అన్వేషించండి

Heavy Floods: తెలంగాణలో నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులు - ఆలమట్టికి భారీ వరద

Heavy Floods: రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ముఖ్యంగా ఆలమట్టికి వరద భారీగా పెరిగింది. 

Heavy Floods: తెలంగాణతోపాటు  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుగా మారాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా పరీవాహక ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆలమట్టిలోకి లక్షా 7 వేల 769 క్యూసెక్కులు ప్రవాహం ఉండగా... నీటిమట్టం 54.56 టీఎంసీలకు చేరుకుంది. 6,671 క్యూసెక్కులు దిగువకు విడుదల అవుతున్నాయి. జూరాలకు 41,925 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ప్రాజెక్టులో పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ఆదివారం రోజు 8.75 టీఎంసీల నీటిమట్టం ఉంది. 8,904 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ కు 5,081 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 17.80 టీఎంసీలకు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకూ వరద ప్రవాహాలు పెరిగాయి. శ్రీరామ సాగర్ ప్రాజెక్టుకు లక్షా 21 వేల 8 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... 882 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను 6.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

75 గేట్ల ద్వారా నీటిని వదులుతున్న అధికారులు

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 48,475 క్యూసెక్కులు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 22,440 క్యూసెక్కుల వరద వస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 5,917 క్యూసెక్కుల వరద వస్తుండగా 385 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.04 టీఎంసీలకు చేరుకుంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి 5,49,210 క్యూసెక్కుల వరద వస్తుండగా... 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని 75 గేట్ల ద్వారా వదులుతున్నారు.  ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఆదివారం రోజు ఎగువ, దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగించారు. ఎగువన ఐదు, దిగువన నాలుగు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేశారు. సాయంత్రానికి ఎగువన 175 మెగావాట్లు ఉత్పత్తి చేయగా.. దిగువన 145 మెగావాట్లు ఉత్పత్తి చేసినట్లు జెన్ కో ఎస్ఈ రామ సుబ్బారెడ్డి తెలిపారు. 

50 అడుగుల ఎత్తు ఉండే వంతెనను తాకుతూ..

అలాగే తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం అయిన ఆదిలాబాజ్ జిల్లా జైనథ్ మండలం డొల్లార వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై 14 గంటల పాటు వాహనాల రాకపోకలుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాదాపు దశాబ్దం కాలం తర్వాత 50 అడుగుల ఎత్తు ఉండే వంతెనను తాకుతూ పెన్ గంగా నది ప్రవహించింది. వరద ఉద్ధృతి క్రమంగా పెరగడంతో శనివారం రాత్రి 8 గంటలకు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. జైనథ్ తహసీల్దార్ రాఘవేంద్ర రావు, ఎంపీడీఓ గజానన్ రావు, సీఐ నరేష్ కుమార్ లతో కూడిన అధికారుల బృందం రాత్రంతా అక్కడే ఉండి పరిస్థితులను అంచనా వేసింది. ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంది. ఎన్ హెచ్ఐ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆదివారం ఉదయం పెన్ గంగా వంతెనతో పాటు వరద ఉద్ధృతిని పరిశీలించింది.

20 కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

అప్పటి వరకు 5 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఉదయం 10 గంటలకు వాహనాల రాకపోకలను అనుమతించారు. అప్పటికే ఇటు ఆదిలాబాద్ అటు మహారాష్ట్ర వైపు దాదాపు 20 కిలో మీటర్ల మేర రెండు వరుసల్లో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రానమ్మ, కలెక్టర్ రాహుల్ రాజ్ పెన్ గంగ వరద ఉద్ధృతితో పాటు ఎగువన ఉన్న చనాఖా-కొరాటా బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. పెన్ గంగ ఉద్ధృతి కారణంగా కలుగుతున్న నష్టాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget