By: ABP Desam | Updated at : 09 Jul 2022 12:08 PM (IST)
అమర్నాథ్ యాత్రలో ప్రమాదం జరిగిన స్పాట్లో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
Amarnath Cloudburst: భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రలో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ పవిత్ర క్షేత్రానికి సమీపంలో శుక్రవారం సాయంత్రం వరద బీభత్సం సృష్టించింది. ఈ విషాదంలో 15 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 35 నుంచి 40 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.
రాజాసింగ్ వీడియో
ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇలాంటి వర్షం, వరద తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు రాజాసింగ్. ప్రమాద స్థలం నుంచి వీడియో విడుదల చేసిన ఆయన... ప్రమాదంలో తాను ఎలా బయటపడింది... అక్కడ ఏం జరిగిందో సవివరంగా తెలిపారు.
రక్షించింది వారి దీవెనలే
గోషామహల్, తెలంగాణా ప్రజల ఆశీర్వాదం వల్ల తాను క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాను అన్నారు రాజాసింగ్. తన జీవితం లో ఇలాంటి దారుణం చూడలేదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాము ఉన్న టెంట్లు, భోజనం చేసిన ప్లేస్ సర్వనాశనమైందని తెలిపారు. గుడికి సమీపంలో టెంట్ల క్రింద వందల మంది ఉన్నట్టు వివరించారు.
మిలటరీకి సెల్యూట్
మిలటరీ అప్రమత్తంగా ఉండటం వల్లే చాలా వరకు ప్రాణ నష్టం తగ్గిందన్నారు రాజా సింగ్. లేకుంటే భారీ విపత్తు జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. చాపర్లు, రోడ్లు, నడక మార్గం ద్వారా దైవ దర్మనానికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వరద తన జీవితంలో ఇంత వరకు చూడలేదన్నారు. తనను ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు రాజాసింగ్.
ముమ్మరంగా సహాయక చర్యలు
సహాయక చర్యలు శనివారం ఉదయం సైతం కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 15000 మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రెస్క్యూ టీమ్ తెలిపింది. అవసరమైన చోట హెలికాప్టర్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, ముందుగా లోతట్టు ప్రాంతాల వారిని తరలిస్తున్నట్లు ఐటీబీపీ అధికారులు తెలిపారు.
మరోసారి నిలిచిన యాత్ర
వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు బుధవారం తిరిగి ప్రారంభించారు. కానీ రెండు రోజుల వ్యవధిలో మరోసారి వరద బీభత్సం చేసి అపార ప్రాణ నష్టం కలిగించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహయ చర్యలు కొనసాగిస్తున్నాయి. వరద నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు యాత్రను నిలిపివేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
బస్సే అంబులెన్స్ అయింది, అందుకే వారికి అవార్డు వచ్చింది!
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!