అన్వేషించండి

Kishan Reddy : అనాథపిల్లలకు ప్రధాన మంత్రే గార్డియన్, రేపు పీఎం కేర్స్ చిల్డ్రన్ పథకం ప్రారంభం- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy On PM Cares : కరోనా కారణంగా అనాథలైన పిల్లలను దత్తత తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వారికి ప్రధాని గార్డియన్ గా ఉంటారన్నారు. 23 ఏళ్లు వచ్చేవరకూ వారి బాధ్యత భారత ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు.

Kishan Reddy On PM Cares : దేశంలో అనాథ పిల్లలకు ప్రధాని గార్డియన్ గా ఉంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సోమవారం పీఎం కేర్స్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కారణంగా తల్లిందండుర్లును కోల్పోయిన పిల్లలకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. 23 ఏళ్లు వచ్చేవరకూ వారి బాధ్యత భారత ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించారు. 4345 మంది పిల్లలను ప్రధాని దత్తత తీసుకోనున్నారని తెలిపారు. అనాథ పిల్లల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.  18 ఏళ్లు లోపు వారందరికీ పది లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 23 ఏళ్లు వచ్చేవరకూ ప్రతీ నెలా స్టేఫండ్ ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

పిల్లల దత్తత 

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ లో దత్తత తీసుకుంటున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి ఎన్‌పీఆర్ కన్వెన్షన్‌లో బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ 8 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పేదలకు చేరువయ్యాయన్నారు. 15 రోజులపాటు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

పాతబస్తీలో దౌర్జన్యం 

కరోనా మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లలను దత్తత తీసుకోవడం, కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడతలో రూ. 20 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేయడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు కిషన్ రెడ్డి సూచించారు. పాతబస్తీలో ఉన్న హిందువుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడంతో హిందువులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ మత కల్లోలాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా బలగాలను పక్కన పెడితే హిందువులను ఊచకోత కోస్తామని కామెంట్స్ చేసిన అసదుద్దీన్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం అన్నారు. ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
Nirmal Udumpur Tribals Non Cooperation Movement : నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget