అన్వేషించండి

Himanta Biswa Sarma On KCR : సూర్యుడి పైనో, చంద్రుడి మీదో కేసీఆర్ ప్రభుత్వం- హిమంత బిశ్వ శర్మ

Himanta Biswa Sarma On KCR : కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న కేసీఆర్ కల నెరవేరదని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శించారు.

Himanta Biswa Sarma On KCR : జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కల నెరవేరదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన బిశ్వ శర్మ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మ‌రో 30 ఏళ్ల వరకు బీజేపీ అధికారంలో ఉంటుందన్న ఆయన... విప‌క్షాల‌తో క‌లిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల‌న్న కేసీఆర్ క‌ల నెర‌వేర‌ద‌ని స్పష్టం చేశారు. సముద్రంలోనో, సూర్యుడి మీదో, చంద్రుడి మీదో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు. కేంద్రంలో అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు కావ‌డానికి అవ‌కాశ‌మే లేదన్నారు. దేశంలోని ప్రతిప‌క్షాల‌న్నీ క‌లిసే ఉన్నాయ‌ని, కేసీఆర్ కొత్తగా చేయాల్సిందేం లేదన్నారు.  

వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే! 

కేసీఆర్ తెలంగాణ ప్రజ‌ల విశ్వాసాన్ని కోల్పోయార‌ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. ఈ విష‌యాన్ని గ్రహించిన కేసీఆర్ జాతీయ రాజ‌కీయాలంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను కేసీఆర్ అమ‌లు చేయాల‌ని, లేదంటే ఆయ‌న ఎక్కడకు వెళ్లినా గౌర‌వం ల‌భించ‌ద‌న్నారు. సీబీఐ, ఈడీల గురించి మాట్లాడే వారికి అవి అంటే భ‌యం అని బిశ్వ శ‌ర్మ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు. దేశంలో ఎంతమంది జట్టుకట్టినా దేశ ప్రజల మనసులోంచి ప్రధాని నరేంద్ర మోదీ తుడిచేలేరన్నారు. తెలంగాణ ప్రజలు నిజాం పాలనను కోరుకోవడంలేదని విమర్శించారు. 

ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత 

హైదరాబాద్ లోని ఎంజే మార్కెట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గణేశ్‌ శోభాయాత్రలో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్యర్యంలో మొజంజాహీ మార్కెట్‌ చౌరస్తా వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాగత వేదికపై భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నాయకుడు భగవంతరావు మాట్లాడుతుండగా స్థానిక టీఆర్ఎస్ నాయకుడు నందకిశోర్‌ స్టేజ్ పైకి వచ్చి మైకు లాక్కునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న భాగ్యనగర్‌ ఉత్సవ సమితి సభ్యులు నందకిశోర్ ను అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి టీఆర్ఎస్ కార్యకర్తను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు.  అనంతరం అసోం సీఎం హిమంత మాట్లాడుతూ తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతోందని, కేసీఆర్ కుటుంబానికి మాత్రమే మంచి జరుగుతోందని విమర్శించారు.

తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నానని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ప్రభుత్వం ప్రజలందరి కోసం పనిచేయాలి కానీ, ఒక కుటుంబం కోసం కాదని విమర్శించారు. తెలంగాణలో రజాకార్ల పాలనకు ముగింపు పలకాలన్నారు. దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. అంతకుముందు హిమంత బిశ్వశర్మ ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ఆయన మాట్లాడాల్సి ఉండగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అంతకు ముందు తలసాని ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. 

Also Read : జాతీయ పార్టీ పెట్టాలి .. తెలంగాణలాగే దేశాన్నీ బాగు చేయాలి - కేసీఆర్‌కు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల విజ్ఞప్తి !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Embed widget