అన్వేషించండి

Revanth Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగలు, మోదీ పెంచిన జీడీపీ ఇదే - గ్యాస్(G), డీజీల్(D), పెట్రోల్(P) : రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగల్లా మారి ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ పెంచిన జీడీపీ గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలు అని విమర్శించారు.

Revanth Reddy :  గ్యాస్, పెట్రోల్ ధరలు(Petrol Rates) పెంచిందని కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం(TRS Govt) తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు(Power Charges) ఎందుకు పెంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పెట్రోల్ ధర పెంచితే, రాష్ట్రం విద్యుత్ ఛార్జీలు పెంచుతుందన్నారు. ఒకరి తప్పు ఇంకొకరు కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నిమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని, ప్రభుత్వాలే జేబుదొంగల్లా మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారన్నారు. తెలంగాణ రైతుల సమస్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగలు 

కరోనాతో కుదేలైన పేదలకు సాయం చేయడం మానేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగల్లా మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు విపరీతంగా పెంచుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచేశారని, ఒకరి తప్పు ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచడంతో 5 వేల కోట్లు, సర్ ఛార్జ్(Sur Charge) పేరుతో రూ.6 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఛార్జీలు పెంచొద్దని ఈఆర్సీ ముందు తన వాదన వినిపించినా పట్టించుకోలేదన్నారు. విద్యుత్ సంస్థలు ఆర్థికంగా దెబ్బతినడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమే కారణమని ఆరోపించారు. ఉచిత విద్యుత్ అంటూ సామాన్యుడిపై విద్యుత్ భారం మోపుతున్నారని ఆక్షేపించారు. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకపోవడంతో రూ.12,500 కోట్లు బకాయిపడ్డాయని తెలిపారు. 

మార్చి 31న సిలెండర్లకు దండలు, డప్పు చాటింపులు 

ఐదు రాష్ట్రాల ఎన్నికల అయ్యేవరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని, ఎన్నికలు అయిపోగానే  గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను కేంద్రం పెంచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీడీపీ(GDP) పెంచుతామన్న ప్రధాని మోదీ గ్యాస్(Gas), డీజిల్(Diesel), పెట్రోల్(Petrol) ధరలు పెంచారని విమర్శించారు. కేసీఆర్ విద్యుత్ ఛార్జీలు, మోదీ గ్యాస్ ధరలు పోటా పోటీగా పెంచుతున్నారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ప్రజల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. పెంచిన సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మార్చి 31న సిలిండర్లకు దండలు వేసి, డప్పు చాటింపు వేస్తామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ మండల కేంద్రంలో ఏఈ, డీఈ కార్యాలయాల ముందు ఆందోళనలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.  ఏప్రిల్ 4న మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు. ఏప్రిల్ 7న హైదరాబాద్(Hyderabad) లో విద్యుత్ సౌధ ముట్టడి చేపడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్, మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను చంపుతున్నారని ఆరోపించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget