అన్వేషించండి

Revanth Reddy : పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే చర్యలు తప్పవు, రేవంత్ రెడ్డి వార్నింగ్

Revanth Reddy : ఫిబ్రవరి 6 నుంచి 60 రోజుల తెలంగాణలో హాత్ సే జోడో యాత్ర చేపడుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.

Revanth Reddy : హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంపై  చర్చించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం నాంపల్లి గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ 3500 కి.మీ 150 రోజులుగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జోడో యాత్ర సాగిస్తున్నారన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు 150 కోట్ల దేశం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలు పెట్టారన్నారు. భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర చేపడుతున్నామన్నారు. నాగర్ కర్నూల్ లో ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన నాగంపై బీఆరెస్ నేతల దాడిపై కూడా సమావేశంలో చర్చించామన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కాకుండా బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని మండిపడ్డారు. మహిళను అవమానించారని నాగం జనార్దన్ రెడ్డిపై కూడా కేసు పెట్టారని ఆరోపించారు. నాగం వల్ల ఎలాంటి అవమానం జరగలేదని డీఐజీ దగ్గర మహిళా సర్పంచ్ స్టేట్ మెంట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. అయినా ప్రభుత్వం తన తప్పు దిద్దుకోలేదన్నారు. అందుకే ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నాగర్ కర్నూల్ లో ఆదివారం దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో పాటు ముఖ్య నాయకులంతా హాజరవుతారని వెల్లడించారు. భద్రతా కారణాల చూపి జనవరి 26న కశ్మీర్ లో రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరేయకుండా బీజేపీ కుట్ర చేసిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ లో జెండా ఎగరేసి తీరాల్సిందేనని రాహుల్ నిర్ణయం తీసుకున్నారని, ఈ నెల 30న కశ్మీర్ లో  రాహుల్ జాతీయ జెండా ఎగరవేస్తారన్నారు. తెలంగాణ ముఖ్య నాయకులంతా భారత్ జోడో యాత్ర ముగింపు సభకు బయలుదేరి వెళతామన్నారు. అందుకే హాత్ సే హాత్ జోడో యాత్రను కొద్దిరోజులు వాయిదా వేసుకున్నామని తెలిపారు. 

పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దు 

ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు ఏకధాటిగా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 6న హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకా గాంధీని ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని తీర్మానించామన్నారు. ఫిబ్రవరి 6 లోగా కొత్త డీసీసీలు బాధ్యతలు తీసుకుంటారన్నారు. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బాధ్యతగా పనిచేయనివారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చు కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఉండకూడదని ఠాక్రే సూచించారని తెలిపారు. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.  

ఫిబ్రవరి 6 నుంచి  హాత్ సే జోడో యాత్ర 

తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి  హాత్ సే జోడో యాత్ర ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.  ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే పాదయాత్ర 60 రోజులపాటు సాగుతుందన్నారు. భద్రాచలం లేదా మహబూబ్ నగర్ లేదా ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర చేపడుతున్నామని వెల్లడించారు. వాస్తవానికి జనవరి 26 కశ్మీర్ లో రాహుల్ గాంధీ యాత్ర ముగిసే రోజు తెలంగాణలో యాత్ర మొదలు పెట్టాలనుకున్నామని, కానీ భద్రతా కారణాల చూపి జనవరి 26న కశ్మీర్ లో రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరేయకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ సమావేశాలు, ఫిబ్రవరి 5న రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉండడంతో...  హాత్ సే హాత్ జోడో యాత్రను ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ యాత్రలో హాత్ సే హాత్ సే జోడో యాత్ర స్టిక్కర్, రాహుల్ గాంధీ గారి లేఖ, మోదీ, కేసీఆర్ వైఫల్యాలపై చార్జీషీటు వంటి కార్యక్రమాలనకు ఏఐసీసీ కార్యక్రమాలు అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. బాధ్యతగా పని చేయని వారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఈ యాత్రలో పాల్గొనని వారిపై కూడా చర్యలుంటాయని హెచ్చరించారు. పార్టీ శ్రేయస్సు కోసం ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చు కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఉండకూడదని ఠాక్రే సూచించారని తెలిపారు.  ఫిబ్రవరి 6 లోగా కొత్త డీసీసీ లు బాధ్యతలు తీసుకుంటారని రేవంత్ రెడ్డి తెలిపారు.  

నేను ఎవరికీ అనుకూలం కాదు 

"నేను ఎవరికీ అనుకూలం కాదు వ్యతిరేకం కాదు. అలాంటి ఆలోచన పక్కన పెట్టండి. అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి. ఎముకలు కోరికే చలిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. యాత్ర లక్ష్యాలను ఇంటింటికీ తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉంది. హాథ్ సే హాథ్ జోడో యాత్ర తో రాహుల్ సందేశాన్ని గడప గడపకు తీసుకు వెళ్లండి. నేతలంతా ఐక్యంగా హాథ్ సే హాథ్ జోదో యాత్ర చేయండి. రేవంత్ రెడ్డి 50 నియోజక వర్గాలకు తగ్గకుండా  యాత్ర చేస్తారు. మిగిలిన సీనియర్లు కూడా  20, 30 నియోజక వర్గాల్లో యాత్ర చేయండి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హాథ్ సే హాథ్ ను ప్రతి ఒక్కరూ సక్సస్ చేయాలి. అంతా ఐక్యంగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం, అధికారంలోకి రావడం ఖాయం. సమస్యలు ఉంటే నాతో చెప్పండి. నాకు ఫోన్ చేయండి. ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దు."- మాణిక్ రావు థాక్రే, టీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court Zone-II: జీవితంలో ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశం.. హైకోర్టు జోన్-II బిల్డింగ్ పనులకు శంకుస్థాపనలో రేవంత్ రెడ్డి
జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం, అరుదైన గౌరవం.. హైకోర్టు జోన్-II బిల్డింగ్ పనులకు శంకుస్థాపనలో రేవంత్ రెడ్డి
Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Hyderabad Drugs Party: హైదరాబాద్‌లోని రిసార్టులో డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీం దాడులు.. టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్ 
హైదరాబాద్‌లోని రిసార్టులో డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీం దాడులు.. టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SRH vs LSG: సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
Iran-US War: అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
Rayavalasa: అమ్మ దర్శకత్వంలో కొడుకు... 'రాయవలస' లుక్ చూశారా? జానర్ ఏమిటంటే?
అమ్మ దర్శకత్వంలో కొడుకు... 'రాయవలస' లుక్ చూశారా? జానర్ ఏమిటంటే?
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
Cucumber Water : వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
Who is Ashok Sharma: ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
Embed widget