అన్వేషించండి

Kishan Reddy: మోదీ ప్రభుత్వ ఏడేళ్ల పాలనపై చర్చకు సిద్ధం, సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్

కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు మాత్రమేనని శత్రువులు కారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు

సీఎం కేసీఆర్(CM KCR) పాకిస్తాన్ కన్నా దిగజారి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎవరు శత్రువులు లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ(Bjp)కి శత్రువులు కేవలం పాకిస్తాన్ మాత్రమేమనన్నారు. రాజకీయ పార్టీలు(Political Parties) శత్రువులు కారని, కేవలం ప్రత్యర్థులు మాత్రమే అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్(Surgical Strikes) జరిగాయని పాకిస్తాన్ నే చెప్పిందని, వీడియోలు కూడా బయటకు వచ్చాయన్నారు. సైనికులను అవమానపరిచే విధంగా సీఎం కేసీఆర్ మాటలు ఉన్నాయన్నారు. సైనికుల(Jawans) ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీసేవిధంగా కేసీఆర్ మాట్లాడారన్నారు. 

సీఎం కేసీఆర్ తీరును తెలంగాణ ప్రజలు, మేధావులు అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ తీరు మారిందన్నారు. తెలంగాణ ప్రజలను బానిసలు చూస్తూ తనకు జీహుజూర్‌ అనాలని కేసీఆర్‌ భావిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి(TRS Govt) వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించలేకపోతున్నారని ఆరోపించారు. నాంపల్లి(Nampalli)లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ప్రశ్నించేవారు ఉండకూడదని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. 

 సీఎం కేసీఆర్ చాలా దిగజారి మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ(PM Modi), బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బెదిరించే ధోరణిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేంద్రానికి, బీజేపీకి ప్రత్యర్థుల మాత్రమే ఉన్నారని, ఎవరూ శత్రువులు కారన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను దెబ్బతీసేలా సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారన్నారు. సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారని ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదులు(Pakistan Terrorists) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారన్నారు. నిజాం రాచరిక పాలన మళ్లీ రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం(Modi Govt) ఏడేళ్ల పాలనపై చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ సవాల్‌ను కేంద్ర ప్రభుత్వం తరఫున స్వీకరిస్తునన్నారు. సీనియర్‌ జర్నలిస్టుల సమక్షంలో గన్‌పార్కు(Gur Park) వద్దకు రావాలని కిషన్‌రెడ్డి అన్నారు.

విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉచిత కరెంట్ రైతులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి ఉచితంగా ఇచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వలేదన్నారు. మోటర్లకు మీటర్లు(Motor Meters) పెట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. యూరియా(Urea)పై వందశాతం సబ్సిడీ కేంద్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. త్వరలో తెలంగాణ(Telangana)లో ప్రధాని మోదీ పర్యటన ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. రామగుండంలో ఫ్యాక్టరీ స్థాపనలో పాల్గొంటారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. యూరియా సబ్సిడీ గత ఏడాది రూ. 79 వేల కోట్లు ఉంటే ఈ సంవత్సరం రూ. ఒక లక్ష కోట్లు ఇస్తున్నామన్నారు. అంటే గతంతో పోల్చితే 30 శాతానికి పైగా సబ్సిడీ(Subsidy) పెంచామన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget