అన్వేషించండి

DK Aruna : బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక రాళ్ల దాడులు - డీకే అరుణ

DK Aruna : దేవరుప్పులలో బండి సంజయ్ పాదయాత్రపై జరిగిన దాడిని డీకే అరుణ ఖండించారు. పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని ఆమె ఆరోపించారు.

DK Aruna : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామయాత్రపై టీఆర్ఎస్ నాయకుల దాడి చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల పట్టణంలో బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుండగా, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు యాత్రపై దాడికి పాల్పడ్డారని డీకే అరుణ ఆరోపించారు. ముందస్తు అనుమతితో పాదయాత్ర చేస్తుంటే రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదని డీకే అరుణ విమర్శించారు. 

పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా

పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా  ప్రజాస్వామ్యయుతంగా తమ విధులను నిర్వర్తించాలని డీకే అరుణ సూచించారు. తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతుంటే వారి బాధలు వినడానికి ఫామ్ హౌస్ దాటి బయటికి రాలేని కేసీఆర్, పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై, వరుసగా దాడులు చేయించడం పిరికిపందతనానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు. ఇంతకు ముందు బండి సంజయ్ ఉద్యోగుల కోసం శాంతియుతంగా ధర్నా చేస్తుంటే , పోలీసులు దౌర్జన్యంగా వారి కార్యాలయాన్ని ధ్వంసం చేసి అరెస్టు చేసిన ఘటన మరువకముందే, ఇవాళ పోలీసుల సమక్షంలోనే ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడం టీఆర్ఎస్  అసహనాన్ని తెలియజేస్తుందని డీకే అరుణ అన్నారు.

ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలని సవాల్ 

దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు తిరిగితే  ఇక్కడి టీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండని డీకే అరుణ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి వెళ్లి వారి కష్టాలు అడిగి తెలుసుకుంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న బీజేపీ నేతలపై దాడులు చేయడం అంటే ప్రజలపై నేరుగా దాడులు చేసినట్టేనన్నారు. బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరిస్తూ ఉండడంతో, వాళ్ల బండారం ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. టీఆర్ఎస్ అధికార పీఠాలు కదిలి ఇలా భౌతిక దాడులకు దిగుతున్నారని, కేసీఆర్ కు ఏ మాత్రం ధైర్యం ఉన్నా ప్రజాక్షేత్రంలో నేరుగా బీజేపీని ఎదుర్కోవాలని సవాల్ చేశారు. అంతేకానీ మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్టు ప్రజా సంగ్రామ యాత్రపై దాడులకు దిగితే బీజేపీ చెప్పే సమాధానం టీఆర్ఎస్ పార్టీకి అర్థమయ్యే రీతిలోనే ఉంటుందని డీకే అరుణ హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యతగా పోలీసులు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పై కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు

రేపటి మా ప్రభుత్వానికి పునాది రాళ్లు  

 టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం రాళ్లను విసరమంటే, బీజేపీ ధర్మం ఆ రాళ్లతో రామసేతు నిర్మాణం చెయ్యడం నేర్పిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో  ప్రజల్లో పెరుగుతున్న మద్దతు, ఆదరణను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. దేవురుప్పల గ్రామం దగ్గర ప్రజల బ్రహ్మరథం మధ్య సాగుతున్న బండి సంజయ్ కుమార్ పాదయాత్ర లో కొందరు దుండగులు పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల రక్తాన్ని కళ్ల చూసిన రాక్షసత్వాన్ని బొందబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కేసీఆర్ బలప్రయోగంతో భయపెట్టి ప్రజాభిప్రాయాన్ని  ప్రభావితం చేయాలని చూస్తున్నారన్నారు. 

Also Read : Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 72 జాతీయ చలనచిత్ర అవార్డులు లైవ్ వీక్షించండి
72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
High Tension in Shamshabad: పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరి రైతులు ఆగ్రహం.. బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత
పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరి రైతులు ఆగ్రహం.. బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత
HYDRAA Hyderabad Mega Drive: హైడ్రా సంచలనం - ఒక్కరోజులోనే రూ. 30,000 కోట్ల విలువైన 840 ఎకరాల భూమి స్వాధీనం!
హైడ్రా సంచలనం - ఒక్కరోజులోనే రూ. 30,000 కోట్ల విలువైన 840 ఎకరాల భూమి స్వాధీనం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Embed widget