By: ABP Desam | Updated at : 19 Dec 2022 09:47 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కుమారుడితో వైఎస్ షర్మిల
YS Sharmila : ఎప్పుడూ సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. అయితే తాజాగా ఆమె ట్విట్టర్ లో ఓ ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటో వైరల్ అవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైయస్ షర్మిల అధికార పార్టీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. 3500 కిలో మీటర్లకు పైగా తెలంగాణలో పాదయాత్ర చేసిన ఆమె ఇటీవల పలు ఘటనలతో మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్ గా మారారు. షర్మిల పదునైన విమర్శలతో బీఆర్ఎస్ నేతలను ఇరకాటంలో పెడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు ఆమె పాదయాత్రను అడ్డుకున్నారు. ప్రచార రథానికి నిప్పుపెట్టారు. అనంతరం పోలీసులు శాంతి భద్రతలు కారణంగా ఆమెను హైదరాబాద్ తరలించారు. ఇందుకు నిరసనగా ఆమె కారులో ప్రగతి భవన్ ను ముట్టడించడానికి బయలుదేరగా... పోలీసులు కారుతో సహా ఆమెను స్టేషన్ కు తరలించారు. ఆమె అరెస్టు చేసి రిమాండ్ కూడా కోరారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన ఆమె పాదయాత్ర అనుమతికోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇలా నిత్యం వార్తల్లో ఆమె తాజాగా ఓ ఫొటో షేర్ చేశారు.
Happy Birthday Raja,
— YS Sharmila (@realyssharmila) December 18, 2022
Happiness always!
I love you forever!! pic.twitter.com/idI0TGM9cN
హ్యాపీ బర్త్ డే రాజా
ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క కుటుంబాన్ని చూసుకుంటున్న షర్మిల... తన కుమారుడు రాజారెడ్డి పుట్టినరోజున ఆయనకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. షర్మిల కొడుకుతో దిగిన అరుదైన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ కొడుకుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే రాజా.. హ్యాపీనెస్ ఆల్వేస్...ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాననే క్యాప్షన్ పెట్టి కొడుకుపై షర్మిల ప్రేమను చాటుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏదో వెకేషన్ లో దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలో చదువుతున్నారు. అంతేకాదు రాజారెడ్డి బాక్సింగ్ వంటి క్రీడల్లో ఛాంపియన్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. షేర్ చేసిన ఫొటోలో షర్మిల కాస్త మోడ్రన్ లుక్ లో కనిపించడంతో ఫొటో వైరల్ అయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా వైఎస్ షర్మిల విమర్శలు చేస్తుంటారు. తాజాగా మిషన్ భగీరథపై ట్వీట్ చేశారు.
పండుగ లేదు.. పబ్బం లేదు.. ప్రతి రోజు పనిచేస్తూ.. కాంట్రాక్టర్ల వేధింపులకు గురవుతూ.. గ్రామీణ జనానికి నీళ్లు అందిస్తున్న 15 వేల మంది మిషన్ భగీరథ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా.. కనీస వేతనాలు లేకుండా.. చట్టబద్ధ హక్కులను కాలరాస్తూ.. కడుపు కొడుతున్నారు..
— YS Sharmila (@realyssharmila) December 19, 2022
1/3
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
TSPSC Leaks What Next : ఓ వైపు లిక్కర్ కేసు - మరో వైపు పేపర్ లీకేజీ దుామరం ! కేసీఆర్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నారు ?
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన వర్షాలు, మళ్లీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా