అన్వేషించండి

Asaduddin Owaisi: పాతబస్తీలో అసదుద్దీన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి అలా చేస్తే తీవ్ర పరిణామాలని హెచ్చరిక

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అసదుద్దీన్ ఒవైసీ మళ్లీ ఆ పని చేశారు. యూపీ ఎన్నికల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆయన ఆ క్రమంలో మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు.

పాతబస్తీలోని రౌడీలకు అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ప్రజలను వేధిస్తే ఊరుకోనంటూ హెచ్చరించారు. పాతబస్తీలో రౌడీయిజం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాంటి వారు పాత బస్తీ వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి రౌడీ గ్యాంగ్‌లను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్ పాత బస్తీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఏపీకి వర్ష సూచన, కొన్ని చోట్ల భారీ వానలకు ఛాన్స్.. తెలంగాణలో ఇలా..

ఉత్తర్ ప్రదేశ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అసదుద్దీన్ ఒవైసీ మళ్లీ ఆ పని చేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆయన ఆ క్రమంలో మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. మత రాజకీయాలు లక్ష్యంగా తరచూ వ్యాఖ్యలు చేసే ఒవైసీ, హైదరాబాద్‌లోని చార్మినార్‌ కట్టడాన్ని తన తండ్రితో పోల్చారు. అది మా తండ్రి భవనం అని, ఇక్కడ తమతో కలిసి బీజేపీని తరిమికొట్టడానికి ప్రయత్నిద్దామని యూపీలో పిలుపునిచ్చారు. భారతదేశంలో ముస్లింల పరిస్థితి రోజురోజుకు బ్యాండ్ ప్లేయర్స్ లాగా మారిందని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రధాని మోదీ ఎన్నికల సమయం వరకూ ముస్లింను కలిపి ఉంచుకుంటారని.. ఆ తర్వాత వేరు చేసేస్తారని వ్యాఖ్యలు చేశారు..

Also Read: Hyderabad Fraud: ఆ ఫోటోకు టెంప్ట్ అయిన గుంటూరు యువకుడు.. రూ.1.20 కోట్లు హుష్‌కాకీ.. బాధితుడు లబోదిబో..

మోదీ, యోగిని టార్గెట్ చేసిన ఒవైసీ
యూపీ ఎన్నికలు లక్ష్యంగా ఒవైసీ ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తన ఇలాకాలో బీజేపీని ఓడించడంలో తనకు సహాయం చేసిన హైదరాబాద్ ప్రజలకు లక్షల వందనాలు అని ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ప్రధాని మోదీ స్వయంగా వచ్చారని, ముఖ్యమంత్రి యోగి కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చారని ఒవైసీ చెప్పారు. 5 నెలల తర్వాత జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు ముస్లింలు తామ నాయకుడిగా మారాలా లేదా ఓటరుగా మారాలా అనేది నిర్ణయించుకోవాలని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ముస్లిం సామాజికవర్గ జనాభా ఏ విధంగానూ తక్కువ కాదని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత ముస్లింలను పట్టించుకోకపోవడం వల్ల వారికి ప్రాతినిథ్యం లేకుండా పోతోందని, అందుకే ముస్లింల దుస్థితి దారుణంగా మారిందని వ్యాఖ్యలు చేశారు.

Also Read: Smart Phone eVoting: స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ-ఓటింగ్‌.. దేశంలో మొదటిసారిగా తెలంగాణ నుంచే అమలు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Virat Kohli:విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Embed widget