అన్వేషించండి

Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌, భైంసా పట్టణాలు నీటమునిగాయ్. భారీగా పంటలు నీటమునిగాయి.

జులై ఆఖరివారంలో తెలంగాణ వ్యాప్తంగా కుంభవృష్టి కురిసింది. కుమురం భీం జిల్లా వాంకిడిలో 27.30 సెంటీమీటర్ల వాన పడి వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. శ్రీరామసాగర్‌ నుంచి మేడిగడ్డ వరకు నీటిని దిగువకు వదులుతున్నారు. 


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో జులై ఆఖరి వారంలో కురిసిన అతి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది.  ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరడంతో నిండుకుండల్లా మారాయి. నగరాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వందల గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.  నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ఉద్ధృతితో నిర్మల్‌, భైంసా పట్టణాలు నీట మునిగాయి.  


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

కామారెడ్డి జిల్లాలో 22 ఇళ్లు పూర్తిగా, 111 ఇళ్లు పాక్షికంగా నేలకూలాయి. 17,198 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 7 ఇళ్లు పూర్తిగా, 48 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆరు రోడ్లు కొట్టుకుపోయాయి. ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండుకుండల్లా మారాయి. వరంగల్‌ నగరంలో పలు కాలనీలు జలమయం కావడంతో బల్దియా అప్రమత్తమైంది. ఖానాపూర్‌ మండలంలోని పాకాల సరస్సు 19 అడుగులకు చేరింది. ములుగు జిల్లా లక్నవరం సరస్సులో నీటిమట్టం 27 అడుగులకు, రామప్ప చెరువులో 31 అడుగులకు చేరింది.  


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో  పర్ణశాల వద్ద సీతవాగు ప్రాంతం, సీతమ్మ నారచీరల ప్రాంతం, స్వామివారి సింహాసనం, ఇనుప వంతెన, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగిపోయాయి. ఖమ్మం మున్నేరు నది 14 అడుగులకు చేరింది. ఖమ్మం మార్గంలో కొత్తలంకపల్లి వద్ద వరద ఉద్ధృతికి రైల్వే పనుల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. వైరా, బేతుపల్లి జలాశయాలు నీటిమట్టం దాటాయి. కిన్నెరసాని పరవళ్లు తొక్కుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 16 అడుగులకు చేరింది. భద్రాద్రి జిల్లాలో వాగులు పొంగి ప్రవహించడం వల్ల 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దుంధుబి, ఊకచెట్టు, మన్నెవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సంగారెడ్డిలోని నల్లవాగు అలుగుపారుతోంది. ధర్మపురి నేరేళ్లగుట్ట 64వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జగిత్యాల- నిజామాబాద్‌ జాతీయ రహదారిపై గాంధీనగర్‌ వద్ద సైతం రాకపోకలు స్తంభించాయి. వేములవాడ మూలవాగులో చేపల కోసం వెళ్లిన ఆరుగురు జాలర్లు చిక్కుకున్నారు. తాళ్ల సాయంతో వారిని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని జోగన్‌పల్లి పెద్ద చెరువు మత్తడి దూకడంతో వరినాట్ల కోసం వెళ్లిన 21 మంది కూలీలు అందులో చిక్కుకున్నారు. ఎస్సై సతీష్‌ గ్రామస్థుల సహకారంతో వంతెనకు ఇరువైపుల తాళ్లు కట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

జగిత్యాల జిల్లా అనంతారం వాగులో నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో భారీ వర్షాలకు ఓ ఆశ్రమాన్ని వరద చుట్టేసింది.  జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది.హైదరాబాద్‌లో హిమాయత్‌సాగర్‌ ఐదు గేట్లు ఎత్తి మూసీలోకి వరదను వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద రావడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. 


Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

జులై ఆఖరివారంలో కురిసిన భారీ వర్షాలకు సింగరేణిలో బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిపేశారు. 19 ఉపరితల గనుల్లో పనులు పూర్తిగా నిలిపివేయడంతో 1,95,765 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయింది. గడ్డెన్నవాగు జలాశయం నుంచి విడుదలైన వరద నీటితో భైంసా పట్టణంలోని సుద్దవాగు తీరంలో నిర్మించిన వైకుంఠధామం పూర్తిగా నీట మునగగా.. అందులో ఏర్పాటు చేసిన 15 అడుగుల మహాశివుడిని గంగమ్మ చుట్టేసింది. యాదాద్రి ఆలయ దారులు పాక్షికంగా దెబ్బతినడంతో  రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వానలకు ఆలయ రెండో ఘాట్ రోడ్డులో కొండపై నుంచి రాళ్లు జారిపడ్డాయి. ఆ సమయంలో యాత్రికులు ఎవరూ లేకపోవడంతో ప్రాఅణాపాయం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగు అడుగు భాగంలో ఇసుక, సిమెంట్‌ దిమ్మెలు కొట్టుకుపోయాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget