అన్వేషించండి

PM Maandhan Yojana Scheme 2026: రైతులు, కార్మికులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. పీఎం మాన్ ధన్ యోజన్ పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే?

PM Maandhan Yojana Scheme 2026: చిన్న, సన్నకారు రైతులు, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పీఎం మాన్ ధన్ యోజన్ పథకం రూ. 3000 పెన్షన్ అందిస్తుంది. ఈ పథకం వివరాలు ఇలా ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 18-40 ఏళ్ల రైతులు, కార్మికులకు నెలకు ₹3000 పింఛన్.
  • అర్హులు: చిన్న రైతులు, తక్కువ జీతం కార్మికులు.
  • ఆధార్, ఈ-శ్రమ్ కార్డులతో CSC కేంద్రంలో నమోదు.
  • వయసును బట్టి నెలవారీ ప్రీమియం, 60 ఏళ్ల తర్వాత పింఛన్.

PM Maandhan Yojana Scheme 2026: కేంద్ర ప్రభుత్వం.. 18-40 ఏళ్ల వయసు గల రైతులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రధానమంత్రి మాన్‌ధన్‌ యోజన పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది. 60 సంవత్సరాలు నిండిన అసంఘటిత రంగ కార్మికులు, చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం కింద ప్రతినెలా రూ.3 వేల చొప్పున పింఛన్ అందిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల తరహాలో రైతులు, కార్మికులు కూడా పెన్షన్ పొందవచ్చు. రైతులకు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన, అసంఘటిత రంగ కార్మికులకు పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకాల కింద పెన్షన్ అందిస్తుంది. 

పీఎం మాన్ ధన్ యోజన అర్హతలు

  • 18- 40 మధ్య వయస్సు గల చిన్న సన్నకారు రైతులు, కార్మికులు 
  • రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నవారు 
  • రూ.15 వేల లోపు ఉన్న నెల జీతం అసంఘటిత రంగ కార్మికులు 
  • EPFO, NPS, ESI పథకాల్లో లేని వారు అర్హులు 

దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు

  1. ఆధార్ కార్డు 
  2. ఇ-శ్రమ్ కార్డు 
  3. మొబైల్ నెంబర్ 
  4. నామినీ ఆధార్ కార్డు 
  5. ఆదాయపు ధ్రువీకరణ పత్రం 
  6. కుల ధ్రువీకరణ పత్రం 
  7. భూమి వివరాలు 
  8. వయసు నిర్థారణ సర్టిఫికెట్ 
  9. బ్యాంక్ పాసు పుస్తకం 

పీఎం మాన్ ధన్ యోజన పథకం దరఖాస్తు విధానం 

పీఎం మాన్ ధన్ యోజన స్కీమ్ కోసం ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా మీ-సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు. లేదా లబ్ధిదారులు https://maandhan.in లోని మాన్‌ధన్ పోర్టల్‌ను ఉపయోగించి నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆఫ్​లైన్​లో దరఖాస్తుకు కూడా మీ సమీపంలోని సీఎస్సీ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. అక్కడ దరఖాస్తు ఫారమ్​ నింపి ఇస్తే CSC ఆపరేటర్ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తి చేస్తారు. సీఎస్సీ కేంద్రంలో దరఖాస్తుదారుడి వివరాలు  పీఎంకేఎం పోర్టర్‌లో నమోదు చేస్తారు.   

  •  ఆధార్, బ్యాంక్ అకౌంట్ ఖాతా పత్రాలతో CSC కేంద్రాన్ని సందర్శించండి.
  • ఆధార్ నెంబర్ ఉపయోగించి బయోమెట్రిక్ ధృవీకరణ చేస్తారు.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్‌ను పూరించండి.
  • ఈ పథకంలో చేరేందుకు మొదటి చందాను నగదు రూపంలో చెల్లించాలి.
  • అనంతరం మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్ సౌకర్యాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.  
  • నమోదు ప్రక్రియ పూర్తైన తర్వాత PM SYM కార్డు జారీ చేస్తారు. 

ప్రీమియం ఎంత? 

పీఎం మాన్ ధన్ యోజన స్కీమ్ లో చేరాలనుకునే వారు ప్రతి నెలా కొంత ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు పూర్తయ్యే వరకు ప్రీమియం కట్టాలి. 18 ఏళ్లు ఉన్న వారు తన వాటాగా నెలకు రూ.55 చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా రూ.55 చెల్లిస్తుంది. వయస్సును బట్టి ప్రతీ సంవత్సరం 3 నుంచి 10 రూపాయల వరకు ప్రీమియం పెరుగుతుంది. 40 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.200 ప్రీమియం చెల్లించాలి. ఇలా ప్రీమియం చెల్లించిన సభ్యులకు 60 ఏళ్లు పూర్తైన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ పొందుతారు. ఈ స్కీమ్​ కోసం నమోదు చేసుకున్న వారు 60 ఏళ్ల నిండకుండానే మరణిస్తే.. నామినీకి పెన్షన్ మొత్తంలో సగం రూ.1500 ప్రతి నెలా చెల్లిస్తారు.    

లబ్దిదారుడు ముందే మరణిస్తే?

లబ్దిదారుడు ఈ పథకంలో చేరిన 10 సంవత్సరాల లోపు మరణిస్తే పెన్షన్ కోసం చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ లబ్ధిదారుడు 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ప్రీమియం చెల్లిస్తే, 60 ఏళ్లు నిండక ముందే మరణిస్తే.. ప్రీమియం మొత్తం, దానిపై వచ్చిన వడ్డీ, ఫండ్ ద్వారా వచ్చిన వడ్డీ లేదా సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.  చందాదారుడు 60 ఏళ్ల తర్వాత మరణిస్తే, వారి జీవిత భాగస్వామి పింఛన్ లో 50 శాతాన్ని కుటుంబ పింఛన్ గా పొందుతారు. 

Frequently Asked Questions

ప్రధానమంత్రి మాన్ ధన్ యోజన పథకం ఎవరి కోసం?

18-40 ఏళ్ల వయసు గల రైతులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ పథకం అమలు చేయబడుతుంది.

ఈ పథకం కింద ఎంత పెన్షన్ వస్తుంది?

60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేల చొప్పున పింఛన్ అందిస్తుంది.

పథకంలో చేరడానికి అర్హతలు ఏమిటి?

18-40 ఏళ్ల లోపు, రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు, రూ.15 వేలలోపు జీతం పొందే కార్మికులు అర్హులు.

దరఖాస్తు చేసుకోవడానికి ఏయే పత్రాలు అవసరం?

ఆధార్ కార్డు, ఇ-శ్రమ్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ పాసు పుస్తకం వంటివి అవసరం.

పథకంలో ప్రీమియం ఎంత చెల్లించాలి?

18 ఏళ్ల వారు నెలకు రూ.55 చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా అంతే చెల్లిస్తుంది. వయసును బట్టి ప్రీమియం పెరుగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
Advertisement

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget