అన్వేషించండి

Hyderabad: గేటెడ్ కమ్యూనిటీ లలో పోలింగ్ కేంద్రాలు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏర్పాటుకు సన్నాహాలు

Hyderabad : గ్రేటర్ పరిధిలోని పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా  గేటెడ్ కమ్యూనిటీలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఎన్నికల అధికారుల ప్రయత్నం. వచ్చే లోక్ సభ ఎన్నికలకల్లా సంపూర్ణ ప్రణాళిక.

తెలంగాణలో ఎన్నికల హడావిడి  మొదలైంది. ప్రధాన పార్టీలు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి. ఓటర్లను వలలో వేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయ్. మరోవైపు అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్పించిన  యంత్రాంగం వారు  తమ ఓటు హక్కు ను ఖచ్చితంగా వినియోగించుకొనేలా చూడటానికి కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపధ్యంలో  హైదరాబాద్ (Hyderabad) నగరంలో  పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికను రూపొందించే ప్రయత్నం చేశారు ఎన్నికల అధికారులు.  గేటెడ్ కమ్యూనిటీలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తమ సంసిద్ధత ప్రకటించారు. తాజాగా జరగనున్న శాసనసభ ఎన్నికల్లో (Assembly Elections 2023) ఈ ప్రణాళికను ఉపయోగిద్దామని భావించారు. అయితే ఈ విషయంపై కొన్ని కమ్యూనిటీల ప్రతినిధులతో చర్చించినప్పుడు వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటం,  ఈలోపే పోలింగ్ కేంద్రాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సిన సమయం ఆసనం అవడంతో అధికారులు ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.  ఈసారి కాకపోయినా వచ్చే ఏడాది మార్చి -ఏప్రిల్ లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో అయినా సరే   గేటెడ్ కమ్యూనిటీలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి తీరుతామని రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఎన్నికల అధికారులు తెలిపారు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు ఓటర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు, ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు వీలుగా కేంద్రీయ ఎన్నికల సంఘం కొత్త కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఓటర్ల తొలగింపు, ఎన్నికల ఖర్చుపై నిఘా, ఓటర్ల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ లో ఏర్పాటు, సరిహద్దుల్లో చెక్ పాయింట్లు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు, వృద్ధుల కోసం పోస్టల్ బ్యాలెట్ వంటివి ఇందులో ఉన్నాయి. 

 సాధారణంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1400 మంది ఓటర్లు మాత్రమే ఉండాలి. ప్రతి రెండు కిలోమీటర్ల దూరం కి ఒక బూత్ ఏర్పాటు చేయాలి. అయితే హైదరాబాద్ తో సహా ముంబై, ఢిల్లీ ,బెంగళూరు,  చెన్నై వంటి నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ల సంఖ్య పెరుగుతోంది. వీటిలో ఒక్కో దాన్లోనే 2000 మందికి పైగా ఓటర్లు ఉంటారు. కాబట్టి వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలి అంటే ఆ గేటెడ్ కమ్యూనిటీ లోనే ఒక ఓటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే పోలింగ్ శాతం పెరుగుతుంది అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన.  అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రవీంద్ర నగర్ నియోజకవర్గాల్లో  రెండు వేలకు పైగా ఓటర్లు  ఉన్న 32  గేటెడ్ కమ్యూనిటీలను ఎన్నికల అధికారులు గుర్తించారు.  వాటిలో పోలింగ్ బూతుల ఏర్పాటు విషయంపై అక్కడి ప్రతినిధులతో చర్చించారు అయితే వీరంతా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఐటీ సంస్థల ఉద్యోగులు,  ఉన్నతాధికారాలు,  ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల విధులు నిర్వహిస్తున్న వారు ఇక్కడికి వచ్చే పోలీసులు,  ఎన్నికల అధికారులకు సేవలు ఎవరు చేస్తారని ప్రశ్నించారు. బిజీగా ఉండే తాము ఇక్కడికి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించలేమని తేల్చి చెప్పారు. అయితే మరి కొందరు మాత్రం ఈ ఆలోచనపై ఉత్సాహం చూపించారు. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే ఒక కుటుంబం ఒకే పోలింగ్ బూత్ లో ఓటు వేసి అవకాశం కలుగుతుందని  కూడా వారు అభిప్రాయపడ్డారు. సుమారు 32 గేటెడ్ కమ్యూనిటీల ప్రతినిధులతో మాట్లాడిన తరువాత  ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో మాత్రమే ఇప్పటివరకు పోలింగ్ బూత్ ఏర్పాటుకు అన్నిరకాలుగా అంగీకారం కుదిరినట్టు సమాచారం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Embed widget