అన్వేషించండి

Revanth Reddy : శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులే రెచ్చగొట్టారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : రాష్ట్రపతి ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు బీజేపీ డ్రామాలు ఆడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసేసిన కేసుల్ని ఓపెన్ చేసి రాహుల్, సోనియా గాంధీలను వేధిస్తున్నారన్నారు.

 Revanth Reddy : ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు పెడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. బొల్లారం పీఎస్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన...  ప్రాంతీయ పార్టీలను బెదిరించడానికే కాంగ్రెస్ అగ్రనాయకులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.  రాజ్ భవన్ ముట్టడిలో అరెస్ట్ అయిన నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో పైచేయి కోసమే బీజేపీ డ్రామాలు అని ఆరోపించారు.  మూసేసిన కేసుల్ని ఓపెన్ చేసి రాహుల్, సోనియా గాంధీలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. గత మూడు రోజులుగా చేసిన నిరసనల్లో చిన్న ఘటనలు కూడా జరగలేదన్నారు.  తాను పీసీసీ హోదాలో చాలా ప్రోగ్రామ్స్ చేశానని ఒక్క చిన్న ఘటన కూడా జరగలేదన్నారు. గాంధీ సిద్ధాంతంలోనే నిరసనలు, ఆందోళనలు చేశామన్నారు.  

పోలీసులే రెచ్చగొట్టారు 

రాజ్ భవన్ ముందు శాంతి యుతంలో నిరసన తెలపాలని చూశాం. మా నాయకులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు రెచ్చగొట్టారు. లాఠీఛార్జ్ చేశారు. రేణుకా చౌదరిలను మగ పోలీసులు హ్యాండిల్ చేయడం వల్ల ఆమె ఆగ్రహానికి గురయ్యారు. మా నేతలకు, శ్రేణులకు పోలీసుల తోపులాటలో గాయాలయ్యాయి. గిట్లనే తెలంగాణ ఉద్యమంలో పోలీసులు వ్యవహరించి ఉంటే రాష్ట్రం వచ్చేదా.
టీఆర్ఎస్ వాళ్లు బీజేపీ అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకోండి. మాకు ఇబ్బంది లేదు. కానీ మా జోలికి వస్తే సహించేది లేదు. మా నేతలపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయండి. రేపు జిల్లా కేంద్రాలలో కేంద్ర రంగ సంస్థల ముందు నిరసన తెలపండి. మోదీ దిష్టి బొమ్మ తగలబెట్టండి.- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు 

ఒక్క కలం పోటుతో కొట్టివేస్తాం 

జిల్లాలోని రైల్వే స్టేషన్లు, టెలికామ్, ఎల్ఐసీ, పోస్టల్ డిపార్ట్ మెంట్ ల ముందు నిరసన తెలపాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చట్టపరంగా అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ శ్రేణులపై పెట్టిన కేసులు ఒక్క కలం పోటుతో కొట్టివేస్తామన్నారు. వెంటనే సోనియా, రాహుల్ లకు ఇచ్చిన ఈడీ నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై సర్కార్ విచారణ చేపట్టాలన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లకు ప్రగతి భవన్ లో స్వాగతం ఉంటుందన్నారు. నేరగాళ్లను రేపిస్ట్ లను అవినీతి పరులను కేసీఆర్ ఒక్కమాట అనరని ఆరోపించారు. 

టాప్ హెడ్ లైన్స్

SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget