అన్వేషించండి

Revanth Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగలు, మోదీ పెంచిన జీడీపీ ఇదే - గ్యాస్(G), డీజీల్(D), పెట్రోల్(P) : రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగల్లా మారి ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ పెంచిన జీడీపీ గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలు అని విమర్శించారు.

Revanth Reddy :  గ్యాస్, పెట్రోల్ ధరలు(Petrol Rates) పెంచిందని కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం(TRS Govt) తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు(Power Charges) ఎందుకు పెంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పెట్రోల్ ధర పెంచితే, రాష్ట్రం విద్యుత్ ఛార్జీలు పెంచుతుందన్నారు. ఒకరి తప్పు ఇంకొకరు కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నిమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని, ప్రభుత్వాలే జేబుదొంగల్లా మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారన్నారు. తెలంగాణ రైతుల సమస్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగలు 

కరోనాతో కుదేలైన పేదలకు సాయం చేయడం మానేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగల్లా మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు విపరీతంగా పెంచుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచేశారని, ఒకరి తప్పు ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచడంతో 5 వేల కోట్లు, సర్ ఛార్జ్(Sur Charge) పేరుతో రూ.6 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఛార్జీలు పెంచొద్దని ఈఆర్సీ ముందు తన వాదన వినిపించినా పట్టించుకోలేదన్నారు. విద్యుత్ సంస్థలు ఆర్థికంగా దెబ్బతినడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమే కారణమని ఆరోపించారు. ఉచిత విద్యుత్ అంటూ సామాన్యుడిపై విద్యుత్ భారం మోపుతున్నారని ఆక్షేపించారు. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకపోవడంతో రూ.12,500 కోట్లు బకాయిపడ్డాయని తెలిపారు. 

మార్చి 31న సిలెండర్లకు దండలు, డప్పు చాటింపులు 

ఐదు రాష్ట్రాల ఎన్నికల అయ్యేవరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని, ఎన్నికలు అయిపోగానే  గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను కేంద్రం పెంచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీడీపీ(GDP) పెంచుతామన్న ప్రధాని మోదీ గ్యాస్(Gas), డీజిల్(Diesel), పెట్రోల్(Petrol) ధరలు పెంచారని విమర్శించారు. కేసీఆర్ విద్యుత్ ఛార్జీలు, మోదీ గ్యాస్ ధరలు పోటా పోటీగా పెంచుతున్నారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ప్రజల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. పెంచిన సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మార్చి 31న సిలిండర్లకు దండలు వేసి, డప్పు చాటింపు వేస్తామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ మండల కేంద్రంలో ఏఈ, డీఈ కార్యాలయాల ముందు ఆందోళనలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.  ఏప్రిల్ 4న మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు. ఏప్రిల్ 7న హైదరాబాద్(Hyderabad) లో విద్యుత్ సౌధ ముట్టడి చేపడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్, మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను చంపుతున్నారని ఆరోపించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్.. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్.. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Dry ginger vs Fresh ginger: అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
Embed widget