరికొందరు కంటోన్మెంట్ బోర్డును (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) GHMC లో విలీనం చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతుందని ప్రచారంలో ఉంది.

ఇటీవల కంటోన్మెంట్ బోర్డు ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఇతర కంటోన్మెంట్ బోర్డులతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర రక్షణ శాఖ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని కొన్ని ప్రాంతాలను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలని, నగర కార్పొరేషన్ లో కలపాలన్న ప్రతిపాదన ఇప్పటికే ఆలస్యం అయిందని ఓపెన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ శంకరన్ అన్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఓటర్ల నమోదుకు మార్చి 4తో తుది గడువు ముగిసింది. మార్చి 23న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం మార్చి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 6న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. ఏప్రిల్ 10న అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నట్లు SCB సీఈవో మధుకర్ నాయక్ ఇటీవల వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Family Register: ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget