అన్వేషించండి

Gajwel Revant : సెప్టెంబర్ 17న గజ్వేల్‌లో దండోరా ! కేసీఆర్‌కు షాకిచ్చేందుకు రేవంత్ పక్కా ప్లాన్ !

కేసీఆర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి బలప్రదర్శకు సిద్ధమయ్యారు. తెలంగాణ విమోచనా దినోత్సవం రోజునే సభ నిర్వహిస్తున్నారు. భారీ జన సమీకరణతో పాటు చేరికలు కూడా ఉండేలా చూసుకుంటున్నారు.

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో సెప్టెంబర్ 17వ తేదీన దళిత,గిరిజన దండోరా సభ జరగనుంది. అదే రోజు తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తారు. ఆ రోజున రాహుల్ గాంధీ కూడా తెలంగాణకు  రావాల్సి ఉన్నందున ఇప్పటి వరకూ ఆయన పర్యటన అధికారికంగా ఖరారు కాలేదు. అయితే మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉంది. ఆ రోజున తెలంగాణ విమోచన దినం కావడంతో అటు బీజేపీ .. ఇటు కాంగ్రెస్ సభలతో హోరెత్తించబోతున్నాయి. గజ్వేల్ నడిబొడ్డున సమరశంఖం పూరించి కేసీఆర్‌కు రాజకీయ సవాల్ పంపాలని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. Also Read : దళిత బంధు కోసం మరో పైలట్ ప్రాజెక్ట్ గ్రామం


సెప్టెంబర్ 17న తెలంగాణ కాంగ్రెస్ నేతలు  వరంగల్‌లో దళిత, గిరిజన దండోరాను నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఆ తేదీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా గజ్వేల్‌కు మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం కావడంతో గజ్వేల్ దళిత, గిరిజన దండోరాను ఓ రేంజ్‌లో సక్సెస్ చేయాలని రేవంత‌్ ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజులుగా గజ్వేల్ కాంగ్రెస్ సభపై వివాదం రేగుతోంది. అడ్డుకుంటామని టీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేయడమే దీనికి కారణం. అడ్డుకుంటే తొక్కుకుంటూ వెళ్తామని రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ప్రకటనలు ఇచ్చారు.  ఈ క్రమంలో తెలంగాణ విమోచనా దినోత్సవం రోజునే గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి సభను ఏర్పాటు చేశారు. Also Read : టీడీపీ వర్సెస్ టీడీపీ ! నేతల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రతిపక్షానికి అసలు సమస్యా..!?


విజయవంతం చేయడాన్ని సవాల్‌గా తీసుకున్నారు. సభ విజయవంతం కోసం  రేవంత్ రెడ్డి అందర్నీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ల సలహాలు, సహకారాన్ని తీసుకుంటున్నారు. పీసీసీ మాజీ చీఫ్‌లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ సహా సీనియర్ నేతలందరితో సమావేశం కావాలని నిర్ణయించారు.  రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత అంటీ ముట్టనట్లుగా ఉన్న నేతలను కూడా పిలిచారు. కోమటిరెడ్డికి కూడా ఆహ్వానం వెళ్లినట్లుగా తెలుస్తోంది.  గజ్వేల్ సభకు మల్లిఖార్జున ఖర్గేను ప్రత్యేక ఆహ్వానితునిగా వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో పలువురు నేతల్ని కూడా పార్టీలో చేర్చుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read : అనుకున్నంతలోనే సీఎంల మార్పు ! బీజేపీలో మోడీ,షాల పట్టుకు నిదర్శనమా..? బలమైన నేతల్ని ఎదగనీయకపోవడం కారణమా...?


రేవంత్ రెడ్డి పార్టీ యూత్ గ్రూపులను యాక్టివ్‌గా ఉంచుతున్నారు.  ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ లాంటి విభాగాల నుంచి కూడా శ్రేణులను గజ్వేల్ సభకు తరలించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ వన్ మ్యాన్ షో చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గజ్వేల్ సభను అనుకున్న స్థాయిలో నిర్వహించగలిగితే.. కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ లభించే అవకాశం ఉంది. ఓ వైపు అమిత్ షా సభ నిర్మల్‌లో జరగనుంది.. మరో వైపు  కేసీఆర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హోరెత్తించనుంది. దీంతో తెలంగాణ రాజకీయం వేడెక్కనుంది. Also Read : మన చేప- మన ఆరోగ్యం... ఏపీలో సర్కారు వారి చేపలు...!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget