అన్వేషించండి

Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్, మంత్రి ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా

Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. విద్యార్థుల ఆందోళనకు వారి తల్లిదండ్రులు మద్దతు తెలిపారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు.

Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనకు వారి తల్లిదండ్రులు మద్దతు తెలుపుతున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తమ తోబుట్టువుగా భావించి సబితా ఇంద్రా రెడ్డికి సమస్యలపై  వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని తెలిపారు. విద్యార్థులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని,  వారి సమస్యలను తక్షణమే తీర్చాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు. 

మళ్లీ ఆందోళన బాట 

జులై 30 శనివారం రాత్రి నుంచి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మెస్ లో భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా విద్యార్థులు నిరాకరించారు. ఇన్‌ఛార్జ్‌ వీసీ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీశ్‌ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ విద్యార్థులు ఒప్పుకోలేదు. సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొనే వరకు ఆందోళన విరమించమని తేల్చి చెప్పారు. ఇటీవల ఆర్జీయూకేటీలో ఆహారం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు మెస్ నిర్వాహకుల లైసెన్స్‌ రద్దు చేయాలని కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనం అందించాలంటూ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ వెంకటరమణకు విద్యార్థులు వినతి పత్రం అందించారు. ఆ సమస్యలను 24వ తేదీలోపు పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి వీసీ వారికి హామీ ఇచ్చారు. ఆ గడువు తేదీ ముగిసి ఐదు రోజులు పూర్తయినా డిమాండ్లను నెరవేర్చక పోవడంతో విద్యార్థులు శనివారం రాత్రి నుంచి మళ్లీ ఆందోళనకు దిగారు.

ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నాం- వీసీ 

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వైస్ ఛాన్సలర్ వెంకటరమణ అన్నారు. శనివారం రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేతృత్వంలో ఇవాళ వీసీ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల కర్తవ్యం చదువుకోవటం యునివర్సిటీకి మంచి పేరు తేవడం అన్నారు.  విద్యార్థుల సమస్యలను తీర్చటం తమ కర్తవ్యమని అన్నారు. గత నెల రోజుల నుంచి యునివర్సిటీలో ఉన్న ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేస్తున్నామన్నారు.  విద్యార్థుల సంక్షేమం విషయంలో ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. విద్యార్థుల భోజన సదుపాయం మెరుగుపరచటానికి కొత్త టెండర్లు ఆహ్వానించామని చెప్పారు.  వసతి గృహాలలో మౌలిక వసతులు మెరుగు పరుస్తున్నామని, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి నివేదికలు తయారు చేస్తామని వీసీ తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లను త్వరలోనే సమకూరుస్తామని అన్నారు. విద్యార్థులు కొన్ని రోజులు సంయమనం పాటిస్తే అన్ని సౌకర్యాలు కల్పించటానికి కృషి  చేస్తామన్నారు. భోజనం విషయంలో త్వరలోనే కొత్త టెండర్లు పిలుస్తామని నాణ్యమైన భోజనం అందిస్తామని వీసీ తెలిపారు. విద్యార్థులు ఆందోళన విరమించాలని సూచించారు.

బీజేపీ నేత కాలుపై నుంచి వెళ్లిన పోలీస్ కారు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు సమస్యలను తెలుసుకోవడానికి, సంఘీభావం తెలపడానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బాసరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో లోకేశ్వరం మండలం మన్మద్ నందన్ గ్రామం వద్ద ఎంపీ సోయం బాపురావ్ ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఎంపీని అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఆ వాహనం పక్కనున్న బీజేవైఎం నేత కుమ్మరి వెంకటేష్ కాలిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అతనికి గాయాలయ్యాయి. 

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget