అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

BJP Vs BRS : ఈడీ వలకు చిక్కిన రోహిత్ రెడ్డి, నెక్ట్స్ టార్గెట్ ఆ ముగ్గురేనా!

BJP Vs BRS : తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడేకొద్ది బీజేపీ, బీఆర్ఎస్ వార్ పీక్స్ చేరుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా వ్యవహరించిన పైలెట్ రోహిత్ రెడ్డిపై ఈడీ కన్నేసింది.

BJP Vs BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంతో ఒక్కసారిగా హైలెట్‌ అయిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. డ్రగ్స్‌ కేసులో విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు అందుకున్నారు. నిన్నటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు  దొరక్కుండా ఉన్న పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఇప్పుడు ఈడీ చేతుల్లో చిక్కడంతో మరోసారి తెలంగాణలో రాజకీయం హాటెక్కింది.

పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు 

కొన్నినెలలుగా తెలంగాణలో  బీజేపీ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ వార్‌ నడుస్తోంది. ఈడీ, ఐటీ దాడులతో కేంద్రం అధికార పార్టీపై దాడులు చేస్తుంటే దానికి ప్రతిగా ఏసీబీ, విజిలెన్స్‌ దాడులతో బీజేపీని ఇరుకున పెట్టేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అలా ఇప్పుడు ఈడీ దర్యాప్తులో ఇరుక్కున్నారు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌ రెడ్డి కూడా ఉన్నారు. మీడియాకి దూరంగా, కేసీఆర్‌ నీడలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో రోహిత్‌ రెడ్డి ఒకరు. ప్రస్తుతం రోహిత్‌ రెడ్డిని ఎలాగైనా సరే విచారించాలని బీజేపీ ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడు తప్పించుకున్న తాండూరు ఎమ్మెల్యేపై ఇప్పుడు ఈడీ చేతిలో చిక్కుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.

ముందే చెప్పిన బండి సంజయ్

ఓ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి  ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డిపై కేసు నమోదైంది. బెంగళూరు డ్రగ్స్‌ కేసుని మళ్లీ  బయటకు తీస్తామని ఈ మధ్యనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. ఆయన అలా చెప్పారో లేదో ఇలా పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి ఈడీ నోటీసులు వచ్చాయి. ఇదే కాదు బీఆర్‌ఎస్‌ నేతలు, ఎమ్మెల్యేలపై ఉన్న పాత కేసులన్నింటిని బయటకు తీసే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు డ్రగ్స్‌ కేసు త్వరలోనే మిగిలిన కేసులను కూడా బయటకు తీసి గులాబీ పార్టీలో గుబులు రేపాలని కాషాయం పార్టీ పట్టుదలతో ఉందట. మునుగోడు ఉపఎన్నికలకు ముందే రాష్ట్ర బీజేపీ నేతలు అధికార పార్టీ నేతలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయని చెప్పారు. అలా ప్రకటించిన కొద్ది టైమ్‌ లోనే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలపై వరసగా దాడులు జరిగిన విషయం తెలిసిందే.

త్వరలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు 

కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుగా పెట్టుకొని బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఆ విమర్శలు నిజమేనన్నట్లు మునుగోడు ఉపఎన్నిక తర్వాత వరసగా ఈడీ, ఐటీ దాడులతో గులాబీదళాన్ని హడలెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి డ్రగ్స్‌ కేసులో పైలెట్‌ రోహిత్‌ రెడ్డి కేంద్రం చేతికి చిక్కారు. త్వరలోనే మిగిలిన ముగ్గురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కూడా పలు కేసుల్లో ఈడీ, ఐటీ విచారణకు పిలిచే అవకాశాలు లేకపోలేదన్న టాక్‌ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు అంద‌జేసింది. అయితే ఈ కేసు విచారణకు హాజరుకాకుండా స్టే విధించాలని కోరడంతో న్యాయస్థానం ఈనెల 22 వరకు విచారణపై స్టే విధించింది. బీజేపీలోని కీలక నేతను కేసీఆర్‌ సర్కార్‌ ఇరికించాలని ప్రయత్నించిందని ఇప్పటికే కాషాయం నేతలు ఆరోపించారు. దానికి ప్రతిగానే ఇప్పుడు రోహిత్‌ రెడ్డికి డ్రగ్స్‌ కేసులో ఈడీ నోటీసులిచ్చిందన్న టాక్‌ నడుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naveen Yadav is set to become Minister: కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Bihar Election Results 2025: జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naveen Yadav is set to become Minister: కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Bihar Election Results 2025: జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
Bihar Election Result 2025: బిహార్ ఎన్నికల నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన ఈ 5 పాఠాలు ఇవే
బిహార్ ఎన్నికల నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన ఈ 5 పాఠాలు ఇవే
Bihar Election Result 2025 LIVE: బిహార్‌లో 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎన్డీఏ,
బిహార్‌లో 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎన్డీఏ,
Jubilee Hills By Election Results 2025:  జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
Dude OTT: 'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
Embed widget