అన్వేషించండి

Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్, మంత్రి ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా

Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. విద్యార్థుల ఆందోళనకు వారి తల్లిదండ్రులు మద్దతు తెలిపారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు.

Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనకు వారి తల్లిదండ్రులు మద్దతు తెలుపుతున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తమ తోబుట్టువుగా భావించి సబితా ఇంద్రా రెడ్డికి సమస్యలపై  వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని తెలిపారు. విద్యార్థులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని,  వారి సమస్యలను తక్షణమే తీర్చాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు. 

మళ్లీ ఆందోళన బాట 

జులై 30 శనివారం రాత్రి నుంచి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మెస్ లో భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా విద్యార్థులు నిరాకరించారు. ఇన్‌ఛార్జ్‌ వీసీ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీశ్‌ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ విద్యార్థులు ఒప్పుకోలేదు. సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొనే వరకు ఆందోళన విరమించమని తేల్చి చెప్పారు. ఇటీవల ఆర్జీయూకేటీలో ఆహారం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు మెస్ నిర్వాహకుల లైసెన్స్‌ రద్దు చేయాలని కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనం అందించాలంటూ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ వెంకటరమణకు విద్యార్థులు వినతి పత్రం అందించారు. ఆ సమస్యలను 24వ తేదీలోపు పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి వీసీ వారికి హామీ ఇచ్చారు. ఆ గడువు తేదీ ముగిసి ఐదు రోజులు పూర్తయినా డిమాండ్లను నెరవేర్చక పోవడంతో విద్యార్థులు శనివారం రాత్రి నుంచి మళ్లీ ఆందోళనకు దిగారు.

ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నాం- వీసీ 

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వైస్ ఛాన్సలర్ వెంకటరమణ అన్నారు. శనివారం రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేతృత్వంలో ఇవాళ వీసీ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల కర్తవ్యం చదువుకోవటం యునివర్సిటీకి మంచి పేరు తేవడం అన్నారు.  విద్యార్థుల సమస్యలను తీర్చటం తమ కర్తవ్యమని అన్నారు. గత నెల రోజుల నుంచి యునివర్సిటీలో ఉన్న ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేస్తున్నామన్నారు.  విద్యార్థుల సంక్షేమం విషయంలో ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. విద్యార్థుల భోజన సదుపాయం మెరుగుపరచటానికి కొత్త టెండర్లు ఆహ్వానించామని చెప్పారు.  వసతి గృహాలలో మౌలిక వసతులు మెరుగు పరుస్తున్నామని, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి నివేదికలు తయారు చేస్తామని వీసీ తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లను త్వరలోనే సమకూరుస్తామని అన్నారు. విద్యార్థులు కొన్ని రోజులు సంయమనం పాటిస్తే అన్ని సౌకర్యాలు కల్పించటానికి కృషి  చేస్తామన్నారు. భోజనం విషయంలో త్వరలోనే కొత్త టెండర్లు పిలుస్తామని నాణ్యమైన భోజనం అందిస్తామని వీసీ తెలిపారు. విద్యార్థులు ఆందోళన విరమించాలని సూచించారు.

బీజేపీ నేత కాలుపై నుంచి వెళ్లిన పోలీస్ కారు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు సమస్యలను తెలుసుకోవడానికి, సంఘీభావం తెలపడానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బాసరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో లోకేశ్వరం మండలం మన్మద్ నందన్ గ్రామం వద్ద ఎంపీ సోయం బాపురావ్ ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఎంపీని అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఆ వాహనం పక్కనున్న బీజేవైఎం నేత కుమ్మరి వెంకటేష్ కాలిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అతనికి గాయాలయ్యాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Helpline Numbers: నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
Gandhi Sarovar Project: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాలు కేటాయించండి: కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాలు కేటాయించండి: కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
OG Pre Release Event - Chiranjeevi: విజయవాడలో మెగా సందడికి రెడీ... ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ & చిరంజీవి... 'ఓజీ' ఈవెంట్ అప్టేట్
విజయవాడలో మెగా సందడికి రెడీ... ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ & చిరంజీవి... 'ఓజీ' ఈవెంట్ అప్టేట్
Prithvi Shaw vs Sapna Gill Case: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం- క్రికెటర్ పృథ్వీ షాకు కోర్టు జరిమానా
ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం- క్రికెటర్ పృథ్వీ షాకు కోర్టు జరిమానా
Advertisement

వీడియోలు

SA20 Auction Highlights | SA20 వేలంలో కోట్లు కురిపించిన ఫ్రాంఛైజీలు
India vs UAE Preview | నేడే ఇండియా vs UAE మ్యాచ్
Azmatullah Omarzai Asia Cup 2025 | ఆసియా కప్ లో అజ్మతుల్లా ఊచకోత
Azmatullah Omarzai in Asia Cup 2025 | ఆసియా కప్ లో అజ్మతుల్లా ఊచకోత
Afghanistan vs Hong Kong Highlights | బోణీ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Helpline Numbers: నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
Gandhi Sarovar Project: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాలు కేటాయించండి: కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాలు కేటాయించండి: కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
OG Pre Release Event - Chiranjeevi: విజయవాడలో మెగా సందడికి రెడీ... ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ & చిరంజీవి... 'ఓజీ' ఈవెంట్ అప్టేట్
విజయవాడలో మెగా సందడికి రెడీ... ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ & చిరంజీవి... 'ఓజీ' ఈవెంట్ అప్టేట్
Prithvi Shaw vs Sapna Gill Case: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం- క్రికెటర్ పృథ్వీ షాకు కోర్టు జరిమానా
ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం- క్రికెటర్ పృథ్వీ షాకు కోర్టు జరిమానా
Volvo XC90 Car Cheaper: ఫెస్టివల్ సీజన్ కు ముందే పండుగ లాంటి ఆఫర్, వోల్వో కార్లపై రూ. 7 లక్షలకు పైగా డిస్కౌంట్
ఫెస్టివల్ సీజన్ కు ముందే పండుగ లాంటి ఆఫర్, వోల్వో కార్లపై రూ. 7 లక్షలకు పైగా డిస్కౌంట్
Dagadarthi Airport In Nellore: పీపీపీ విధానంలో రూ.916 కోట్లతో దగదర్తిలో ఎయిర్‌పోర్ట్, టెండర్లు ఆహ్వానించిన ఏపీఏడీసీఎల్
పీపీపీ విధానంలో రూ.916 కోట్లతో దగదర్తిలో ఎయిర్‌పోర్ట్, టెండర్లు ఆహ్వానించిన ఏపీఏడీసీఎల్
Nara Lokesh Anantapur Tour Cancelled: నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు, నేపాల్ నుంచి ఏపీ వారిని వెనక్కి తీసుకురావడంపై ఫోకస్
నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు, నేపాల్ నుంచి ఏపీ వారిని వెనక్కి తీసుకురావడంపై ఫోకస్
US Tariffs on India: భారత ప్రధాని మోదీతో చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న డొనాల్డ్ ట్రంప్.. మార్కెట్‌కు బూస్ట్
మోదీతో చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న డొనాల్డ్ ట్రంప్.. మార్కెట్‌కు బూస్ట్
Embed widget