అన్వేషించండి

Geeta Reddy Slams Assam CM: బీజేపీ నీచమైన రాజకీయాలు చేస్తోంది, ఆ సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని గీతారెడ్డి డిమాండ్

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు రాజకీయాలను పూర్తిగా కలుషితం చేస్తున్నారని మాజీ మంత్రి గీతా రెడ్డి విమర్శించారు.

Assam CM Himanth Biswa Sharma Remarks On Rahul Gandhi: దేశంలో బీజేపీ నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి అన్నారు. భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని.. కానీ బీజేపీ నేతలు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళళలను ఎంతో గౌరవించే దేశం మనది, ఇక్కడ ప్రతి మహిళను తల్లిగా, సోదరిగా భావిస్తాము, అలాంటిది అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Assam CM Himanth Biswa Sharma).. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి పైన నీచమైన భాషతో మాట్లాడటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. 

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు రాజకీయాలను పూర్తిగా కలుషితం చేస్తున్నారని విమర్శించారు. ఇంత ఘోరమైన రాజకీయాలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. కుటుంబాల గురించి మాట్లాడి బీజేపీ ప్రపంచంలో దేశ ప్రతిష్టను దిగజారుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి మండిపడ్డారు. అస్సాం ముఖ్యమంత్రిపై బీజేపీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకొని ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy) మండిపడ్డారు. అస్సాం సీఎం దేశంలో ఉండే మాతృమూర్తులందరినీ అవమానించే విధంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు వివాదం ఏంటంటే.. 
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాల్గొన్న కార్యక్రమంలో అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ హద్దులు దాటి మాట్లాడారు. భారత సైన్యం పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నమ్మడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయా అని రాహుల్ గాంధీ అడుగుతున్నారని చెప్పారు. అయితే రాహుల్ గాంధీని ఎప్పుడైనా నువ్వు రాజీవ్ గాంధీ కుమారుడివేనా అని మేమెప్పుడు ప్రశ్నించలేదుగా అని హేయమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం శర్మ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

Also Read: Revanth Reddy: కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ భరించదు, ఇప్పటికే రెండు సార్లు మోసపోయాం: రేవంత్ రెడ్డి

Also Read: Telangana CM KCR Birthday: ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్‌డే, ఈ నెల 15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాలకు కేటీఆర్ పిలుపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru | ఆర్సీబీ బౌలర్ల తడా ఖా.. వణికిపోయిన SRH | ABPYS Sharmila on YS Jagan | పసుపు కలర్ చంద్రబాబు పేటేంటా..?నీ సాక్షి పేపర్ లో ఉన్న పసుపు మాటేంటీ |Pawan Kalyan on YS Jagan | కోస్తా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ అంటున్న పవన్ | ABP DesamGoogle Golden Baba | రోజుకు 4 కేజీల బంగారు నగలు వేసుకుంటున్న గూగుల్ గోల్డెన్ బాబా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Embed widget