అన్వేషించండి

Devaryamjal Lands: దేవరయాంజాల్ భూకబ్జాలపై ప్రభుత్వానికి నివేదిక, అవి ఎవరివో తేల్చిన కమిటీ

కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి 1925లో నిజాం హాయాంలో రాముడి భక్తుడైన రామిడి పుల్లయ్య అనే వ్యక్తి గిఫ్ట్ డీడ్ చేసినట్లుగా రికార్డులు ఉన్నాయి.

తెలంగాణలో కొద్ది రోజుల క్రితం సంచలనం రేపిన దేవరయాంజాల్ భూముల విషయంలో ఏర్పాటైన కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నిన్ననే (నవంబరు 16) ఈ నివేదికను కమిటీ ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ భూములు దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినవిగా కమిటీ తేల్చింది. హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలో దేవరయాంజాల్ ప్రాంతం ఉంది. అక్కడ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం కూడా ఉంది. ఆ ఆలయానికి సంబంధించిన భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఓ కమిటీని నియమించింది. ఇక్కడ ఉన్న 1,350 ఎకరాలు దేవాదాయ శాఖకు చెందినవేనని కమిటీ చెప్పినట్లు తెలుస్తోంది.

ఆ కమిటీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు నేతృత్వం వహించారు. అందులో నల్గొండ, మేడ్చల్‌ మల్కాజ్ గిరి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. వీరితో ప్రత్యేకంగా ప్రభుత్వం దేవరయాంజాల్ భూముల విచారణ కోసం కమిటీని నియమించింది. విచారణలో భాగంగా గతేడాది మే నెలలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. దేవరయాంజాల్ భూముల విషయంలో ఇప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రమేయంపై విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు విచారణ చేశారు.

ప్రత్యేక బృందాలు వేర్వేరుగా విచారణ చేపట్టాయి. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భూ ఆక్రమణలపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను వివిధ శాఖల పరిశీలనకు పంపనున్నారు. ఆలయ భూముల సర్వే నంబర్లు, ఇతర శాఖల పరిధిలో ఉన్న విస్తీర్ణాలతోపాటు ఆక్రమణలు జరిగిన వ్యవహారంపైన కూడా ఆయా శాఖలు సమగ్ర పరిశీలన చేయించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దస్త్రాన్ని న్యాయ పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

అసలేం జరిగిందంటే..  
ఏడాదిన్నర క్రితం దేవరయాంజాల్ భూముల వివాదం రేగింది. అప్పట్లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ భూములను ఆక్రమించి గోదాములు నిర్మించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కొందరు స్థానికులు, గోదాముల నిర్వహకులు తమ వద్ద ఉన్న రికార్డులు, పత్రాలను అధికారులకు సమర్పించారు. ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు.

కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి 1925లో నిజాం హాయాంలో రాముడి భక్తుడైన రామిడి పుల్లయ్య అనే వ్యక్తి గిఫ్ట్ డీడ్ చేసినట్లుగా రికార్డులు ఉన్నాయి. నిజాం నవాబు వద్ద రామిడి పుల్లయ్య పని చేసేవారు. ఈ భూములు ఈటల రాజేందర్‌ కనుసన్నల్లోనే కబ్జాకు గురైనట్టుగా దేవరయాంజాల్‌ గ్రామస్తులు గతంలోనే విచారణ కమిటీకి తెలిపారు. రికార్డుల ప్రకారం ఆలయానికి 1,521.13 ఎకరాల భూములున్నాయి. ఆ భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని ధూపదీప నైవేద్యాలకు వినియోగించాల్సి ఉంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నిర్మించినట్లు చెబుతున్న గోదాములతో పాటు అక్కడ ఉన్న ఇతర గోదాములు, కట్టడాలను కమిటీ పరిశీలించింది. భూముల్లో 219 వరకు ప్రైవేటు నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. 

ఈ సందర్భంగా కొందరు స్థానికులు, గోదాముల నిర్వాహకులు తమ వద్ద ఉన్న రికార్డులు, పత్రాలను అధికారులకు సమర్పించారు. భూములను సేల్‌ డీడ్‌తో కొనుగోలు చేశామని వివరణ ఇచ్చారు. ఈటల రాజేందర్‌తో ముడిపెట్టి ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. గతేడాది మే నెల 7న ఈటల గోదాములపై పురపాలక సంఘంలో విజిలెన్స్‌, ఏసీబీ అధికారులు ఆరా తీశారు. దాదాపు 6.24 ఎకరాల్లో కట్టడాలున్నట్లు గుర్తించారు. దేవాలయ భూముల్లో ఆయనకు చెందిన గోదాముల వివరాలు, ఎంత విస్తీర్ణంలో నిర్మించారనే అంశంపైనా విచారణ చేపట్టారు. వాటికి సంబంధించిన అనుమతి పత్రాలతో పాటు పురపాలక సంఘానికి ఎంత పన్ను చెల్లిస్తున్నారు, ఎవరికి అద్దెకు ఇచ్చారనే అంశాలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Tirupati Crime News: ఆకలితో పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం
పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం
Iran War: అమెరికాతో ముఖాముఖి పోరుకు ఇరాన్ సిద్ధం! పది లక్షల మంది యోధులతో భారీ సమీకరణ! అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న ఆయుధ కొరత?
అమెరికాతో ముఖాముఖి పోరుకు ఇరాన్ సిద్ధం! పది లక్షల మంది యోధులతో భారీ సమీకరణ! అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న ఆయుధ కొరత?
Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
IPL 2026 Live Streaming: ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఏ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలన్నీ ఒక్క క్లిక్‌లో తెలుసుకోండి!
ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఏ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలన్నీ ఒక్క క్లిక్‌లో తెలుసుకోండి!
Embed widget