అన్వేషించండి

MP Vijayasai Reddy : నేటి మధ్యాహ్నం 3 గంటల తర్వాత తారకరత్న అంత్యక్రియలు - ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy : తారకరత్న మరణం తనను ఎంతో బాధించిందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

MP Vijayasai Reddy :  చిన్న వయసులో తారకరత్న మృతి చెందటం చాలా బాధాకరం అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.  హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న స్థాయి పై స్థాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరించే వ్యక్తి తారకరత్న అన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశం చేద్దాం అనుకునే లోపు ఇలాంటి ఘటన జరగటం నన్ను చాలా బాధించిందన్నారు. ప్రతి ఒక్కరిని బంధుత్వంతో పిలిచే వ్యక్తి తారకరత్న అని గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరి మనసులో ఆయన  చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తారకరత్నకు ముగ్గురు పిల్లలు మొదట ఒక పాప ఆ తర్వాత ఇద్దరు కవల పిల్లలు, కవలల్లో ఒక బాబు ఒక పాప ఉన్నారన్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కూడా  తిరిగి వస్తారని ప్రతి ఒక్కరూ భావించారన్నారు. 

నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు

నేటి (సోమవారం) ఉదయం 9 గంటల మూడు నిమిషాలకి శంకరపల్లిలోని నివాసం నుంచి ఫిలిం ఛాంబర్ కు తారకరత్న పార్థివదేహాన్ని తరలిస్తామని తెలిపారు. ఉదయం 10 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ వద్ద అభిమానుల సందర్శనార్థం ఉంచుతామన్నారు. బాలకృష్ణ పెట్టిన ముహూర్తం ఆధారంగా రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేస్తామని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. తారకరత్న భార్య అలేఖ్య కొంత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, కాళ్లు చేతులు వణుకుతున్నాయని తెలిపారు. తాను అత్యంతగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన బాధ ఆమె భరించలేకపోతున్నారన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. 

బాలకృష్ణకు ధన్యవాదాలు

"తారకరత్న మరణం కుటుంబ సభ్యులు, అభిమానులను ఎంతో బాధించింది. 39 ఏళ్లకే ఆయనకు ఇలా జరగడం దురదృష్టకరం. సినిమా రంగంలో ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉన్నారు. ప్రతి ఒక్కరినీ కూడా వరసలతో పిలిచే నైజం ఆయనది. తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పటి నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. వైద్యులతో మాట్లాడి చికిత్సలో ఎటువంటి జాప్యం లేకుండా బాలకృష్ణ ప్రయత్నం చేశారు. అందుకు బాలకృష్ణకు ధన్యవాదాలు."- ఎంపీ విజయసాయి రెడ్డి 

ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు- చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శంకర్ పల్లి సమీపంలోని నందమూరి తారకరత్న ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. తర్వాత తారకరత్న చిత్ర పటానికి పూలు సమర్పించి, నమస్కరించారు. తారకరత్న భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పరామర్శించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును పలకరించారు. కాసేపు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. విజయసాయి రెడ్డి తరచూ చంద్రబాబు లక్ష్యంగా పరుష పదజాలంతో ట్విటర్ వేదికగా ట్వీట్లు చేసే సంగతి సంగతి తెలిసిందే. అనంతరం విజయసాయి రెడ్డితో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఒక మంచి భవిష్యత్‌ ఉన్న వ్యక్తిని కోల్పోయామని చంద్రబాబు ఆవేదన చెందారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని కూడా తనతో చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ అవకాశం కూడా ఇద్దామనుకున్నామని, దీనిపై సమయం వచ్చినపుడు మాట్లాడతానని తనతో చెప్పినట్లుగా గుర్తు చేసుకున్నారు. ఈ లోపే తారకరత్న చనిపోవడం బాధాకరమని అన్నారు. 

‘‘ఈనెల 22వ తేదీకి తారకరత్నకు 40 సంవత్సరాలు నిండుతాయి. ఒక మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిని కోల్పోయాం. సినిమా రంగంలో ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభోత్సవం చేసిన రికార్డు ఆయనది. అమరావతి అనే సినిమాలో నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న వయసులో తారకరత్న చనిపోవడం బాధేస్తోంది. కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకుండా పోయింది. చిన్న వయసులో ఏ ఆశయాల కోసం తారకరత్న పని చేశారో వాటిని ముందుకు తీసుకెళ్లేలా అభిమానులు పని చేయాలని అనుకుంటున్నా. తారకరత్నకు ముగ్గురు పిల్లలు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన వారిని చూస్తే చాలా బాధగా ఉంది. భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. మేం వారికి ఎప్పుడూ అండగానే ఉంటాం. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డితో కలిసి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget