అన్వేషించండి

Telangana Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం - ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Telangana News: తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజులు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

IMD Red Alert To Telangana Districts: ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాన్ని అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ వాయుగుండం ఒడిశా పూరీకి ఆగ్నేయంగా 70 కి.మీలు, ఏపీలోని కళింగపట్నం తూర్పు ఈశాన్యానికి 240 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది శనివారం ఉదయానికి వాయువ్య దిశగా పయనించి.. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.  ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ - వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని.. దీని ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

వాయుగుండం ప్రభావంతో ఈశాన్య, తూర్పు జిల్లాలైన కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, వరంగల్, ఖమ్మం, హన్మకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అటు, శనివారం ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవొచ్చన్నారు. అలాగే, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఏపీలోనూ భారీ వర్షాలు

మరోవైపు, ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.8 అడుగులకు చేరుకుంది. ఉమ్మడి తూ.గో జిల్లాలో దాదాపు 7 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉమ్మడి విశాఖ, కోనసీమ, అల్లూరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని మన్యం గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. అటు, పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది. అటు, వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ముందస్తు ప్రణాళికతో పని చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. గతంలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో గోదావరి కట్టలు బలహీనపడ్డాయని.. వాటి దృష్టి సారించాలని సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించవచ్చని పేర్కొన్నారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: నాదర్‌గుల్ భూములు బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్ట్రేషన్ - బీఆర్ఎస్ ఆరోపణలకు పొంగులేటి కౌంటర్
నాదర్‌గుల్ భూములు బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్ట్రేషన్ - బీఆర్ఎస్ ఆరోపణలకు పొంగులేటి కౌంటర్
Viral News: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Asia War Effect on Mango Exports: పశ్చిమాసియా యుద్దంతో మామిడి ఎగుమతిదారులకు కష్టం!కంటైనర్ల కొరతతో భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు!
పశ్చిమాసియా యుద్దంతో మామిడి ఎగుమతిదారులకు కష్టం!కంటైనర్ల కొరతతో భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు!
Constable Revathi: కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
Embed widget