అన్వేషించండి

Telangana Liberation Day: ఒవైసీలంటే భయం లేదా! తెలంగాణ విమోచనా దినోత్సవం నిర్వహించండి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Telangana to Celebrate Sept 17 as Praja Palana Day| కాంగ్రెస్ నేతలకు ఒవైసీ బ్రదర్స్ అంటే భయమని బీజేపీ ఆరోపిస్తోంది. ఏ భయం లేకపోతే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Telangana Praja Palana Day | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఓ విషయంపై ఎప్పుడూ వివాదం నెలకొంటుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒవైసీ బ్రదర్స్, ముస్లింలతో అవసరాలు, ఓటు బ్యాంకు కోసమే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించలేదని గతంలో బీఆర్ఎస్ పై, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ 
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలకు భయపడే విమోచనా దినోత్సవం నిర్వహించడం లేదా అని తన లేఖ ద్వారా ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒవైసీ బ్రదర్స్‌కు భయపడే నిర్వహించలేదు అని, అందుకే బీఆర్ఎస్ హయాంలో సమైక్యత దినోత్సవంగా నిర్వహించారని మహేశ్వర్ రెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. విమోచనా దినోత్సవానికి బదులుగా ప్రజాపాలన దినోత్సవం అంటోందన్నారు. ఏ విధంగా చూసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కో పేరుతో తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను విస్మరిస్తున్నాయని విమర్శించారు.

మరో రెండు రోజులు ఉందని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. గతంలో హైదరాబాద్ రాజ్యంలో రాజకార్ల అరాచక పాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన అమరుల త్యాగాలను గుర్తించాలన్నారు. అందుకు సెప్టెంబర్ 17వ తేదీన ప్రజా పాలన దినోత్సవం అని కాకుండా, తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని సూచించారు. ఇలా చేయకపోతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హితవు పలికారు.

ఓవైపు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంటే... తెలంగాణ ప్రభుత్వం విమోచనా దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ మాత్రం ఈసారి కూడా తెలంగాణ విమోచనా దినోత్సవ వేడుకల్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ స్టేట్ నుంచి నుంచి విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటకలో కలిసిన జిల్లాలోనూ... సెప్టెంబర్ 17న విమోచనా దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఎంఐఎం, ఒవైసీ బ్రదర్స్ కు భయపడి తెలంగాణలో ప్రభుత్వాలు విమోచనా దినోత్సవంగా జరపడం లేదు అని ఆరోపించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Embed widget