అన్వేషించండి

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: బీజేపీ కార్యవర్గ భేటీలో బండి సంజయ్ స్పీచ్‌

కేసీఆర్‌ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకత తాను చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో బహిర్గతమైందని పార్టీ నాయకులకు వివరించారు బండి సంజయ్‌.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జరిగే బీజేపీ రాష్ట్రకార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. కేసీఆర్‌, ఆయన కుటుంబంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. 

కేసీఆర్‌ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకత తాను చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో బహిర్గతమైందని పార్టీ నాయకులకు వివరించారు బండి సంజయ్‌. తెలంగాణ వ్యాప్తంగా తాను ఐదు విడుతల్లో యాత్ర చేపట్టానని.. దాని విజయవంతంగా నడిపిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు సంజయ్. ఈ యాత్ర సందర్భంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ గోడు వెల్లబోసుకున్నారని... అనేక సమస్యలను తమ దృష్టి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన అన్ని వర్గాలను తీవ్ర నిరాశ నిస్పృహలకు కారణమైందని విమర్శించారు. ఆయన కుటుంబాన్ని తప్ప ఏ వర్గాన్ని పాలనతో సంతృప్తి పరచలేకపోయారని ధ్వజమెత్తారు. 

సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీగా బీజేపీని తెలంగాణ ప్రజలు చూస్తున్నారని అన్నారు బండి సంజయ్‌. అందుకే బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో అని అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని వివరించారు. పాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అ దిశగానే నాయకులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో వేటిని కూడా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు బండి సంజయ్. రజాకార్ల విధానంలో అవినీతితో పాలన సాగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేదన్నారు. మళ్లీ పాలన గాడిలో పడాలన్నా అభివృద్ధి సాధించాలన్నా తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావాలని తెలిపారు బండి సంజయ్.

తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పేరుతో దేశ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు బండి సంజయ్. ఇక్కడ డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లు, దళిత బంధ్‌, రైతు బంధ్‌, ఇతర ప్రభుత్వ పథకాలను సరిగా ప్రజలకు అందించేలని వ్యక్తి దేశ రాజకీయాల్లో ఏం చేస్తారని నిలదీశారు. తెలంగాణలో ప్రశ్నించిన వ్యక్తులపై కేసులు పెట్టిస్తున్నారని... ఉద్యోగులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఇక్కడ స్వేచ్ఛలేదన్నారు. 

త్వరలోనే జిల్లా, మండల కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నట్టు బండి సంజయ్‌ వివరించారు. జాతీయ కార్యవర్గంలో తీసుకున్న  నిర్ణయాలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు అందరూ పని చేయాలని సూచించారు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన జేపీ నడ్డాకు రాష్ట్ర కార్యవర్గంలో మొదటిగా అభినందనలు చెప్పింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Embed widget