అన్వేషించండి

Asaduddin Owaisi: పాతబస్తీలో అసదుద్దీన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి అలా చేస్తే తీవ్ర పరిణామాలని హెచ్చరిక

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అసదుద్దీన్ ఒవైసీ మళ్లీ ఆ పని చేశారు. యూపీ ఎన్నికల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆయన ఆ క్రమంలో మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు.

పాతబస్తీలోని రౌడీలకు అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ప్రజలను వేధిస్తే ఊరుకోనంటూ హెచ్చరించారు. పాతబస్తీలో రౌడీయిజం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాంటి వారు పాత బస్తీ వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి రౌడీ గ్యాంగ్‌లను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్ పాత బస్తీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఏపీకి వర్ష సూచన, కొన్ని చోట్ల భారీ వానలకు ఛాన్స్.. తెలంగాణలో ఇలా..

ఉత్తర్ ప్రదేశ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అసదుద్దీన్ ఒవైసీ మళ్లీ ఆ పని చేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆయన ఆ క్రమంలో మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. మత రాజకీయాలు లక్ష్యంగా తరచూ వ్యాఖ్యలు చేసే ఒవైసీ, హైదరాబాద్‌లోని చార్మినార్‌ కట్టడాన్ని తన తండ్రితో పోల్చారు. అది మా తండ్రి భవనం అని, ఇక్కడ తమతో కలిసి బీజేపీని తరిమికొట్టడానికి ప్రయత్నిద్దామని యూపీలో పిలుపునిచ్చారు. భారతదేశంలో ముస్లింల పరిస్థితి రోజురోజుకు బ్యాండ్ ప్లేయర్స్ లాగా మారిందని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రధాని మోదీ ఎన్నికల సమయం వరకూ ముస్లింను కలిపి ఉంచుకుంటారని.. ఆ తర్వాత వేరు చేసేస్తారని వ్యాఖ్యలు చేశారు..

Also Read: Hyderabad Fraud: ఆ ఫోటోకు టెంప్ట్ అయిన గుంటూరు యువకుడు.. రూ.1.20 కోట్లు హుష్‌కాకీ.. బాధితుడు లబోదిబో..

మోదీ, యోగిని టార్గెట్ చేసిన ఒవైసీ
యూపీ ఎన్నికలు లక్ష్యంగా ఒవైసీ ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తన ఇలాకాలో బీజేపీని ఓడించడంలో తనకు సహాయం చేసిన హైదరాబాద్ ప్రజలకు లక్షల వందనాలు అని ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ప్రధాని మోదీ స్వయంగా వచ్చారని, ముఖ్యమంత్రి యోగి కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చారని ఒవైసీ చెప్పారు. 5 నెలల తర్వాత జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు ముస్లింలు తామ నాయకుడిగా మారాలా లేదా ఓటరుగా మారాలా అనేది నిర్ణయించుకోవాలని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ముస్లిం సామాజికవర్గ జనాభా ఏ విధంగానూ తక్కువ కాదని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత ముస్లింలను పట్టించుకోకపోవడం వల్ల వారికి ప్రాతినిథ్యం లేకుండా పోతోందని, అందుకే ముస్లింల దుస్థితి దారుణంగా మారిందని వ్యాఖ్యలు చేశారు.

Also Read: Smart Phone eVoting: స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ-ఓటింగ్‌.. దేశంలో మొదటిసారిగా తెలంగాణ నుంచే అమలు..

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget