అన్వేషించండి

Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌, భైంసా పట్టణాలు నీటమునిగాయ్. భారీగా పంటలు నీటమునిగాయి.

జులై ఆఖరివారంలో తెలంగాణ వ్యాప్తంగా కుంభవృష్టి కురిసింది. కుమురం భీం జిల్లా వాంకిడిలో 27.30 సెంటీమీటర్ల వాన పడి వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. శ్రీరామసాగర్‌ నుంచి మేడిగడ్డ వరకు నీటిని దిగువకు వదులుతున్నారు. 


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో జులై ఆఖరి వారంలో కురిసిన అతి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది.  ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరడంతో నిండుకుండల్లా మారాయి. నగరాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వందల గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.  నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ఉద్ధృతితో నిర్మల్‌, భైంసా పట్టణాలు నీట మునిగాయి.  


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

కామారెడ్డి జిల్లాలో 22 ఇళ్లు పూర్తిగా, 111 ఇళ్లు పాక్షికంగా నేలకూలాయి. 17,198 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 7 ఇళ్లు పూర్తిగా, 48 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆరు రోడ్లు కొట్టుకుపోయాయి. ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండుకుండల్లా మారాయి. వరంగల్‌ నగరంలో పలు కాలనీలు జలమయం కావడంతో బల్దియా అప్రమత్తమైంది. ఖానాపూర్‌ మండలంలోని పాకాల సరస్సు 19 అడుగులకు చేరింది. ములుగు జిల్లా లక్నవరం సరస్సులో నీటిమట్టం 27 అడుగులకు, రామప్ప చెరువులో 31 అడుగులకు చేరింది.  


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో  పర్ణశాల వద్ద సీతవాగు ప్రాంతం, సీతమ్మ నారచీరల ప్రాంతం, స్వామివారి సింహాసనం, ఇనుప వంతెన, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగిపోయాయి. ఖమ్మం మున్నేరు నది 14 అడుగులకు చేరింది. ఖమ్మం మార్గంలో కొత్తలంకపల్లి వద్ద వరద ఉద్ధృతికి రైల్వే పనుల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. వైరా, బేతుపల్లి జలాశయాలు నీటిమట్టం దాటాయి. కిన్నెరసాని పరవళ్లు తొక్కుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 16 అడుగులకు చేరింది. భద్రాద్రి జిల్లాలో వాగులు పొంగి ప్రవహించడం వల్ల 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దుంధుబి, ఊకచెట్టు, మన్నెవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సంగారెడ్డిలోని నల్లవాగు అలుగుపారుతోంది. ధర్మపురి నేరేళ్లగుట్ట 64వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జగిత్యాల- నిజామాబాద్‌ జాతీయ రహదారిపై గాంధీనగర్‌ వద్ద సైతం రాకపోకలు స్తంభించాయి. వేములవాడ మూలవాగులో చేపల కోసం వెళ్లిన ఆరుగురు జాలర్లు చిక్కుకున్నారు. తాళ్ల సాయంతో వారిని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని జోగన్‌పల్లి పెద్ద చెరువు మత్తడి దూకడంతో వరినాట్ల కోసం వెళ్లిన 21 మంది కూలీలు అందులో చిక్కుకున్నారు. ఎస్సై సతీష్‌ గ్రామస్థుల సహకారంతో వంతెనకు ఇరువైపుల తాళ్లు కట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

జగిత్యాల జిల్లా అనంతారం వాగులో నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో భారీ వర్షాలకు ఓ ఆశ్రమాన్ని వరద చుట్టేసింది.  జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది.హైదరాబాద్‌లో హిమాయత్‌సాగర్‌ ఐదు గేట్లు ఎత్తి మూసీలోకి వరదను వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద రావడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. 


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

జులై ఆఖరివారంలో కురిసిన భారీ వర్షాలకు సింగరేణిలో బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిపేశారు. 19 ఉపరితల గనుల్లో పనులు పూర్తిగా నిలిపివేయడంతో 1,95,765 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయింది. గడ్డెన్నవాగు జలాశయం నుంచి విడుదలైన వరద నీటితో భైంసా పట్టణంలోని సుద్దవాగు తీరంలో నిర్మించిన వైకుంఠధామం పూర్తిగా నీట మునగగా.. అందులో ఏర్పాటు చేసిన 15 అడుగుల మహాశివుడిని గంగమ్మ చుట్టేసింది. యాదాద్రి ఆలయ దారులు పాక్షికంగా దెబ్బతినడంతో  రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వానలకు ఆలయ రెండో ఘాట్ రోడ్డులో కొండపై నుంచి రాళ్లు జారిపడ్డాయి. ఆ సమయంలో యాత్రికులు ఎవరూ లేకపోవడంతో ప్రాఅణాపాయం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగు అడుగు భాగంలో ఇసుక, సిమెంట్‌ దిమ్మెలు కొట్టుకుపోయాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget